breaking news
deendayal
-
దీనదయాళ్ పోర్ట్లో తగ్గిన రష్యా చమురు సరఫరా
ప్రపంచ దేశాల ఒత్తిడి, యూఎస్, ఈయూల సెకండరీ ఆంక్షల(రష్యాతో వ్యాపారం సాగిస్తున్న దేశాలు, కంపెనీలపై పరోక్షంగా విధించి ఆంక్షలు) ప్రభావం కారణంగా రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు తెలుస్తుంది. దాంతో దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో అత్యంత ముఖ్యమైన దీనదయాళ్ పోర్ట్(Deendayal Port)లో గణనీయంగా సరఫరా దెబ్బతింది. రష్యన్ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ నౌకాశ్రయం తాజా గణాంకాల ప్రకారం క్రూడ్ వాల్యూమ్ క్షీణతను నమోదు చేసింది.2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దీనదయాళ్ పోర్ట్ నిర్వహించిన ముడి చమురు, ఎల్పీజీ/ఎల్ఎన్జీ మొత్తం వాల్యూమ్ 30.07 లక్షల టన్నులకు తగ్గింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 32.5 లక్షల టన్నుల వాల్యూమ్తో పోలిస్తే దాదాపు 6% క్షీణతను సూచిస్తుంది. భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల్లో దీనదయాళ్ పోర్ట్ రష్యన్ చమురును అధికంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది.తగ్గుదలకు కారణాలుభారతదేశంపై రష్యా చమురు దిగుమతులకు సంబంధించి ప్రత్యక్ష ఆంక్షలు లేనప్పటికీ అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU) విధించిన ద్వితీయ పరిమితుల (Secondary sanctions) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రష్యన్ చమురు సరఫరాపై పడింది. రవాణా, బీమా, ఆర్థిక లావాదేవీలు కఠినతరం కావడంతో దిగుమతిదారులు రష్యన్ చమురును నిలిపేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల వైపు మళ్లుతున్నారు.భారత్పై ఒత్తిడిభారతదేశం తన ఇంధన అవసరాల కోసం రష్యా ముడి చమురుపై భారీగా ఆధారపడటాన్ని తగ్గించాలని యూఎస్, ఈయూ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో అమెరికా, పశ్చిమ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్కు ఉంది. రష్యా చమురు దిగుమతులను కొనసాగించడం ఈ సంబంధాలకు ఇబ్బంది కలిగిస్తుంది. రష్యా చమురుతో సంబంధం ఉన్న సంస్థలు, బ్యాంకులపై భవిష్యత్తులో అమెరికా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.రిఫైనరీలపై ప్రభావందీనదయాళ్ పోర్ట్ ద్వారా సాగే ముడి చమురు సరఫరా ప్రధానంగా నయారా ఎనర్జీ (Nayara Energy- రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ మద్దతు కలిగిన సంస్థ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వంటి రిఫైనరీలపై పడుతుంది. నయారా ఎనర్జీకి రష్యాకు చెందిన రోస్నెఫ్ట్తో 10 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. అయితే ఈ ఒత్తిళ్ల మధ్య కూడా నయారా చమురు సరఫరా ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి 6,700కు పైగా ఫ్యూయల్ స్టేషన్లకు ఇంధనాన్ని నింపుతూ దేశీయ సరఫరాను కొనసాగిస్తున్నాయి. తాత్కాలికంగా ఐఓసీకి చెందిన వదినార్ రిఫైనరీలో నిర్వహణ పనులు కూడా ముడి చమురు వినియోగం తగ్గడానికి మరో కారణంగా నిలిచింది.ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. -
నెహ్రూపై సంచలన ఆరోపణలు
సాక్షి, భోపాల్ : జనరల్ నాలెడ్జి పరీక్ష పేరుతో బీజేపీ యువవిభాగం నిర్వహించిన పరీక్ష కాస్త వివాదానికి తెరలేపింది. అందులో అడిగిన ప్రశ్నలు ప్రతిపక్షాలకు మంటపెట్టేలా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మంగళవారం సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో బీజేవైఎం(భారతీయ జనతా యువ మోర్చా) విభాగం ఓ జనరల్ నాలెడ్జి పరీక్ష నిర్వహించింది. భోపాల్లోని ఎంవీఎం కాలేజ్ క్యాంపస్లో ఈ పరీక్ష ఏర్పాటుచేయగా అంతకుముందు ‘మేరే దీన్ దయాళ్’ అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని పరీక్ష రాసే వారికి అందించారు. అందులో మాజీ ప్రధాని జవహార్ లాల్పై వారు సంచలన ఆరోపణలు చేశారు. నెహ్రూకు అధికారంపై వ్యామోహం అని పేర్కొన్నారు. అందుకోసమే దేశాన్ని విడదీస్తున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అదే సమయంలో పాకిస్థాన్ పిత మహ్మద్ అలీ జిన్నా కూడా అలాంటి వ్యక్తేనని పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని 47వ పేజీలో అఖండ్ భారత్ అనే చాప్టర్లో 'ఎలాంటి విభజన లేకుండానే భారత్కు స్వాతంత్ర్యం వస్తుందని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ నమ్మారు. కానీ, తమకు అధికారం దక్కాలనే దురాశతో అవిభక్త భారతదేశానికే స్వాతంత్ర్యం అనే ఆలోచనను పక్కన పడేసి నెహ్రూ, జిన్నాలు బ్రిటీష్ వాళ్ల వ్యూహంలో పడ్డారు' అని పేర్కొన్నారు. అంతేకాకుండా జీకే పరీక్ష కోసం కూర్చున్నవారికి ఇచ్చిన ప్రశ్నా పత్రంలో కేవలం దీన్ దయాళ్కు సంబంధించినవి 4 ప్రశ్నలు అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చిన 11 పాలసీల మీద మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ పరీక్షపై పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా, దీన్ దయాళ్ గురించి నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతోనే తాము ఆ పరీక్ష పెట్టామే తప్ప దురుద్దేశంతో కాదని అన్నారు. -
విద్యుత్ చౌర్యాన్ని నియంత్రించకపోతే చర్యలు
–నెలాఖరులోగా ఎన్టీఆర్ జలసిరి కనెక్షన్లు ఇవ్వాలి – పుష్కర విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు – ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టరు హెచ్.వై. దొర కర్నూలు(రాజ్విహార్): విద్యుత్ చౌర్యాని్న నియంత్రించకపోతే బాధ్యులైనవారిపై చర్యలు తప్పవని విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (తిరుపతి) హెచ్.వై. దొర హెచ్చరించారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్లో కర్నూలు సర్కిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా డివిజన్, సబ్డివిజన్, సెక్షన్ల వారీగా పురోగతి పనులు, ఇతర కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చౌర్యాన్ని, లైన్ లాస్ను నియంత్రించాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద మంజూరు అయిన కనెక్షన్లను ఈనెలాఖరులోగా మంజూరు చేయాలని సూచించారు. కనెక్షన్ లేని ఇల్లు ఉంటే అందుకు ఏఈలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన స్కీము కింద వచ్చిన దరఖాస్తులకు రూ.125కే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలన్నారు. ఈ స్కీము కింద కర్నూలుకు 8 సబ్స్టేషన్లు మంజూరు అయ్యాయని చెప్పారు. ఆదోని డివిజన్లో లైన్లాస్ను నివారణకు రూ.150కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పుష్కర విధుల్లో సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వీరికి ప్రశంసాపత్రాలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టెక్నికల్, హెచ్ఆర్ డైరక్టరు పి. పుల్లారెడ్డి, సీఈ పీరయ్య, ఎస్ఈ భార్గవ రాముడు, టెక్నికల్, ఆపరేషన్స్ డీఈలు మహమ్మద్ సాధిక్, రమేష్, తిరుపతిరావు, నాగప్ప, ఎస్ఏఓ మతృనాయ్, ఏడీఈలు, ఏఈలు, ఏఓలు పాల్గొన్నారు.