breaking news
DDCA issue
-
'అద్వానీ రాజీనామా చేశారు.. జైట్లీ చేస్తారా?'
న్యూఢిల్లీ: హవాలా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడ్డారని, ఇప్పుడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా డీడీసీఏ వివాదం నుంచి బయపడతారనే నమ్మకముందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. హవాలా కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన వెంటనే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న అద్వానీ ఎంపీ పదవికి రాజీనామా చేశారని ఏచూరి గుర్తు చేశారు. అద్వానీని ఆదర్శంగా తీసుకుని రాజీనామా చేయాల్సిందిగా ప్రధాని మోదీ.. జైట్లీని ఆదేశిస్తారా? అని ఏచూరి ప్రశ్నించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఇదే విషయంపై మాట్లాడుతూ అద్వానీ మాదిరిగా జైట్లీ రాజీనామా చేస్తారా అని వ్యాఖ్యానించారు. అద్వానీ, జైట్లీ ప్రాధాన్యాలు వేరని దిగ్విజయ్ చెప్పారు. డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జైట్లీ.. కేజ్రీవాల్తో పాటు ఆప్ నేతలపై పరువునష్టం దావా వేశారు. -
అద్వానీలాగే అరుణ్ కూడా..
- డీడీసీఏ వివాదం నుంచి అరుణ్ జైట్లీ భేషుగ్గా బయటపడతారన్న ప్రధాని - హవాలా కేసు నుంచి అద్వానీ కడిగిన ముత్యంలా బయటికొచ్చారని గుర్తుచేసిన మోదీ - బీజేపీపీపీ భేటీ వివరాలను వెల్లడించిన వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: 'హవాలా కుంభకోణం వెలుగుచూసినప్పుడు మన పార్టీ కురువృద్ధుడు అద్వానీపై కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీలు ఇలానే గోలచేశాయి. కానీ చివరికి అద్వానీజీ కడిగిన ముత్యంలా బయటికొచ్చారు. ఆయనపై మోపిన ఆరోపణలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు అరుణ్ జైట్లీ విషయంలోనూ అదే జరుగుతుంది. డీడీసీఏ వివాదం నుంచి ఆయన భేషుగ్గా, స్వచ్ఛంగా బయటపడతారనే నమ్మకం ఉంది'.. ఇదీ స్థూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో అన్న మాటలు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీపీపీ కార్యాలయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీల సమావేశం జరిగింది. భేటీ అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. హవాలా కేసు నుంచి అద్వానీ బయటపడ్డట్టే, డీసీసీ వివాదం నుంచి అరుణ్ జైట్లీ బయటపడతారని ప్రధాని అన్నారని వెంకయ్య తెలిపారు. కేవలం ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేసేందుకే విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇప్పుడు జైట్లీని టార్గెట్ చేసినట్లే గతంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లపై నిందారోపణలు చేశారని దుయ్యబట్టారు.