breaking news
Development of Telangana state
-
పత్తి ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ
* సిబ్బంది కొరతను తీర్చడానికి కృషి చేస్తా * సీసీఐ, మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్పీకర్ పరకాల : అపారమైన పత్తి ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి చెందుతోందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం, మార్కఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి బస్తాలను తూకం వేసి మాట్లాడారు. ఈ ప్రాంత నేలలు పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయన్నారు. పత్తికి క్వింటాల్కు రూ.4500, మొక్కజొన్న క్వింటాకు రూ. 1310 కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. పరకాల మార్కెట్కు గత వైభవం తీసుకొచ్చేందుకు ధర్మారెడ్డి, తాను కృషి చేస్తామన్నారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో తెలంగాణలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. చిల్లర కాంటాల ద్వారా రైతులు నష్టపోతున్నార ని, గ్రామాల్లో దళారులును, చిల్లర కాంటాలను అరికట్టాలని పరకాల డీఎస్పీ, తహసీల్దార్ను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రాంమోహన్రెడ్డి. సీసీఐ ఇన్చార్జి కోటస్వామి, మార్కెటింగ్ ఏడీ సంతోష్, సూపర్వైజర్ డి. మధు, కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, చిదిరాల దేవేందర్, బండారి కవితకృష్ణ, బూచి సుమలత రఘు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు దగ్గు విజేందర్రావు, బొచ్చు వినయ్, రేగూరి విజయపాల్రెడ్డి, నిప్పాని సత్యనారాయణ, జంగిలి రాజమౌళి, పెరుమాండ్ల చక్రపాణి, ప్రతాప్రెడ్డి, మిరుపాల బాబురావు, నందికొండ జయపాల్రెడ్డి, దామెర మొగిలి, నాన్పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ సిరికొండ శ్రీనివాసచారి పాల్గొన్నారు. -
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : నోముల
నకిరేకల్, న్యూస్లైన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. నకిరేకల్లో టీఆ ర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వేముల వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం నోముల నర్సింహయ్యకు ఆత్మీయసభ ఏర్పాటుచేశారు. ఈ సభలో నర్సిం హయ్య మాట్లాడుతూ తాను పదవి కోసం సీపీఎంను వీడలేదన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పలుమార్లు టీవీ ఛానళ్లలో చర్చించిన సందర్భంగా సీపీఎం పెద్దలు తనకు నోటీసులు పంపారని, అందులో ఒకవర్గం తనను వేధింపులకు గురిచేయడంవల్ల పార్టీని వీడి తెలంగాణ కోసం పోరాడిన టీఆర్ఎస్లో చేరానని వివరించారు. తనతోపాటు జిల్లాలో 6నుంచి 7 అసెంబ్లీ స్థానాలలో, 2 పార్లమెంట్ స్థానాలలో గెలిచి టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందన్నారు. నకిరేకల్ టీఆ ర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ పూజర్ల శంభయ్య, నాయకులు సోమయాదగిరి, సిలివేరు ప్రభాకర్, మారం భిక్షంరెడ్డి, కనుకు సహాని, పన్నాల సావిత్రమ్మ, వీర్లపాటి రమేష్, బొజ్జ సుందర్, గార్లపాటి రవీందర్రెడ్డి, వెంకటరామిరెడ్డి, పల్రెడ్డి నర్సింహారెడ్డి, వివిధ మండల పార్టీ అద్యక్షులు తదితరులు ఉన్నారు.