breaking news
Contract nurses
-
రాజన్న సిరిసిల్లలో బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన నర్స్
-
హుషారుగా డ్యాన్స్.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్ వీడియో
కరీంనగర్: ఇది సోషల్ మీడియా కాలం. ఓ చిన్న విషయాన్ని షేర్ చేస్తే.. అది జనాలకు నచ్చితే.. ఇట్టే వైరల్గా మారిపోతోంది. ఆ ట్రెండ్ను చాలా మంది ఫాలో అవుతుంటారు. అయితే డ్యూటీలో ఉండగా ఓ నర్సు చేసిన ‘‘బుల్లెట్టు బండి’’ డ్యాన్స్ బెడిసి కొట్టింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం పీహెచ్పీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ నర్సు జ్యోతి ‘‘బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు డ్యాన్స్ చేసింది. అయితే ఇండిపెండెన్స్ డే రోజున.. విధుల్లో ఉండగా డ్యాన్స్ చేయడంతో జ్యోతికి జిల్లా వైద్యాధికారి మెమో జారీ చేశారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంతోషంగా మాత్రమే డ్యాన్స్ చేసినట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఆగస్టు 15న తీసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: గిఫ్ట్తో వధూవరులకు షాకిచ్చిన కమెడియన్: నవ్వులే నవ్వులు! అయితే జ్యోతికి మెమో జారీ చేయడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘‘కొన్ని రోజుల క్రితం డాక్టర్లు, నర్సులు చేసిన డ్యాన్స్లకు జనాలు చప్పట్లు కొట్టి, ప్రశంసలు కురిపించారు. అప్పుడు ఎంత మందికి మెమోలు జారీ చేశారు. ఆ సమయంలో కనిపించని తప్పు ఇప్పుడు ఎందుకు?’’ అంటూ ఘాటుగా స్పందించాడు. కాగా ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్కు చెందిన ఆకుల అశోక్తో వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే ఓ జానపద పాటకు వధువు తన బరాత్లో సూపర్గా డ్యాన్స్ చేసి వరుడిని బంధుమిత్రులతో పాటు.. నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. చదవండి: Bullet Bandi Song: వధువు సూపర్ డ్యాన్స్.. చూస్తూ ఉండిపోయిన భర్త -
ప్రగతి భవన్ ముట్టడికి కాంట్రాక్ట్ నర్సుల యత్నం
-
ఆందోళన వీడని కాంట్రాక్ట్ నర్సులు
-
గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన
-
గాంధీలో కాంట్రాక్టు నర్సుల సమ్మె
హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సులు గురువారం విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, 10వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని కోరుతూ సుమారు 200 మంది కాంట్రాక్టు నర్సులు నిరసనకు దిగారు. నర్సులు సమ్మెకు దిగటంతో గాంధీ ఆసుపత్రి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం వారితో సమ్మె విరమింపజేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నారు.