breaking news
Devi sarannavaratri
-
నవరాత్రి అలంకరణలో నవనవోన్మేషంగా...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.3వ తేదీ గురువారం – శ్రీబాలా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో తొలిరోజున దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.4వ తేదీ శుక్రవారం – శ్రీగాయత్రిదేవిరెండోరోజున దుర్గమ్మ శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. వేదమాత గా గాయత్రిదేవిని దర్శించుకోవడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం ΄÷ందుతారు.5వ తేదీ శనివారం – శ్రీఅన్నపూర్ణాదేవిదసరా ఉత్సవాలలో మూడోరోజున దుర్గమ్మను శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని ΄÷ందగలుగుతారు.6వ తేదీ ఆదివారం- శ్రీలలితా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో నాల్గో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తుల పూజలందుకుంటారు.7వ తేదీ సోమవారం – శ్రీ మహాచండీదేవిఐదవ రోజున దుర్గమ్మ శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయి.8వ తేదీ మంగళవారం – శ్రీమహాలక్ష్మీదేవిఆరో రోజున దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక స్ధితికారిణిగా, «అమృత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య్ర΄ాప్తి కలుగుతుంది. 9వ తేదీ బుధవారం – శ్రీసరస్వతిదేవిఏడవరోజయిన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల సర్వ విద్యలయందు విజయం ΄÷ందుతారు.10వ తేదీ గురువారం – శ్రీదుర్గాదేవి 8వ రోజున దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను ΄ోగొట్టి దుర్గగా వెలుగొందినది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని ఆర్చించటం సద్గతులను ప్రసాదిస్తుంది.11వ తేదీ శుక్రవారం – శ్రీమహిషాసుర మర్ధనిదేవిదసరా ఉత్సవాలలో 9వ రోజున దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధనిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల అరిష్ట్వర్గాలు నశించి, సాత్విక బావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పంటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.12వ తేదీ శనివారం – శ్రీరాజరాజేశ్వరిదేవిదసరా ఉత్సవాలలో 10వ రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తం తో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహా మంత్ర స్వరూపిణి గా, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.– సుభాని, సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) -
ఆ హక్కు మీకెక్కడిది?
న్యూఢిల్లీ: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే రోజుల్లో చాందినీ చౌక్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ను మూసివేయాలంటూ లీలా ధార్మిక్ కమిటీ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అండర్ గ్రౌండ్ పార్కింగ్ను మూసివేయాలని కోరే హక్కు మీకెక్కడిది? అంటూ కమిటీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో రద్దీ విపరీతంగా ఉంటుందని, పార్కింగ్ను మూసివేయడం ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. అంతగా కావాలనుకుంటే మీరే రామ్లీలా ఉత్సవాలను ఎక్కడైనా ఖాళీగా ఉన్న బహిరంగ ప్రదేశంలో నిర్వహించుకోవాలని న్యాయమూర్తులు రవీంద్ర భట్, ఎస్ మురళీధర్లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అండర్ గ్రౌండ్ పార్కింగ్ను మూసివేయడం కుదరదని చెప్పింది. ఇదికాకుండా ఇంకెక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని మీరు చూపితే అక్కడ రామ్లీలాను నిర్వహించుకునేందుకు అవసరమైన అనుమతిని ఇచ్చేందుకు కోర్టు సిద్ధంగా ఉందని చెప్పింది. దీనికి కమిటీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... గత ఎనభై సంవత్సరాలుగా ఇక్కడే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, భారత రాష్ట్రపతితోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వస్తారని, వారందరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకే తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ... ఇండియాగేట్ వద్ద కూడా ఇలాంటి సమస్యే ఎదురైందని, అయినప్పటికీ ప్రజల కోసం దానిని తెరిచారని పేర్కొంది. రామ్లీలా నిర్వాహక కమిటీ చేసిన ఆరోపణలపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేసును ఉపసంహరించుకోవాలని కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేసిన ఎన్జీవో ప్రతినిధి తరఫు న్యాయవాదికి సూచించింది. ఇదిలాఉండగా ఎయిర్టెల్ మార్గంలో రిక్షాలను కూడా అనుమతించాలని కోర్టు మే 24న జారీ చేసిన ఆదేశాలను అమలు పర్చడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రజా పనుల విభాగానికి కోర్టు సమన్లు జారీ చేసింది.