breaking news
chandlapur
-
తెలంగాణ పల్లెకు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ/చిన్నకోడూరు(సిద్దిపేట): రెండు తెలంగాణ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన జనగామ జిల్లా పెంబర్తితోపాటు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం ఈ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. చంద్లాపూర్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల మంత్రి హరీశ్రావు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. హరీశ్రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. పెంబర్తి... చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీక ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్రం చొరవతీసుకుంది. చంద్లాపూర్.. కళాత్మకత, చేనేతల కలబోత రంగనాయక స్వామి ఆలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభా మ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యా నికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబో తకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పె రుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీర ల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు గ్రామీ ణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటు గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కార ణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల చొరవతో చంద్లాపూర్ లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. -
ఊద్యమాలకు చాకలి ఐలమ్మ ఊపిరి
ఆమె జీవితం స్ఫూర్తిదాయకం రూ. 20 లక్షలతో సిద్దిపేటలో స్మారక భవనం రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట రూరల్: ఉద్యమాలకు ఊపిరి పోసి ఎన్నో పోరాటాలు చేసిన చాకలి ఐలమ్మను మరువలేమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. చాకలి ఐలమ్మ 31వ వర్ధంతిని పురస్కరించుకోని శనివారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో ఆమె విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శప్రాయమని, తెలంగాణ కోసం ఆమె పోరాడిన స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. వరంగల్ జిల్లా పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చాకలి ఐలమ్మ మార్కెట్ కమిటీగా తానే నామకణం చేశానని గుర్తుచేశారు. అలాగే త్వరలో సిద్దిపేటలో రూ. 20 లక్షలతో ఐలమ్మ స్మారక భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆమె పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. చంద్లాపూర్కు రూ. 1.92 కోట్లు చంద్లాపూర్ గ్రామాన్ని దశల వారిగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కింద రూ. 1.92 కోట్లతో గ్రామంలో తాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు. పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు 1.50 లక్షల లీటర్లు, 40 వేల లీటర్లు, 20 వేల లీటర్ల వాటర్ ట్యాంకుల నిర్మాణం గ్రామంలో చేపడుతున్నామన్నారు. ఈ సంవత్సరంలోనే చంద్లాపూర్లో ఇంటింటికి తాగునీరందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతకు ముందు చంద్లాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం రంగనాయక సాగర్ ముంపునకు గురవుతుండడంతో గ్రామ గౌడ సంఘం ప్రతినిధులకు రూ.12 లక్షల చెక్కును పరిహారం కింద మంత్రి అందించారు. మంత్రి వెంట జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమల, సర్పంచ్ మంగమ్మ, ఎంపీటీసీ ఆరుణ, నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, బాల్రెడ్డి, ఒర్రెల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.