breaking news
Dahipuri
-
ఎండ పెరుగుతోందా!
పరీక్షల సీజన్... ఎండల సీజన్ ఒకేసారి రాబోతున్నాయి.పరీక్షలకి ప్రిపేర్ అయినట్టే... ఎండలకీ ప్రిపేర్ అవ్వాలి.వట్టివేర్ల తెరలు కట్టుకోవడం, కూల్సెమ్ పెయింట్ రూఫ్కు వేసుకోవడం,కూలర్లు రెడీ చేసుకోవడం లాంటి ఏర్పాట్లతో పాటు శరీరం, ఉదరం చల్లగా ఉండటానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలి.పెరిగే ఎండకు పెరుగును మించిన విరుగుడు లేదు.వీటిని నేర్చుకోండి... ఎండకు చూపుడు వేలు ఆడించండి. దహీ పూరీ కావలసినవి: పానీ పూరీలు – 6; ఉప్పు – తగినంత; కారం – తగినంత; జీలకర్ర పొడి – అర టీ స్పూను; బంగాదుంపలు – 2; బఠాణీలు – అర కప్పు; గ్రీన్ చట్నీ – కొద్దిగా; ఖట్టామీఠా చట్నీ కొద్దిగా; సన్న కారప్పూస – కొద్దిగా; పెరుగు – ఒక కప్పు; నల్ల ఉప్పు – చిటికెడు; తరిగిన టొమాటో – 1; తరిగిన ఉల్లిపాయ – 1. తయారీ: పెరుగులో కొద్దిగా ఉప్పు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ►బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసి మెదపాలి ►బఠాణీని ఉడికించాలి. ►ఒక పాత్రలో ఉడికించిన బంగాళ దుంపలు, ఉడికించిన బఠాణీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలిపి పక్కన ఉంచాలి. ►ఒకప్లేట్లో పానీ పూరీలను ఉంచి, మధ్యలో చిన్నగా రంధ్రం చేయాలి. ►సిద్ధం చేసుకున్న బంగాళ దుంప మిశ్రమం కొద్దికొద్దిగా ఉంచాలి. ►ముందుగా టేబుల్ స్పూను పెరుగు ఒక్కో పూరీ మీద వేయాలి. ►ఖట్టామీఠా చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లి తరుగు, కారప్పూస ఒక దానిమీద ఒకటి వేయాలి. ►చివరగా మళ్లీ పెరుగు వేసి అందించాలి (వెంటనే తినేయాలి) గుజరాతీకడీ కావలసినవి: పెరుగు – ఒక కప్పు; నీళ్లు – రెండు కప్పులు; సెనగపిండి – 4 టేబుల్ స్పూన్లు; అల్లం + పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; బెల్లం పొడి – ఒక టే బుల్ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – అలంకరించడానికి తగినంత పోపు కోసం: దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (చిన్న ముక్కలు చేయాలి); జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, అల్లం + పచ్చిమిర్చి ముద్ద, పెరుగు, బెల్లం పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టాలి. ►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ►సెనగ పిండి, పెరుగు మిశ్రమం జత చేసి కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి. ►ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి. ►కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. దహీ కే కబాబ్ కావలసినవి: పెరుగు – ఒక కప్పు; నీళ్లు – రెండు కప్పులు; సెనగపిండి – 4 టేబుల్ స్పూన్లు; అల్లం + పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; బెల్లం పొడి – ఒక టే బుల్ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – అలంకరించడానికి తగినంత పోపు కోసం: దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (చిన్న ముక్కలు చేయాలి); జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, అల్లం + పచ్చిమిర్చి ముద్ద, పెరుగు, బెల్లం పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►సెనగ పిండి, పెరుగు మిశ్రమం జత చేసి కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి ►ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. దహీ ఆలూ టిక్కీ చాట్ కావలసినవి: బంగాళదుంపలు – 2 (మీడియం సైజువి); మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. టాపింగ్ కోసం: పెరుగు – అర కప్పు; చింతపండు స్వీట్ చట్నీ – తగినంత; గ్రీన్ చట్నీ – తగినంత; చాట్ మసాలా – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – తగినంత. తయారీ: బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసి చేతితో మెదిపి ఒక పాత్రలో ఉంచాలి ►మిరప కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్, ఉప్పు జత చేసి కలపాలి ►గుండ్రంగా టిక్కీల మాదిరిగా చేతితో ఒత్తాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఒత్తి ఉంచుకున్న టిక్కీలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ►గ్రీన్ చట్నీ, స్వీట్ చింతపండు చట్నీలు పైన వేసి, కొత్తి మీరతో అలంకరించి వెంటనే అందించాలి. పంజాబీ కడీ పకోరా కావలసినవి: గడ్డపెరుగు – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – 3 కప్పులు; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 8 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. ఆనియన్ పకోరా కోసం: ఉల్లి తరుగు – ఒక కప్పు (సన్నగా పొడవుగా తరగాలి); సెనగ పిండి – ఒక కప్పు; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; వాము – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని. పంజాబీ కడీ కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టే బుల్ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ఒక పాత్రలో పెరుగు పోసి బాగా గిలకొట్టాలి ∙సెనగ పిండి, మిరప కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు జత చేసి, అన్నీ బాగా కలిసేలా కలపాలి ∙నీళ్లు జత చేసి, ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచాలి. ఆనియన్ పకోరా తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, వాము, మిరప కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి ►ఉల్లి తరుగు జత చేసి (ఉల్లి తరుగు నుంచి తగినంత నీరు వస్తుంది కనుక నీళ్లు జతచేయనక్కరలేదు. అవసరమనుకుంటే కొద్దిగా జత చేస్తే చాలు) ►బాగా కలిపి, మూత పెట్టి సుమారు గంటసేపు పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా నూనెలో వేసి వేయించాలి ►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకుని పక్కన ఉంచాలి. కడీ తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ►అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►పెరుగు మిశ్రమం జత చే సి, మిశ్రమం బాగా చిక్కబడే వరకు కలుపుతుండాలి ►కొద్దిగా వేడి నీళ్లు జత చేయాలి ►ఆనియన్ పకోరాలు వేసి కలపాలి ►గరం మసాలా పొడి చల్లి, బాగా కలియబెట్టి, దింపేసి మూత పెట్టాలి ►అన్నం, లేదా జీరా రైస్లలో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది. -
స్వీట్ స్వేచ్ఛ
ఏడాదిలో ఎన్ని ‘డే’ లు ఉన్నా... ఇవాళ మనకు స్పెషల్ డే! మనసుల్లో ఎన్ని రంగులున్నా... ఈరోజు మనందరివీ... మూడే! సూర్యోదయం కూడా... మువ్వన్నెల్లోనే కనిపిస్తుంది! పూలూ త్రివర్ణంలోనే. గగన మేఘాల్లో తేలియాడేవీ... భవన రాగాల్లో సొక్కిసోలేవీ... కాషాయ- శ్వేత- హరితాలే! ప్రాణాలను చిందించి, భరతమాతకు ఫ్రీడమ్ కలర్స్ అద్దారు సమరయోధులు. గుండెలనిండా వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. భరతజాతి మహద్భాగ్యాన్నితియ్యటి రుచులతో సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ట్రిపుల్ కలర్ బూందీ కావలసినవి: శనగపిండి - అరకిలో బియ్యప్పిండి - 100 గ్రా. బెల్లం - అర కిలో; ఏలకులపొడి - టీస్పూను సోడా - పావు టీ స్పూను నూనె - డీప్ ఫ్రైకి సరిపడా ఆకుపచ్చ, ఎరుపురంగులు - చిటికెడు చొప్పున తయారి: ఒక పెద్ద పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, సోడా, తగినంత నీరు పోసి దోసెల పిండి మాదిరిగా కలపాలి. బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని బూందీ చట్రంలో వేసి చేత్తో నెమ్మదిగా కదిపి, (చట్రం ఎంత సన్న రంధ్రాలున్నదైతే బూందీ అంత సన్నగా వస్తుంది) బూందీ వేగాక తీసేయాలి. ఒక పెద్ద పాత్రలో బెల్లం, ఏలకులపొడి, తగినంత నీరు పోసి బెల్లం తీగపాకం వచ్చాక, తయారుచేసి ఉంచుకున్న బూందీని అందులో వేసి బాగా కలపాలి. (గమనిక: కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని మూడు సమాన భాగాలుగా చేసుకుని, ఒక్కో భాగంలో రంగులు వేసి కలిపాక బూందీ తయారుచేసుకుంటే ట్రిపుల్ కలర్ బూందీ సిద్ధమవుతుంది). ట్రైకలర్ కాజూ బర్ఫీ కావలసినవి: జీడిపప్పు - 500 గ్రా. పంచదార - 500 గ్రా. ఫుడ్ కలర్ - కొద్దిగా (ఆకుపచ్చ, ఎరుపు రంగులు) రోజ్వాటర్ - టీ స్పూను కుంకుమపువ్వు - చిటికెడు పాలు - కొద్దిగా తయారి: జీడిపప్పులను సుమారు నాలుగు గంటలసేపు తగినంత నీటిలో నాన బెట్టాలి. నీటిని ఒంపేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక పెద్ద పాత్రలో జీడిపప్పు పేస్ట్, పంచదార వేసి స్టౌ మీద ఉంచాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత రోజ్ వాటర్ జతచేయాలి. చిన్న పాత్రలో కుంకుమపువ్వు, పాలు వేసి బాగా కలిపి, చల్లారనివ్వాలి. మరో రెండు చిన్న పాత్రలలో కొద్దిగా నీరు తీసుకుని ఆకుపచ్చ, ఎరుపు రంగులు విడివిడిగా కలపాలి. జీడిపప్పు మిశ్రమాన్ని మూడు భాగాలుగా చేసి కుంకుమపువ్వు + పాల మిశ్రమం, రంగు నీటిని జతచేసి మూడు రంగుల మిశ్రమాలు తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వరుసగా ఒక ప్లేట్లో ఒకదాని మీద ఒకటి వేసి సమానంగా పరిచి కావలసిన ఆకారంలో కట్ చేయాలి. మువ్వన్నెల హల్వా కావలసినవి: సొరకాయ తురుము, క్యారట్ తురుము - అర కప్పు చొప్పున; బొంబాయిరవ్వ - 2 కప్పులు; పాలు - 6 కప్పులు; పంచదార - 6 కప్పులు; ఏలకులు పొడి - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 కప్పులు; జీడిపప్పు, కిస్మిస్ - 4 టేబుల్ స్పూన్ల చొప్పున; రోజ్ ఎసెన్స్ - 6 చుక్కలు తయారి: బాణలిలో బొంబాయిరవ్వ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి. సొరకాయ తొక్క తీసి, తురిమి నీరు గట్టిగా పిండి పక్కన ఉంచాలి క్యారట్ తొక్క తీసి, తురిమి పక్కన ఉంచాలి ఒక పెద్ద పాత్రలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, సొరకాయ తురుము, క్యారట్ తురుములను విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి అదే పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్లను వేసి వేయించి పక్కన ఉంచాలి ఒక పెద్ద పాత్రలో పాలు పోసి మరిగాక పంచదార, ఏలకులపొడి వేసి మరిగించాలి. బొంబాయిరవ్వ వేస్తూ గరిటెతో బాగా కలిపి, మధ్యమధ్యలో నెయ్యి వేసి ఉడికిన తరువాత, రోజ్ఎసెన్స్ జత చేయాలి మరొక పాత్రలో సొరకాయ తురుము, క్యారట్ తురుములను నేతితో కలిపి విడివిడిగా ఉడికించాలి ఉడికించిన బొంబాయిరవ్వ మిశ్రమంలో క్యారట్ తురుము, సొరకాయ తురుములను విడివిడిగా కలపాలి. ఒక ప్లేట్లో వీటిని రంగుల వారీగా ఒకదానిమీదొకటి పరిచి, జీడిపప్పు, కిస్మిస్ల తో గార్నిష్ చేయాలి. దహీపూరీ కావలసినవి: పూరీలు - 40 (మార్కెట్లో రెడీగా దొరుకుతాయి) స్ప్రౌట్స్ - అర కప్పు; కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు ఉడికించిన బంగాళదుంప ముక్కలు - అర కప్పు చింతపండు, ఖర్జూరం చట్నీ - కప్పు పెరుగు - మూడు కప్పులు; ఉప్పు - తగినంత; గార్నిషింగ్ కోసం సేవ్ - అర కప్పు (మార్కెట్లో దొరుకుతుంది) కారం - 2 టీ స్పూన్లు; జీలకర్రపొడి - 2 టీ స్పూన్లు తయారి: ఒకపాత్రలో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. మరో పాత్రలో స్ప్రౌట్స్, బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి. సర్వింగ్ ప్లేట్లో పూరీలను ఉంచాలి. ప్రతిపూరీ మధ్యలోనూ రంధ్రం చేసి, అందులో బంగాళదుంప మిశ్రం ఉంచి, పైన చింతపండు + ఖర్జూరం చట్నీ వేయాలి. తరువాత పెరుగు వేయాలి. సన్నటి సేవ్, కారం, జీలకర్రపొడి పైన చల్లాలి. కొత్తిమీరతో గార్నిష్చేసి సర్వ్ చేయాలి. -రంజాన్ఖాన్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ సెలబ్రిటీ రిసార్ట్స్ షామిర్పేట్, హైదరాబాద్ సేకరణ: డా. వైజయంతి ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్