breaking news
Dinanagar
-
'ఉద్యోగాలు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తాం'
కపుర్తలా: దీనాపూర్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేదాకా అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. తమ కుమారుడికి ఎస్పీ ర్యాంకు, ఇద్దరు కుమార్తెలకు తహశీల్దార్ ఉద్యోగాలు ఇవ్వాలని బల్జీత్ సింగ్ భార్య కల్వంత్ కౌర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చే దాకా దహన సంస్కారాలు చేయబోమన్నారు. తమ మామ అచ్చార్ సింగ్ చనిపోయిన తర్వాత తన భర్తకు ఉద్యోగం కోసం రెండేళ్లు వేచిచూడాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. పోలీసు ఇన్స్ పెక్టర్ గా పనిచేసిన అచ్చర్ సింగ్ 1984 నాటి సిక్కు అల్లర్లలో మృతి చెందారు. అయితే బల్జీత్ సింగ్ కుటుంబం డిమాండ్ గురించి తమకు తెలియదని ఉన్నతాధికారులు తెలిపారు. పంజాబ్ గురుదాస్ పూర్ జిల్లాలోని దీనాపూర్ లో సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎస్పీ బల్జీత్ సింగ్ మృతి చెందారు. -
ఇది చాలా తీవ్రమైన చర్య..ఎవరు బందీలుగా లేరు..
పంజాబ్: పంజాబ్ దినాన్ పూర్ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు దాడి చాలా తీవ్రమైన చర్యగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు అభివర్ణించారు. అయితే పోలీస్ స్టేషన్ లోపలికి చొరబడి కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులు ఎవరినీ బంధించినట్టు తమకు సమాచారం లేదన్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తున్నామని రిజుజు తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నందున ఇంతకుమించి ఈ ఘటనపై వివరాలను ప్రకటించలేమన్నారు. అన్ని రక్షణ దళాలను అప్రమత్తం చేశామని, దినాన్ పూర్ ప్రాంతంలోని పరిస్థితిని సమీక్షించేందుకు ఎన్ఎస్జీ కమాండర్లు, సైన్యం దిగనుందని ప్రకటించారు. ఐబీ హెచ్చరించినట్టుగానే ఉగ్రవాదులు పంజాబ్లోని గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్లోకి చొరబడి విచక్షణా రహితంగా తెగబడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ భీకర ఘటనపై కేంద్ర ప్రభుత్వం, రక్షణ వర్గాలు స్పందించాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అయిదుగురిని పొట్టనపెట్టుకున్నారు. వీరి వారి సంఖ్య పెరుగే అవకాశం ఉందని తెలుస్తొంది. దాడులకు పాల్పడింది ఉగ్రవాదులేనని హోం శాఖ నిర్ధారించింది.