breaking news
Ganesh utav
-
చికాగోలో ఘనంగా గణేష్ నిమజ్జనం
చికాగో : అమెరికాలోని చికాగో నగరంలో వినాయక నిమజ్జన వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో(ఐఏజీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిమజ్జన వేడుకలకు నగరంలోని ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా విజయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గణేష్ విగ్రహంపై పూల జల్లు కురిపించారు. బ్యాండ్ మేళాతో యువత వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ప్రత్యేక వాహనంలో వినాయకుడి విగ్రహాన్ని తరలించి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు. ఈ సంరద్భంగా ఐఏజీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మనోజ్ సింగంసెట్టి మాట్లాడుతూ.. అందరి సహకారంతో వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా ముగించామని తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రతిభింబించేలా ఈవెంట్ను తీర్చిదిద్దిన డెకరేషన్ టీం స్టార్బీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విరాళాలు ఇచ్చిన దాతలకు, కమ్యూనిటీ సభ్యులకు, బోర్డ్ డైరెక్టర్లకు, వాలెంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఐఏజీసీ వైస్ ప్రెసిడెంట్ హీనా త్రివేది మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన పోలీసులకి, స్థానిక ప్రజాపతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఏజీసీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ హరిందర్రెడ్డి పులియాల, రాజేశ్వరి రావత్, తృప్తి పటేల్, రాధికా దేశాయి, విఠల్ దేశాయి, అపర్ణ దేశ్ముఖ్, పరూల్ టోపివాలా, విద్యశ్రీ పూజారి, సందీప్ ఎల్లంపల్లి, అంకూర్, పూనమ్, తేజస్ రెడ్డి, మధు, ప్రవీణ్, సత్యనారాయణ, శ్రీనివాస్ కాసల, రాజవర్ధన్రెడ్డి, దివ్య, పూనమ్ జైన్, వినోద్ కుమార్, సాక్షి అగర్వాల్, రాజేశ్, మురళి, అనిత మందాడి, మమత ఉప్పల, శిల్ప మచ్చ, భావన పులియాహ, లక్ష్మీ నాగుబండి తదితరులు పాల్గొన్నారు. -
భక్తి పారవశ్యం.. నాట్య సమ్మోహనం
విజయవాడ కల్చరల్ : డూండీ గణేశ్ సేవా సమితి నిర్వహణలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలోని గోకరాజు గంగరాజు కళావేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను భక్తిరస సంద్రంలో ముంచెత్తుతున్నాయి. గురువారం నాటి కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభంలో సుసర్లనందిని వీణావాదన హృద్యంగా సాగింది. అన్నమయ్య, రామదాసు తదితర వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. సత్యనారాయణపురానికి చెందిన లలిత బృందంలోని చిన్నారులు 72 అడుగుల వినాయక విగ్రహం ముందు కోలాటం ప్రదర్శించారు. మహిళా భక్తులు సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా నాట్యాచార్యుడు ఘంటసాల పవన్కుమార్ బృందం పలు అంశాలకు నాట్యాన్ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమాలను శింగంశెట్టి పెదబ్రహ్మం, చింతకాయల చిట్టిబాబు నిర్వహించారు. ధర్మరక్షణే మన కర్తవ్యం ధర్మరక్షణే మన కర్తవ్యమని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి అనుగ్రహ భాషణ చేశారు. గురువారం సాయంత్రం 72 అడుగుల గణనాథుడిని సిద్ధేశ్వరానంద భారతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన భారతీయ సంప్రదాయాలను కాపాడుకోవాలని, నియమబద్ధమైన జీవితం గడపాలని పిలుపునిచ్చారు. తొలుత స్వామీజీకి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.