chinnu
-
ప్రాణం తీసిన ఈత సరదా
ఒంగోలు టౌన్: ఈత సరదా నలుగురు చిన్నారులను బలిగొంది. అప్పటివరకు ఉత్సాహంగా కేరింతలు కొట్టిన చిన్నారులు విగతజీవులుగా మారి.. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన కరేటి కల్యాణ చక్రవర్తి ఆర్ఎంపీగా పనిచేస్తుంటాడు. అతడి భార్య లక్ష్మి జానకి ఒంగోలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. కల్యాణ చక్రవర్తి చెల్లెలు నాగరాజ భర్త పొదిలి రవి కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమారుడు చిన్నుతో కలిసి తల్లి దగ్గర ఉంటోంది. నాగరాజ కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. కల్యాణ చక్రవర్తి ఇద్దరు కుమారులైన అభిరామ్(14), సుశాంత్ (12), నాగరాజ కుమారుడు చిన్ను(11), ఎదురింట్లో ఉండే ఇల్లా మాలయ్య కుమారుడు దినేశ్ స్నేహితులు. గురువారం ఉదయం ఆడుకునేందుకని ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం కందులూరు డొంక చెరువులో ఈతకు వెళ్లి.. నలుగురూ మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనం సమయం అవుతున్నా పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊరంతా వెదికారు. చివరికి చెరువు గట్టు మీద పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించాయి. ఈతకు దిగిన పిల్లలు చెరువులో గల్లంతైనట్లు భావించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల తర్వాత అభిరామ్, సుశాంత్, దినేశ్, చిన్ను మృతదేహాలు బయటపడ్డాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మరణించడంతో.. వారి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయ విదారకమని.. బాధిత కుటుంబాల్లో నెలకొన్న విషాదం మాటల్లో వర్ణించలేనిదని అన్నారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ గారాలపట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిదని.. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు. -
‘లవ్ యూ రా’ కడుపుబ్బా నవ్వించేస్తుంది: హీరో చిన్ను
చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో..హీరో చిన్ను మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యూ రా’ ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. గీతిక పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ అందరినీ నవ్విస్తుంది. చంద్ర శేఖర్ గారి పాత్ర చాలా బాగా వచ్చింది. మా చిత్రంలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ గారు మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ చిత్రం సెప్టెంబర్ 5న రాబోతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ మూవీ వందకు రెండొందల శాతం సక్సెస్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.హీరోయిన్ గీతిక మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ టీం అంతా కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
భార్య సీమంతం వేడుకల్లో టాలీవుడ్ విలన్ (ఫొటోలు)
-
భవనం పై నుంచి కిందపడ్డ యువకుడు.. 10 గంటలు చీకట్లో నరకయాతన..
రాజన్న: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డ యువకుడు చీకట్లో ఎవరూ చూడకపోవడంతో దాదాపు 10 గంటలు నరకయాతన పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన శాతాని లింగారెడ్డి కుమారుడు శాతాని చిన్ను(26) గురువారం రాత్రి భోజనం అనంతరం భవనంపైకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. చీకటి కావడంతో ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేదు. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లే రైతులు గమనించి చిన్ను కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కరెంటు షాక్తో యువకుడి మృతి
మాలియల్ : కరీంనగర్ జిల్లా మాలియల్ మండలం నూకపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామశివారులో ఉన్న ఓ వ్యవసాయ బావి వద్ద కూలీ పనులు చేస్తుండగా చిన్ను(23) అనే యువకుడు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


