గతవారం బిజినెస్
మొబైల్ యాప్లో మాత్రమే ఫ్లిప్కార్ట్ సేవలు!
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తను కొనుగోలు చేసిన ఫ్యాషన్ పోర్టల్ మింత్రా దారిలోనే పయనిస్తోంది. సెప్టెంబర్ నుంచి ఫ్లిప్కార్ట్ కేవలం మొబైల్ యాప్లో మాత్రమే కార్యకలాపాలను నిర్వహించనుంది. అంటే ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ మూతపడనుంది. ప్రస్తు తం కంపెనీ లావాదేవీలు దాదాపు 70-75 వరకు మొబైల్ యాప్ ద్వారానే జరుగుతున్నాయి.
ఈ షేర్లు కొనేటప్పుడు జాగ్రత్త
ట్రేడింగ్ జరగని 450కు పైగా కంపెనీల్లో షేర్లు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్టాక్ ఎక్స్ఛేంజ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు తమ సభ్యులను హెచ్చరించాయి. ఈ రెండు జాబితాల్లో ఉన్న కొన్ని కంపెనీల షేర్లు-బిల్పవర్, గుజరాత్ లీజ్ ఫైనాన్సింగ్, తిజరియ పాలిపైప్స్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ అండ్ సొల్యూషన్స్, జెనిత్ కంప్యూటర్స్, ప్రదీప్ ఓవర్సీస్, గోల్డ్స్టోన్ టెక్నాలజీస్.
నెట్వర్క్18లో రిలయన్స్ షేర్ల విక్రయం
నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.10 శాతం వాటాలను విక్రయించింది. ఇందుకోసం షేరు కనీస ధరను రూ. 53.40గా నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ప్రమోటర్ గ్రూప్ వాటాలను 75 శాతానికి తగ్గించుకునేందుకు, పబ్లిక్ షేర్హోల్డింగ్ 25%కి పెంచేందుకు నెట్వర్క్18 ఈ నిర్ణయం తీసుకుంది.
ఓఎఫ్ఎస్ ద్వారా రూ.77 వేల కోట్ల సమీకరణ
భారత కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో భారీగా నిధులు సమీకరించాయి. 2012, ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 129 కంపెనీలు ఓఎఫ్ఎస్ విధానంలో రూ.77,023 కోట్ల నిధులు సమీకరించాయి. దీంట్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా రూ.63,576 కోట్లుగా ఉంది. కంపెనీలు ఓఎఫ్ఎస్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.28,486 కోట్లు చొప్పున నిధులు సమీకరించాయి.
హైదరాబాద్లో ఉబర్ కేంద్రం
ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబర్ ఇప్పుడు భారత్లో భారీగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా రెస్పాన్స్, సపోర్ట్ ఫెసిలిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తోంది. ఇందుకు వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.317 కోట్లను వెచ్చించనుంది. ఫెసిలిటీలో 500 మందికి ఉపాధి లభించనుంది.
పీఈ పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు 128 డీల్స్లో 4 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఈ మొత్తం 80 శాతం అధికం. గతేడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 115 లావాదేవీల్లో పీఈ సంస్థలు 2.24 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి.
మూడు నెలల కనిష్టానికి బంగారం
బంగారం ప్రధాన బులియన్ మార్కెట్లో బుధవారం మూ డు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. మంగళవారం ముగిం పుతో పోల్చితే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.155 తగ్గి రూ.26,100కు చేరింది. ఇక 22 క్యారె ట్ల పసిడి ధర అదే స్థాయిలో తగ్గి రూ.25,950కి పడింది.
యునెటైడ్ బ్రూవరీస్కు యూఎస్ఎల్ గుడ్బై
విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్(యూబీఎల్) నుంచి యునెటైడ్ స్పిరిట్స్(యుూఎస్ఎల్) పూర్తిగా వైదొలగింది. బ్రిటన్ లిక్కర్ దిగ్గజం డియాజియో ప్రస్తుతం యూఎస్ఎల్లో ప్రధాన వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. యూబీఎల్లో తనకున్న మొత్తం 3.21 శాతం వాటాను సుమారు రూ.872 కోట్లకు విక్రయించింది.
రూ. 55 వేల కోట్ల సమీకరణ దిశగా కేంద్రం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం బాండ్ల పథకం ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ద్వారా రూ.40,000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. దీని కోసం ఏడు ప్రభుత్వం రంగ సంస్థలకు అనుమతినిచ్చింది.
ఇండియా పోస్ట్ ఎస్ఎంఎస్ సర్వీసులు
ఇండియా పోస్ట్ సెప్టెంబర్ నుంచి వినియోగదారులకు పార్సిళ్లు, మని ఆర్డర్ తదితర వస్తువుల డెలివరీ సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా అందించనుంది. దీనితోపాటు జీపీఎస్తో పోస్ట్మ్యాన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే విధానాన్ని అక్టోబర్ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
ఈక్విటీ ఫండ్స్లోకి 9 బిలియన్ డాలర్లు
ఈ ఏడాది ప్రథమార్ధంలో భారత్ ఆధారిత ఈక్విటీ ఫండ్స్లోకి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు 9.52 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే వ్యవధిలో చైనా ఫండ్స్ నుంచి అత్యధికంగా 17 బిలియన్ డాలర్లు తరలిపోయాయి. భారత్, రష్యా మి నహా వర్ధమాన దేశాల మార్కెట్ల ఈక్విటీ ఫండ్స్ నుంచి ప్రథమార్ధంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
టీసీఎస్ లాభం రూ.5,684 కోట్లు
దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ ఈ ఏడాది జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,684 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,568 కోట్లతో పోలిస్తే లాభం 2.1 శాతమే వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ1లో 16.1 శాతం ఎగబాకి రూ.25,668 కోట్లకు చేరింది.
నిధుల సమీకరణ దిశగా మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రై వేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ.5,000 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఈ నిధులను స్వల్ప, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ వ్యాపార కార్యకలాపాలు, మూలధన వ్యయాల కోసం ఖర్చు చేయాలని కంపెనీ ఆలోచన. వచ్చే నెల 7న కంపెనీ సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం) జరగనుంది.. అప్పటి నుంచి దశలవారీగా ప్రై వేట్ ప్లేస్మెంట్ విధానంలో దేశీయ/ విదేశీ మార్కెట్ల ద్వారా ఈ నిధులను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.
తెలుగురాష్ట్రాల్లో ఫాక్స్కాన్ యూనిట్లు
చైనాకు చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్లో డేటా సెంటర్ను, ఇంక్యూబేటర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ల తయారీ యూనిట్ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. ఫాక్స్కాన్ కంపెనీ యాపి ల్ కోసం ఐఫోన్లను, ఐప్యాడ్లను, అమెజాన్ కోసం కిండి ల్ ట్యాబ్లను, ఇతర కంపెనీలకు ట్యాబ్లను, తదితర ఎల క్ట్రానిక్ వస్తువులను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ చేస్తోంది.
నియామకాలు
- బీజింగ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కు ప్రెసిడెంట్గా చైనా మాజీ ఆర్థికమంత్రి జిన్ లిక్విన్ ఎంపికయ్యారు.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్గా హరదయాళ్ ప్రసాద్ నియమితులయ్యారు.
- హౌసింగ్డాట్కామ్ తాత్కాలిక సీఈఓగా రిషబ్ గుప్తా నియమితులయ్యారు.
డీల్స్..
రిలయన్స్ ఇండస్ట్రీస్
- అమెరికాలోని షేల్ఆయిల్, గ్యాస్ పైప్లైన్ జాయింట్ వెంచర్లో ఉన్న తన 49.9 శాతం వాటాను ఎంటర్ప్రైజ్ ప్రాడక్ట్స్ పార్టనర్స్కు 1.07 బిలియన్ డాలర్లకు విక్రయించింది.
- రష్యా చమురు దిగ్గజం రాస్నెఫ్ట్, ఎస్సార్ ఆయిల్లో 49% వాటాలు కొనుగోలు చేయనుంది.
- ప్రోడక్ట్ అవుట్సోర్సింగ్ సంస్థ జెనీను ఆన్లైన్ హెల్త్కేర్ ప్లాట్ఫామ్ ప్రాక్టో కొనుగోలు చేసింది.
- డెన్మార్క్ కంపెనీ ‘డిజైన్ఇట్’ను రూ.595 కోట్లకు కొనుగోలు చేయాలని విప్రో భావిస్తోంది.