-
ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లోని పాఠశాలల కు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను అమలు చేయాలని ఆర్జేడీలు, డీఈవోలను పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్కుమార్ ఆదేశించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మ«ధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే హైస్కూళ్లకు ఆప్షనల్ హాలిడేస్ అమలు చేయాలని పేర్కొన్నారు. ఒంటిపూట బడులను పాఠశాలలకు చివరి పనిదినం అయిన ఏప్రిల్ 12 వరకు కొనసాగించాలని, ఆ తరువాత వేసవి సెలవులు వర్తిస్తాయని వివరించారు. దీంతో తిరిగి పాఠశాలలు జూన్ 1న ప్రారంభం కానున్నాయి. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కుమారస్వామి
ఆత్మకూరు, న్యూస్లైన్ : ఆత్మకూరు మండలం దామెర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసు కుమారస్వామి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ఎడ్యుకేషన్ డెరైక్టర్ నుంచి ఆయనకు లేఖ అందింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతులమీదుగా కుమారస్వామి అవార్డు అందుకోనున్నారు. ములుగు మండల కేంద్రానికి చెందిన దాసు కుమారస్వామి మొదటిసారిగా అక్టోబర్1, 1986లో ములుగు పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చే రారు. నవంబర్26, 2005లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ము లుగు, మరిపెడ, వెంకటాపూర్ మండలాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆత్మకూరు మండలం దామెర పాఠశాలలో పని చేస్తున్నారు. కుమారస్వామి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం వినూత్నరీతిలో కరపత్రాలు, డోర్పోస్టర్లతో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన పనిచేస్తున్న పాఠశాలలో 1నుండి 5తరగతుల్లో 300మంది విద్యార్థులు ఉన్నారు. దాతల సహకారంతో ఇక్కడి విద్యార్థులకు యూనిఫాం, టై, బెల్టులు, బ్యాడ్జ్లు, పలకలు, నోటుపుస్తకాలు, డైరీలు పంపిణీ చేశారు. అదేవిధంగా *50వేలతో పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించారు. అందుకున్న అవార్డులెన్నో... కుమారస్వామి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల నుంచి ఎ న్నో అవార్డులు అందుకున్నారు. 2007, 2010లో జిల్లా ఉ త్తమ ఉపాధ్యాయ అవార్డులు, 2011లో రాష్ట్ర ఉత్తమ ఉ పాధ్యాయ అవార్డు అందుకున్నారు. తాజాగా ఇప్పుడు జా తీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు. అ లాగే ఎల్ఐసీ, లయన్స్క్లబ్, మదర్థెరిస్సా ఫౌండేషన్, అ చీవర్స్ ఆర్గనైజేషన్, సర్వేపల్లి రాధాకృష్ణ ఫౌండేషన్ల నుంచి కూడా అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అవార్డు పాఠశాలకే అంకితం : కుమారస్వామి నాకు వచ్చిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పా ఠశాలకే అంకితం ఇస్తున్నాను. విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయుల కృషితోనే ఈ అవార్డు నాకు దక్కిం ది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. ప్రభు త్వ ఉపాధ్యాయుల మీద ఉన్న అపనమ్మకాన్ని తొలగిస్తాను
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement