breaking news
concession agreement
-
అదానీ బ్రాండింగ్... నిబంధనలకు విరుద్ధం
న్యూఢిల్లీ: నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం లీజుకిచ్చిన మూడు విమానాశ్రయాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ తన సొంత బ్రాండ్ పేరును ఉపయోగిస్తుండటంపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కన్సెషన్ ఒప్పంద (సీఏ) నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొంది. ఒప్పందం ప్రకారం విమానాశ్రయాలను నిర్వహించే కంపెనీలు తమ పేరు లేదా షేర్హోల్డర్ల పేర్లతో బ్రాండింగ్ చేసుకోరాదని తెలిపింది. దీనికి విరుద్ధంగా, నిబంధనలను ఉల్లంఘిస్తూ డిస్ప్లే బోర్డులన్నింటిలోనూ అదానీ ఎయిర్పోర్ట్స్ పేరు ప్రత్యేకంగా కనిపిస్తోందంటూ కొద్ది రోజుల క్రితం మంగళూరు ఎయిర్పోర్ట్ చీఫ్ ఎయిర్పోర్ట్ ఆఫీసర్కు ఏఏఐ లేఖ రాసింది. అటు లక్నో, అహ్మదాబాద్ విమానాశ్రయాలకు కూడా ఇలాంటి లేఖలే పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పంద నిబంధనల ప్రకారం.. విమానాశ్రయంలో ఎక్కడా కూడా నిర్వహణ సంస్థ లేదా దాని షేర్హోల్డర్ల పేర్లతో ప్రకటనలు ఉండకూడదు. ఒకవేళ అలా చేయదల్చుకున్న పక్షంలో ఏఏఐ పేరును కూడా పొందుపర్చి, సముచిత ప్రాధాన్యమివ్వాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిబంధనలకు అనుగుణంగానే.. ఏఏఐ ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. తాము నిబంధనలకు కట్టుబడే ఉన్నామని స్పష్టం చేసింది. ‘‘బాధ్యతాయుతమైన సంస్థగా మేము ఒప్పంద నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉంటాము. ఆన్–సైట్ బ్రాండింగ్పై ఏఏఐ స్పష్టత కోరింది. వివరణ ఇస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగా విమానాశ్రయాల చట్టబద్ధమైన పేర్లను యథాప్రకారం ప్రముఖంగా కనిపించేలాగానే ప్రకటనలు ఉంటున్నాయి. మూడు విమానాశ్రయాల పేర్లు మార్చేందుకు ప్రయత్నమేమీ చేయలేదు. చేసే యోచన కూడా లేదు’’ అని అదానీ గ్రూప్ తెలిపింది. మరోవైపు, ఈ వివాదం సామరస్యంగానే పరిష్కారం కాగలదని భావిస్తున్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. లీజు గడువు తీరిపోయిన తర్వాత అంతిమంగా ఆయా ఎయిర్పోర్టులు తిరిగి తమ చేతికే వస్తాయి కాబట్టి వివరణ కోరినట్లు పేర్కొన్నాయి. లీజుకు ఆరు విమానాశ్రయాలు ... ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద విమాశ్రయాలను ప్రైవేటీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆరు విమానాశ్రయాలను (తిరువనంతపురం, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, మంగళూరు, గువాహటి) లీజుకిచ్చింది. 50 ఏళ్ల పాటు నిర్వహణకు అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. ప్రస్తుతం మంగళూరు, లక్నో, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా, మిగతావాటికి ఇంకా భద్రతాపరమైన క్లియరెన్సులు రావాల్సి ఉంది. -
‘మెట్రో-2’ పనులు మొదటికి..
సాక్షి, ముంబై: మెట్రో-2 పనుల విషయమై ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే), రిలయన్స్ మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో-2 ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది. దీంతో రెండోసారి టెండర్లను ఆహ్వానించేందుకు మార్గం సుగమమైంది. ఎమ్మెమ్మార్డీయే కొత్తగా విధించిన షరతుల నేపథ్యంలో ఐదేళ్లుగా చార్కోప్-బాంద్రా- మాన్ఖుర్ద్ ప్రాజెక్టు పెండింగులో ఉంది. అప్పట్లో దీని అంచనా వ్యయం రూ.7,660 కోట్లు కాగా ఇప్పుడది త డిసి మోపెడైంది. ప్రస్తుతం రూ.12,000 కోట్లు వ్యయం కావచ్చని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. కాని టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి ఈ వ్యయం సుమారు రూ.20 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. చార్కోప్-బాంద్రా-మాన్ఖుర్ద్ ప్రాజెక్టుకు 2006 నవంబర్లో మంజూరు నివ్వగా, దీని నిర్మాణ పనుల కాంట్రాక్టును 2010లో రిలయన్స్కు ఇచ్చారు. కాని కార్ డిపో స్థలం సీఆర్జెడ్ పరిధిలో ఉండడంవల్ల ఆ ప్రాజెక్టు పెండింగ్లో పడిపోయింది. పర్యావరణ శాఖ కూడా కొన్ని షరతులకు కట్టుబడి ఉంటే కార్ డిపోకు అనుకూలమైన స్థలం ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఇలాంటి ఇబ్బందుల మధ్య ప్రాజెక్టు పనులు చేపట్టడం సాధ్యం కాదని రిలయన్స్ చేతులెత్తేసింది. అప్పటి నుంచి మెట్రో-2 ప్రాజెక్టుపై రెండు సంస్థల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. దీంతో రిలయన్స్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని ఎమ్మెమ్మార్డీయే ఆలోచించడం ప్రారంభించింది. చివరకు రిలయన్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఎమ్మెమ్మార్డీయేకు మార్గం సుగమమైంది. కాని రిలయన్స్ను ఒప్పించే ప్రయత్నాలు ఎమ్మెమ్మార్డీయే చేయలేదనే అనేక ఆరోపణలు వచ్చాయి. మరోపక్క ఈ ప్రాజెక్టు పెండింగులో పడిపోవడానికి రిలయన్స్ సంస్థే కారణమని ఎమ్మెమ్మార్డీయే పేర్కొంది. కాగా ఈ ప్రాజెక్టు కోసం బ్యాంక్ గ్యారంటీగా చెల్లించిన రూ.160 కోట్లు వెంటనే చెల్లించాలని రిలయన్స్ పట్టుబట్టింది. ముంబై మెట్రో ట్రాన్స్పోర్టు ప్రై.లి. నుంచి అధికారికంగా పత్రాలు లభించగానే బ్యాంక్ గ్యారంటీ డబ్బులు చెల్లిస్తామని ఎమ్మెమ్మార్డీయే స్పష్టం చేసింది.