breaking news
Century Textiles Ltd.
-
అదరగొట్టిన సెంచురీ టెక్స్టైల్స్, ఆదాయం జంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్చేసి రూ. 70 కోట్లకు చేరింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 44 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,034 కోట్ల నుంచి రూ. 1,242 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 972 కోట్ల నుంచి పెరిగి రూ. 1,125 కోట్లను తాకాయి. కంపెనీ టెక్స్టైల్స్, పల్ప్, పేపర్, రియల్టీ బిజినెస్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఫలితాల నేపథ్యంలో సెంచురీ టెక్స్టైల్స్ షేరు గురువారం నాటి 8 శాతం లాభంతో పోలిస్తే 2 శాతం నష్టంతో 861 వద్ద ట్రేడ్ అవుతోంది. -
8,400 దాటేసిన నిఫ్టీ
క్యూ3లో జపాన్ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో మాంద్యంలోకి జారుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో జపాన్ మొదలు ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాలతో వెనుకంజ వేశాయి. దేశీయంగానూ ఈ ప్రభావం పడటంతో మార్కెట్లు తొలుత నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా క్షీణించి 27,921 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే అక్టోబర్ నెలలో దిగుమతుల భారం బాగా తగ్గి వాణిజ్యలోటు మరింత కట్టడికావడంతో మిడ్ సెషన్ నుంచీ సెంటిమెంట్ మెరుగైంది. ప్రధానంగా చమురు దిగుమతుల బిల్లు క్షీణించడం ఇన్వెస్టర్లకు జోష్నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్ 28,206 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరికి 131 పాయింట్ల లాభంతో 28,178 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు పుంజుకుని 8,431 వద్ద ముగిసింది. అంతకుముందు ఇంట్రాడేలో 8,438ను చేరింది. మార్కెట్ చరిత్రలోనే ఇవి సరికొత్త గరిష్టాలుకావడం గమనార్హం. ఎస్బీఐ జోరు క్యూ2లో ప్రోత్సాహక ఫలితాల కారణంగా ఎస్బీఐ 5.5% జంప్చేసింది. రూ. 2,940 వద్ద ముగిసింది. ఇది ఏడాది గరిష్టంకాగా, 4% ఎగసిన టాటా మోటార్స్ రూ. 545 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో హీరోమోటో, ఎన్టీపీసీ, రిలయన్స్ సైతం 2-1.5% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు 1%పైగా నష్టపోయాయి. ఎఫ్ఐఐలు రూ. 656 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. చిన్న షేర్లు ఓకే మార్కెట్ను మించుతూ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 1% స్థాయిలో బలపడ్డాయి. బీఎస్ఈ-500లో గతి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, బజాజ్ ఫైనాన్స్, కల్పతరు పవర్, అనంత్రాజ్, ఎన్సీసీ, ఎల్జీ ఎక్విప్మెంట్స్, స్టెరిలైట్ టెక్, వీగా ర్డ్, పీఎఫ్సీ 18-8% మధ్య దూసుకెళ్లాయి.