breaking news
EAMCET dispute
-
ఏపీ ఎంసెట్పై రేపు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెంట్ నిర్వహణపై సోమవారం తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసెట్ వివాదంపై రాష్ట్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యా శాఖ అధికారులు శనివారం సీఎం చంద్రబాబు తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి వేరుగా ఎంసెట్ నిర్వహించేందుకు శుక్రవారం షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో, దానివల్ల కలిగే నష్టాలు, తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు. మరింత ఆలోచించి ముందుకెళ్లాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సోమవారం మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. -
అపోహలకు తావివ్వకండి: నరసింహన్
-
అపోహలకు తావివ్వకండి: నరసింహన్
* తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ * ‘ఎట్ హోం’ అనంతరం 45 నిమిషాలు ఏకాంతంగా భేటీ * ఎంసెట్, నాగార్జునసాగర్ వివాదంపై మంతనాలు! * చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచన * ఆహ్లాదంగా సాగిన ‘ఎట్ హోం’ కార్యక్రమం * హాజరైన ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు, ప్రముఖులు * అందరి దగ్గరికీ వెళ్లి చొరవగా పలకరించిన గవర్నర్ దంపతులు సాక్షి, హైదరాబాద్: ‘‘రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోండి. అనవసరమైన అపోహలకు అవకాశం కల్పించకండి. లేని వివాదాలకు తావివ్వకండి...’’.. అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. 66వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ సోమవారం సాయంత్రం రాజ్భవన్లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కేసీఆర్, చంద్రబాబుతో తన నివాసంలో గవర్నర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. కొద్దిరోజులుగా తెలంగాణ, ఏపీ మధ్య ఎంసెట్ నిర్వహణతోపాటు ప్రాజెక్టుల్లో నీళ్లు, విద్యుత్ తదితర అంశాలపై వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో పలుమార్లు గవర్నర్ భేటీ అయ్యారు. ఒకసారి ఇద్దరు సీఎంల తోనూ సమావేశం జరిగినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని నరసింహన్ పలుమార్లు సూచించారు కూడా. ఈ నేపథ్యంలో ‘ఎట్ హోం’ రూపంలో కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గవర్నర్ ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి చర్చించారు. ఎంసెట్ మాత్రమేగాకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల వ్యవహారం ఇటీవల ప్రధాన సమస్యగా మారింది. సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా నదీ జలాల వివాదం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ అంశాలపైనా సీఎంల మధ్య చర్చ జరిగి నట్లు భావిస్తున్నారు. ఎంసెట్ నిర్వహణపై పంతానికి పోకుండా చెరో ఏడాది నిర్వహించుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటారు ఈ భేటీకి ముందు ‘ఎట్ హోం’ కార్యక్రమం నుంచి సీఎంలను తన నివాసంలోకి తీసుకుని వెళుతూ గవర్నర్ మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ‘‘రెండు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. చూస్తున్నారు కదా.. ఇద్దరు సీఎంలూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అందరికీ మంచి జరిగేలా, అన్ని సమస్యలపై ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు..’’ అని గవర్నర్ చెప్పారు. అందరికీ పలకరింపు: ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, హరీశ్రావు, కేటీఆర్ సహా మంత్రులంతా వచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత జానారెడ్డి, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అధికార టీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారులను ఒక్కో టేబుల్ వద్దకు వెళుతూ గవర్నర్ దంపతులు కలిశారు. ఇద్దరు ‘చంద్రుల’ ముచ్చట్లు ‘ఎట్ హోం’కు హాజరైన కేసీఆర్, చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ సీటుకు అటూ ఇటూ ఇద్దరు ముఖ్యమంత్రులకు సీట్లు కేటాయించారు. అయితే గవర్నర్ సీట్లో లేని సమయంలో కేసీఆర్, చంద్రబాబు ఒకొరికొకరు దగ్గరగా వచ్చి మాట్లాడుకున్నారు. దీనిని చూసిన నేతలంతా... ఆ ఇద్దరు సీఎంలు ఏం మాట్లాడుకుని ఉంటారని ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది. ‘ఏపీ రాజధానిని తుళ్లూరులోనే ఏర్పాటు చేసుకోండి. నదికి అభిముఖంగా రాజధాని నగరం ఉంటే మంచిది..’ అని చంద్రబాబుతో కేసీఆర్ వ్యాఖ్యానించారని తెలిసింది. -
ఎంసెట్ ఉమ్మడిగానే నిర్వహించాలి: ఏపీ ఏజీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంసెట్ పరీక్షలు ఉమ్మడిగానే నిర్వహించాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యామండలికి ఏపీ అడ్వకేట్ జనరల్ నివేదించినట్లు తెలిసింది. తెలంగాణ, ఏపీ మధ్య ఎంసెట్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఏజీ అభిప్రాయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గతంలో ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా ఉమ్మడిగానే నిర్వహించాలని ఏపీ సర్కారు ప్రయత్నించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వేరుగా నిర్వహించేందుకే చర్యలు తీసుకున్నసంగతి తెలిసిందే. ఎంసెట్ను కూడా విడిగానే నిర్వహించాలని తెలంగాణ ఉన్నతవిద్యా మండలి ప్రభుత్వాన్ని కోరిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఎంసెట్ నిర్వహణకు ఎంతవరకు అవకాశం ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది.