breaking news
Birth father
-
కిరాతకుడు..
- కుటుంబ కలహాలతో కూతురిని చంపిన తండ్రి - మృతదేహాన్ని క్వారీలో పడేసిన వైనం - మద్యం మత్తులో ఘాతుకం - కర్ణాటక రాష్ట్రం కల్లూరులో ఘటన తాండూరు రూరల్: కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కుటుంబ కలహాలతో ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. మద్యం మత్తులో మృగంలా మారి చంపేసి మృతదేహాన్ని క్వారీలో పడేసి పరారయ్యాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన తాండూరు మండలం సంగెంకాలన్ సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కల్లూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, కర్ణాటక పోలీసుల కథనం ప్రకారం.. తాండూరు మండలం సంగెంకాలన్ గ్రామానికి చెందిన నజాబేగంను ఏడేళ్ల క్రితం ముంబైకి చెందిన శంషీర్ వివాహం చేసుకున్నాడు. సంగెంకాలన్లో ఉంటున్న దంపతులకు కుమారుడు సోయాబ్ఖాన్, కూతురు గుల్శరా(4) ఉన్నారు. చిన్నారి స్థానికంగా అంగన్వాడీ పాఠశాలలో చదువుతోంది. కొంతకాలం పాటు పాలిషింగ్ యూనిట్లో పని చేసిన ఇటీవల పనిమానేశాడు. మద్యానికి బానిసై భార్య నజాబేగంను వేధించసాగాడు. ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం శంశీర్ కుటుంబీకులతో గొడవపడ్డాడు. తాగిన మైకంలో మధ్యాహ్నం 3 గంటలకు కూతురు గుల్శరాకు బిస్కెట్లు కొనిస్తానని చెప్పి ఆమెను సంగెంకాలన్కు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కల్లూరు గ్రామం వైపు వెళ్లాడు. కుటుంబీకులు, స్థానికులు అతడిని వెంబడించగా రాళ్లతో దాడి చేశాడు. కూతురును గొంతునులిమి చంపేసిన శంషీర్ మృతదేహాన్ని కల్లూరు శివారులోని ఓ నాపరాతి క్వారీలో పడేశాడు. అక్కడి నుంచి ఓ లారీలో చించోలి నుం చి చాంగ్లేర్ మీదుగా వెళ్తుండగా స్థాని కులు ఓ వాహనంలో వెంబడించి అతడిని పట్టుకొని కర్ణాటక రాష్ట్రం మిర్యాణ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపగా కూతురి హత్య విషయం తెలిపాడు. క్వారీ నుంచిమృతదేహం వెలికితీత.. కర్ణాటక రాష్ట్రం కల్లూరు శివారులోని ఓ పాడుబడ్డ క్వారీలోంచి మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మిర్యాణ్ ఎస్ఐ హేమంత్కుమార్ చించోలి ఫైర్ ఆఫీసర్ శివరాజ్ కంగ్టీ సాయంతో వెలికితీయించారు. విగతజీవిగా పడి ఉన్న తన కూతురును చూసిన తల్లి నజాబేగం తల్లడిల్లిపోయింది. మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని ఆమె హృదయ విదాకరంగా రోదించిన తీరుకు స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని చించోలి డీఎస్పీ, సీఐలు పరిశీలించారు. అనంతరం అక్కడి చందాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటంబీకులకు అప్పగించారు. నిందితుడు శంషీర్ను రిమాండుకు తరలించినట్లు మిర్యాణ్ పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వాసుపత్రిలో ఆడ శిశువు అమ్మకం?
పెగడపల్లి(కాల్వశ్రీరాంపూర్) : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ఆడ శిశువును కన్నతండ్రే విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఓ ఆరోగ్యం కేంద్రం సిబ్బంది మధ్యవర్తిగా మారి రూ.ఐదు లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం. అయితే శిశువును కొన్నవారి నుంచి డబ్బు ఇప్పించడంలో వివాదం ఏర్పడి.. అది ముదరడంతో విషయం బయటకు పొక్కినట్లయ్యింది. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన ఓ వికలాంగుడు భార్య చనిపోతే సుల్తానాబాద్కు చెందిన మరో మహిళను కులాంతరం వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ గర్భం దాల్చడంతో పురుడు కోసం ఇటీవల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ప్రసవం అయ్యాక అపస్మారక స్థితికి చేరింది. దీనిని అదునుగా భావించిన ఓ ఆరోగ్యకేంద్రం సిబ్బంది వికలాంగుడితో రూ.ఐదు లక్షలకు బేరం కుదుర్చుకుని.. రూ.25 వేలు అడ్వాన్సుగా ఇచ్చి పాపను తీసుకెళ్లినట్లు సమాచారం. పాప గురించి తల్లి ఆరా తీయగా.. ఐసీయూలో ఉందని నమ్మించి ఆమెను పుట్టినింటికి పంపారు. పాప తండ్రి మిగతా డబ్బుల కోసం దళారిని నిలదీశాడు. దీనికి దళారి పాప చనిపోయిందని, ఇక డబ్బులు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వికలాంగుడు అతడితో వాగ్వావాదానికి దిగగా కొందరు పెద్దమనుషులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.