breaking news
co workers
-
50 ఏళ్ల సహోద్యోగి అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి..!
ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు, చిన్న చిన్న గొడవలు కామన్గానే ఉంటాయి. అవి వర్క్ పరంగానే తప్ప వ్యక్తిగతంగా కాదు కాబట్టి..అక్కడున్నంత సేపే గుర్తించుకుంటాం. ఆ తర్వాత వదిలేస్తాం. కానీ కొందరు కాస్త చొరవ తీసుకుని అసౌకర్యానికి గురిచేసేలా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా మహిళపట్ల కొందరు మగ ఉద్యోగులు ప్రవర్తన డిఫెరెంట్గా ఉంటుంది. అలా కాకుండా 50 ఏళ్ల వ్యక్తి వయసుకు తగ్గట్టుగా కాకుండా కుర్రాడిలా ప్రవర్తిస్తే ఎవ్వరికైన చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది ఓ టెక్ కంపెనీలో పనిచేస్తున్న వివాహిత.ఆమె పోస్ట్లో ఇలా రాసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న 22 ఏళ్ల మహిళ 50 ఏళ్లకు పైనే ఉండే సహోద్యోగితో తనకెదురైన అసౌకర్యమైన క్షణాన్ని పోస్ట్లో షేర్ చేసుకుంది. తామెప్పుడు చాలా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. మేనేజ్మెంట్ మీటింగ్లు ముగిసిన వెంటనే కంపెనీయే ఫ్రీగా స్నాక్స్ పెట్టడం జరుగుతుంది. దానిని తాము షేర్ చేసుకునేవాళ్లం. అలాగే ఏదైనా విషయం ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్లో చాట్ చేసుకునేవాళ్లం. అవన్నీ పనిలో భాగంగా చాలా సాధారణమే. అందువల్ల స్నేహపూర్వకంగానే ఇదంతా అనే భావించా. కానీ ఒక వారం తర్వాత పెళ్లిచేసుకుని వచ్చాక ఒక్కసారిగా అతడి తీరు మారిపోయింది. రోటీన్గా ఇదివరకిటిలా స్నాక్స్ షేర్ చేయడం అన్ని చేశారు. అక్కడ వరకు అంతా బాగానే ఉన్నా..సడెన్గా గ్రూప్లో మెసేజ్ల పరంపర డిఫెరెంట్గా మొదలైంది. ఆరోజు జరిగే పనుల గురించి జోక్ చేయడం నుంచి కాస్త విభిన్నంగా మాట్లాడాడు. దాన్ని కూడా తేలిగ్గా తీసుకున్నానంటూ తన గోడును చెప్పుకొచ్చిందామె. డిసెంబర్ 30కి ముందు రోజు అదనపు షిఫ్ట్ల అనంతరం అతడి స్వరంలో మార్పులు స్పష్టంగా గమనించాను. అతడు ఓ పెద్దాయనలా ప్రవర్తించడం లేదనిపించింది. మన ఇద్దరం మంచి ఫుడ్లవర్స్ కాబట్టి ఎప్పుడైనా సరదా వీలుకుదిరితే డిన్నర్కి ప్లాన్ చేద్దామా అని అడిగాడు. ఒక్కసారిగా ఆ మాటకు హుతాశురాలినయ్యానంటూ..తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది. అంతేగాదు అతడి ఆహ్వానాన్ని రిజెక్ట్ చేసి దూరంగా ఉంచాలా, యాజమాన్యానికి ఈ ఘటన గురించి వివరించాలో సలహా ఇవ్వమని కోరింది పోస్ట్లో. అయితే నెటిజన్లు..ఆ ఆహ్వానానని తిరస్కరించండి. అతడి ఆలోచన తీరు సరిగా లేదు..సున్నితంగా రిజెక్ట్ చేసి దూరంగా ఉండటమే మంచిది అంటూ పోస్టులు పెట్టడం గమనార్హం. (చదవండి: ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్ తగ్గిపోతుందా..? ఆ హాస్య నటుడు ఏకంగా 78 కిలోలు తగ్గి..) -
సహోద్యోగి చెవి కొరికిన ప్రవాస భారతీయునికి జైలు శిక్ష
సహోద్యోగి చెవి కొరికినందుకు సింగపూర్లో ప్రవాస భారతీయునికి ఐదు నెలల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మోహన్ శంకర్, తమిళనాడు నుంచి వెళ్లి సహచరులతో కలిసి సింగపూర్లో నిర్మాణ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2020లో మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడగా.. ప్రస్తుతం కోర్టు తీర్పునిచ్చింది. మద్యం మత్తులో సహోద్యోగిపై వాగ్వాదానికి దిగిన మోహన్.. అనంతరం అతనిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో సహోద్యోగి చెవిని కొరికేశాడని పోలీసులు తెలిపారు. బాధితున్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుని కోలుకున్నాడు. కాగా.. మోహన్పై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ తర్వాత ఈ మేరకు ఐదు నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్.. -
రైల్వే ఉద్యోగినిపై.. సహోద్యోగుల గ్యాంగ్ రేప్
కోల్కతా: మధ్యవయస్కురాలైన రైల్వే ఉద్యోగినిపై నలుగురు సహోద్యోగులే కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న దారుణ ఘటన కొల్కతాలో వెలుగు చూసింది. బాధితురాలిపై ఆ నలుగురు కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఉదంతాన్ని ఫొటోలు కూడా తీశారు. విషయాన్ని ఎవరికైనా చెప్పినా.. తమకు సహకరించకపోయినా.. ఆ ఫొటోలను నెట్లో పెట్టడంతోపాటు చంపేస్తామని ఆమెను బెదిరించారు. అయితే, ఆమె తనపై జరిగిన అకృత్యాన్ని ఓ టీవీ చానల్తో శనివారం పంచుకోవడంతో విషయం వెలుగు చూసింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. రైల్వే ఉద్యోగి అయిన బాధితురాలి భర్త.. 2010లో జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమెకు రైల్వేలో ఉద్యోగం లభించింది. అనంతరం కొన్నాళ్లకు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇదిలావుంటే, రైల్వే శాఖలో విధి నిర్వహణలో పరిచయం అయిన నలుగురు ఉద్యోగులు ఆమెను శారీరకంగా వేధించడం ప్రారంభించారు. భర్తకు విడాకులు ఇచ్చి తమను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తిడి తెచ్చారు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో అతను ఆత్మహ త్యా యత్నం చేశాడు. మరోపక్క, ఆ నలుగురు బాధితురాలిపై చిత్పూర్ రైల్వేయార్డులోని ఖాళీ రైలు బోగీలో పలు దఫాలుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. తాను నిండు గర్భిణిని అని వేడుకున్నా నిందితులు కనికరించలేదని బాధితురాలు వాపోయింది. స్పందించిన డండం జీఆర్పీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి, నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.


