-
మత్స్యకారుల ఆశలపై యుద్ధమేఘాలు...?
ఎచ్చెర్ల క్యాంపస్: జీవనోపాధి కోసం వలస వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్కు బందీలుగా మారారు. వారి విడుదల కేంద్ర హోం, విదేశాంగ శాఖల జోక్యంతోనే సాధ్యం. చెరలో ఉన్న గంగపుత్రుల విడుదలకు ప్రయత్నాలు జరుగుతుండగా.. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం వారి కుటుంబ సభ్యుల ఆశలపై నీళ్లు చల్లింది. తమ వారు ఇంత తొందరగా వస్తారో రారోనని వారిలో ఆందోళన తీవ్రమైంది. గుజరాత్ రాష్ట్రం వీరావల్లో చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్తాన్ జలాల్లో ప్రవేశించిన మత్స్యకారులు చెరశాల పాలయ్యారు. గత ఏడాది నవంబర్ 27న ఈ సంఘటన జరిగింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వీరి తప్పు లేదని తెలిపింది. భారత రాయబార కార్యాలయం వీరి విడుదలకు ప్రయత్నిస్తోంది. పరిస్థితి సానుకూలంగా మారింది. తాము క్షేమంగా ఉన్నామని బందీలుగా ఉన్న మత్స్యకారులు రాసిన ఉత్తరాలు ఈ నెల 2న కుటుంబ సభ్యులకు చేరాయి. దీంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో గత కొద్ది రోజులుగా సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో బందీలుగా ఉన్న మత్స్యకార కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పాక్ చెరలో ఉన్న 22 మందిలో మన జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన వారు ఒకరు కాగా, ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం, బడివానిపేట, తోటపాలెం పంచాయతీలకు చెందిన వారు 14 మంది ఉన్నారు. ఎలాంటి అవరోధం లేకుండా తమ వారు స్వస్థలాలకు చేరుకోవాలని వారి కుటుంబ సభ్యులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని వేడుకుంటున్నారు. అనుకూల వాతావరణం ఉండేది మత్స్యకారులు పాకిస్తాన్కు చిక్కిన సమయంలో అనుకూల వాతావరణం ఉండేది. ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో విడుదలవుతారనుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్య తీసుకు వెళ్లాం. బందీలుగా ఉన్న వారి నుంచి ఈ నెల 2న ఉత్తరాలు అందాయి. పాకిస్తాన్ భద్రత దళాలు దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేస్తే విడుదల సాధ్యమయ్యేది. –మూగి రామారావు,మత్స్యకార యూనియన్ నాయకులు, డి.మత్స్యలేశం -
ఫిషింగ్ హార్బర్పై.. నయాడ్రామా
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు విషయంలో నాలుగేళ్లపాటు మత్స్యకారులను ఊరిస్తూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ సరికొత్త నాటకానికి తెరతీసింది. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) పంపితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి సగం నిధులు మంజూరు చేస్తామన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల సంవత్సరం కావడంతో హడావుడిగా కేంద్రానికి నివేదికను పంపారు. అయితే దీనిని కేంద్రం తిరస్కరించింది. ‘‘మేము ఎప్పుడు పంపమన్నాం.. మీరు ఎప్పుడు పంపారు.. ఇప్పుడిస్తే నిధులు ఇవ్వం’’ అంటూ డీపీఆర్ను కేంద్రం తిప్పి పంపేసింది. జరిగిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారపార్టీ కొత్త ఎత్తుగడ వేసింది. మత్స్యకారులను మరోసారి మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే విడతల వారీగా హార్బర్ను నిర్మిస్తుందన్న కొత్త డ్రామా మొదలెట్టింది. రూ.50 కోట్లతో పనులు ప్రారంభిస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా అధికారుల నుంచి తెప్పించుకుంది. ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచింది. కావలి (నెల్లూరు): సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ను ప్రభుత్వం ప్రైవేట్ పోర్టు నిర్మాణం కోసం తొలగించింది. వేరే ప్రాంతంలో హార్బర్ నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించి స్థల అన్వేషణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లు గడిపేసింది. కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామం వద్ద íఫిషింగ్ హార్బర్ నిర్మించాలని, ఏడాదిన్నర క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.244 కోట్లతో తొలి దశలో నిర్మించాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్కు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.122 కోట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. నిర్మాణ పనులు ప్రారంభిస్తే మూడేళ్లకు కానీ పూర్తి కాదు. అయితే అధికార టీడీపీ నేతలు ఈ పనులను ఎన్నికల వాతావరణంలో ప్రారంభించేలా చేయడానికి కాలయాపన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లాలోని మత్స్యకారులు అవస్థలు పడుతూ నష్టపోతున్నారు. తరలుతున్న మత్స్యసంపద 169 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న జిల్లాలోని 12 మండలాల్లో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారులే 1.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో లక్ష మంది చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే ప్రత్యక్షంగా లక్ష మంది మత్స్యకారులకు, పరోక్షంగా మరో లక్ష మందికి జీవనోపాధి దొరికే అవకాశం ఉంది. జిల్లాలో మెకనైజ్డ్ బోట్లు అధికారికంగా, అనధికారికంగా కలిపి 7,000 ఉన్నాయి. అలాగే కొయ్య తెప్పలు 4,000, పెద్ద బోట్లు 20 ఉన్నాయి. ఒక్కో దాంట్లో కనీసం ముగ్గురు నుంచి 10 మంది వరకు చేపల వేట చేస్తారు. వీరు ఒడ్డుకు తెచ్చే మత్స్యసంపద ఏడాదికి 75 వేల టన్నులు ఉంటుంది. ఇందులో కేవలం 20 శాతం మాత్రమే జిల్లాలోని మార్కెట్లకు తరలుతోంది. మిగిలిన మత్స్యసంపద అంతా కూడా ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు తరలిపోతోంది. అయితే ఫిషింగ్ హార్బర్ లేకపోవడంతో మత్స్య సంపదను తీరంలో దించుకోవడానికి అనువైన ప్రదేశాలు లేవు. అలాగే మంచి ధరలకు అమ్మకాలు చేయడానికి వ్యాపారులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో పడవలు, బోట్లలను ప్రకాశం జిల్లాలోని వాడరేవు, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సివస్తోంది. దీని వల్ల సమయం, డీజిల్ ఖర్చు పెరగడం, సొంత ఊర్లకు రావాలంటే బస్సుల్లో, రైళ్లలో ప్రయాణాలు తప్పడం లేదు. దీనివల్ల మత్స్యకారులు దళారుల చేతిలో అన్ని రకాలుగా నష్టపోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ దమననీతి జిల్లాలోని మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కోరుతుండడం, కేంద్ర ప్రభుత్వం తన ‘సాగరమాల’ పథకంలో భాగంగా జిల్లాలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి నిధులు మంజూరుకు పచ్చ జెండా ఊపింది. అయితే సమగ్ర నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తే నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ‘వాప్కోస్ లిమిటెడ్’ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా నివేదికను తయారు చేయించింది. ఆ నివేదికను అధికారికంగా తీసుకున్నప్పటి నుంచి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు ప్రారంభించలేదని జిల్లాలోని మత్స్యకారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిఉంటుందని అధికార టీడీపీ నాయకులు భావించారు. అందుకే ఏడాదిన్నర క్రితం ‘వాప్కోస్ లిమిటెడ్’ జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సమగ్ర అధ్యయనంతో కూడిన నివేదికను సిద్ధం చేసినప్పటికీ దానిని గోప్యంగా ఉంచి గత సెప్టెంబర్ నెలలో నివేదిక అందినట్లుగా వారు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో సమర్పించి నిధులు మంజూరు చేయమని కోరలేదు. నివేదికను సమర్పించగానే కేంద్ర తన వాటా నిధులను మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాల్సి వస్తుందని నివేదికను న్యూఢిల్లీకి పంపలేదు. వచ్చే ఏడాది జనవరి నెల తర్వాత నిధులు మంజూరయ్యేటట్లుగా చేసి, టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికార టీడీపీ నాయకులు తలపోస్తున్నారు. అంటే ఎన్నికలు దగ్గర పడే వేళ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నట్లుగా జిల్లాలోని మత్స్యకారులను మభ్యపెట్టి ఓట్లు పొందాలనే దమననీతిని అవలంభించారు. అది బెడిసికొట్టింది. అధికార టీడీపీ నాయకుల కుయుక్తుల వల్ల జిల్లాలో మత్స్యకారుల ఆర్థిక ఉన్నతికి దోహదపడే ఫిషింగ్ హార్బర్ అటకెక్కింది. -
పట్టుకున్న డబ్బంతా ఎన్నికలదేనా?
ఎక్కడ ఏ డబ్బు చూసినా.. ఎన్నికల అధికారులు మాత్రం ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నదనే భావిస్తున్నారు. ముందు, వెనకా చూడకుండా ముందు స్వాధీనం చేసేసుకుంటున్నారు. ఆ తర్వాతే దానికి సంబంధించిన విచారణ చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొంతమంది వ్యక్తులు బ్యాంకు నుంచి డ్రా చేసుకుని 2 కోట్ల రూపాయలు తీసుకెళ్తుంటే పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. ఇంకేముంది, ఆ సొమ్ము మొత్తం ఒక పార్టీ ఎన్నికల్లో పంచిపెట్టడానికి తీసుకెళ్తున్నదేనంటూ వదంతులు వ్యాపించాయి. కానీ తీరా చూస్తే, ఒక పెద్ద నిర్మాణ సంస్థ తమ సంస్థలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఆ సొమ్ము డ్రా చేసినట్లు తర్వాత తేలింది. అలాగే, కృష్ణా జిల్లా నూజివీడులో మత్స్యకారుల సంఘానికి చెందిన 35 లక్షల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఈ డబ్బు నూజివీడు ప్రాంతంలోని 4 మండలాల్లో చేపల చెరువులకు సంబంధించినది. దాదాపు 170 కుటుంబాలకు చెందిన ఈ డబ్బు వారి యూనియన్ అధ్యక్షుడు షేక్ బాజీ దగ్గర ఉంది. చేపలు అమ్మగా వచ్చిన మొత్తం ఇలా అధ్యక్షుడి వద్ద ఉంచి, ఆరు నెలలకోసారి పంచుకోవడం వాళ్లకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. అలా పంచుకోవడానికి ఉంచిన డబ్బు గురించి ఎవరో ఫోన్ చేసి చెప్పడంతో.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా, లెక్కల్లోకి మాత్రం ఘనంగా 125 - 130 కోట్ల వరకు దొరికిందని ప్రకటిస్తున్నా, అందులో నిజంగా ఎన్నికల సొమ్ము ఎంతో, ఇతరత్రా సొమ్ము ఎంతో అనే విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement