breaking news
general bikram singh
-
తూటాకు తూటా: బిక్రంసింగ్
న్యూఢిల్లీ: సైన్యాధిపతి జనరల్ బిక్రంసింగ్ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని.. అదే రీతిలో స్పందిస్తామన్నారు. సైనిక దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో బిక్రంసింగ్ మాట్లాడారు. భారత జవాను తలనరికిన పాక్ సైనికులపై ఆర్మీ ప్రతీకారం తీర్చుకోలేదన్న వాదనను బిక్రంసింగ్ ఖండించారు. ‘‘చర్య తీసుకున్నాం.. డిసెంబర్ 23నాటి జియో టీవీ కథనాన్ని చూడండి. పాక్ ఆర్మీ అధికారి, తొమ్మిది మంది జవాన్లు మరణించారని.. 12-13 మంది గాయాలపాలయ్యారని తెలుస్తుంది. ఇది భారత జవాన్లు సాధిం చిందే’’ అని బిక్రంసింగ్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో సైన్యం ఉండాల్సిందేనన్నారు. ఆర్మీ బలగాల మోహరింపు విషయంలో పరిస్థితులు మెరుగుపడే వరకూ వేచి ఉండాలని చెప్పారు. సమీప భవిష్యత్తులో పోరాట ప్రాంతా ల్లో మహిళా సైనికాధికారులను నియమించే అవకాశం లేదన్నారు. -
సరిహద్దు దాటి వస్తే కాల్చిపారేస్తాం: ఆర్మీ చీఫ్
ఏ ఉగ్రవాది అయినా సరే.. జమ్ము కాశ్మీర్ వద్ద నియంత్రణ రేఖను దాటి వచ్చాడంటే వెంటనే కాల్చిపారేస్తామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించి నియంత్రణ రేఖ వద్ద ఓ పౌరుడిపై కాల్పులు జరిపిందంటూ పాకిస్థానీ మీడియా గోల పెట్టడంతో ఆయనీ ప్రకటన చేశారు. 'ఎల్ఓసీని దాటి వచ్చే ఏ ఉగ్రవాదిమీద అయినా కాల్పులు జరిపి తీరుతాం' అని ఆయన స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుపక్షాలూ గౌరవించేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నామే గానీ పెంచి పోషించాలని మాత్రం అనుకోవడం లేదని అన్నారు. పొరుగువారు నిబంధనలు పాటిస్తే తాము కూడా పాటిస్తామని, వాళ్లు ఉల్లంఘిస్తే తాము కూడా ఉల్లంఘించి తీరుతామని విక్రమ్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల రాకను అడ్డుకోడానికే తాము కాల్పులు జరుపుతున్నాం తప్ప పౌరుల మీద కాదని జనరల్ అన్నారు. డిసెంబర్ నెలలో ఇరుదేశాల డీజీఎంఓల సమావేశం తర్వాతి నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘనలు గణనీయంగా తగ్గాయన్నారు.