9 రోజుల్లో రూ. 40 కోట్ల కలెక్షన్స్.. మరాఠీ సినిమా ఊచకోత!
ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయో అందరికి తెలిసిందే. కంటెంట్ సంగతి ఎలా ఉన్న సరే.. రిలీజ్ ముందు వరకు‘ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా’ అంటూ ప్రచారం చేసి మరీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ చిన్న సినిమా మాత్రం ఎలాంటి చడీచప్పుడు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. కేవలం 9 రోజుల్లోనే రూ. 40 కోట్లు వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. అదే మరాఠి చిత్రం ‘దేవూల్ బంద్ 2’.స్నేహల్ తార్డే, మోహన్ జోషిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ తార్డే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మౌత్ టాక్తోనే మొదటి వీకెండ్లో రూ. 5.90 కోట్లు వసూలు చేసింది. రిలీజ్ అయిన 9 రోజుల్లోనే రూ. 40.80 కోట్లు(గ్రాస్) వసూలు చేసి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మరాఠి చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది.దేవూల్ బంద్ 2 కథేంటంటే.. మహిళ రైతు సంగీత పేగుడే(స్నేహల్)కు వరుస కష్టాలు వస్తుంటాయి. తన బాధలను తీర్చమని నిత్యం దేవుడిని వేడుకుంటుంది. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీంతో ఒకరోజు తీవ్ర అసహనానికి గురై పక్కనే ఉన్న పుట్టపై రాయి విసిరేస్తుంది. వెంటనే అందులో నుంచి శ్రీస్వామి సమర్థ్ దర్శనమిస్తాడు. ఆమెతో కలిసి గ్రామానికి కూడా వెళ్తాడు. దేవుడు రాకతో సంగీత జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? అనేదే ఈ సినిమా కథ. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.#DeoolBand2 Movie 9 Days Box-office update :🔹Maharashtra : 39.77 Cr🔹Goa : 45 Lakhs🔹Karnataka : 35 Lakhs🔹Gujarat : 21 Lakhs🔹Rest : 2 LakhsTotal Domestic : 40.80 CroresTotal India Gross — 40.80 CroresTotal India Net — 34.37 CroresDistributor Share… pic.twitter.com/OGnzHdwAhb— Jerin Georgekutty (@jerinGeorgekut2) May 30, 2026