breaking news
girl committe suicide
-
Yadadri: చెరువులో దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: భువనగిరి మండలం రాయగిరి చెరువులో దూకి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, స్థానికుల సమాచారంతో పోలీసులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు కట్టపై లభించిన సెల్ఫోన్, ఇతర వస్తువుల ఆధారంగా యువతి.. హైదరాబాద్ లాలాపేట్కు చెందిన గీతా రాణి(26)గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు యువతి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్కు వచ్చి.. -
ప్రేమ విఫలంతో యువతి ఆత్మహత్య
కరీంనగర్: ప్రేమించిన వాడు మొఖం చాటేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని కావేటి సరిత(19) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది.గోదావరిఖని అంబేద్కర్నగర్కి చెందిన సరిత తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి గాజుల వ్యాపారం చేసుకుంటూ తన ముగ్గురు పిల్లలను చదివించుకుంటుంది. సరిత హైదరాబాద్లో ఉంటూ ఇంజనీరింగ్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ సమయంలోనే అదిలాబాద్కు చెందిన రాములుతో ప్రేమలో పడింది. పెళ్లి ప్రస్థావన వచ్చేసరికి అతను విముఖత చూపడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సరిత మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు వివరాలను సరిత త ల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.