breaking news
fishermen demand
-
ఆక్వా వ్యర్థాలను తీరానికి తరలించొద్దు
నరసాపురం రూరల్: భీమవరం మండలం తుందుర్రులో ని ర్మిస్తున్న గోదావరి ఆక్వాఫుడ్ పార్కులో వ్యర్థాలను, ఫ్యాక్టరీని తీరానికి తరలించవద్దంటూ తీర ప్రాంత గ్రామ మత్స్యకారులు మంగళవారం ఆందోళన చేశారు. ఎంపీటీసీ సభ్యుడు మైల వసంతరావు నేతృత్వంలో చినమైనవానిలంక గ్రామంలో సముద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ మోళ్లపర్రు నుంచి బియ్యపుతిప్ప వరకూ తీర ప్రాంత గ్రామాల్లో వేలాది మంది మత్స్యకారులు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఆక్వా పార్క్ వ్యర్థాలతో వీరి ఉపాధికి గండి పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను పైపుల ద్వారా సముద్రంలోకి తరలించినా లేదా ఫ్యాక్టరీని తీర ప్రాంతంలో నిర్మించినా మత్స్యకారులకు నష్టం వాటిల్లుతుందన్నారు. జల కాలుష్యం కారణంగా ఇప్పటికే మత్స్య సంపద తగ్గిపోయిందని, ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ వల్ల మరిం త ప్రమాదం తప్పదని అన్నారు. ఒడుగు జనార్దన్, మైల అర్జునరావు, ఒడుగు సంబమూర్తి తదితరులు ఉన్నారు. -
'హుద్ హుద్' కాలనీలో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు
కుందూవానిపేట : శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం కూందూవానిపేటలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. హుద్ హుద్ తుఫాను కాలనీ నిర్మాణాన్ని చేపట్టవద్దంటూ మత్స్యకారులు అడ్డుకున్నారు. తుఫాను వల్ల నష్టపోయిన వారికి అధికార ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనిదే నిర్మాణాన్ని చేపట్టొద్దని అధికారులను డిమాండ్ చేశారు. కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో భారీగా పోలీసులను మొహరించారు. టీడీపీ సర్కార్ తమకు నష్టపరిహారం చెల్లించడంలేదంటూ బాధిత మత్స్యకారులు ఆరోపించారు. 2014లో హుద్ హుద్ తుఫాన్ సంభవించి ఉత్తరాంధ్రలో భారీగా నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.