breaking news
big producers
-
మత్తు ‘చిత్రం’లో మిస్సింగ్ పాత్రలు
- ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేసి తప్పించుకున్న కొందరు - బడా నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల తనయులు కూడా.. - కెల్విన్, జీశాన్ల కాల్డేటా విశ్లేషణలో వెల్లడి - డ్రైవర్లు, మేనేజర్లు, మేకప్మెన్ల ఫోన్ నంబర్ల నుంచి డ్రగ్స్ కోసం ఆర్డర్లు.. వారి పేర్లూ చూచాయగా వెల్లడి డ్రగ్స్ వ్యవహారంలో లింక్ ఉన్న సినీ ప్రముఖుల సంఖ్య - 27 సిట్ నోటీసులు జారీ అయిన వారి సంఖ్య - 12 వివరాలు బయటకు రానివారి సంఖ్య - 15 సాక్షి, హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమను కుదిపేస్తోంది.. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులు సహా మొత్తంగా 27 మందికి డ్రగ్స్ వ్యవహారంతో లింకు ఉన్నట్లు వెల్లడైంది. కానీ వారిలో 12 మందికి మాత్రమే ఎక్సైజ్ సిట్ అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. వారి పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మిగతా 15 మందికి సంబంధించిన వివరాలేమీ బయటకు రాకపోవడంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ 15 మంది కూడా ప్రముఖ నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు అని... వారు తమకున్న పలుకుబడితో ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి, పేర్లు బయటికి రాకుండా చూసుకున్నారని సమాచారం. అయితే ఎక్సైజ్ వర్గాలు మాత్రం ఆ మరో 15 మంది సినీ ప్రముఖులు ఎవరనేది చూచాయగా వెల్లడిస్తున్నాయి. కెల్విన్, జీశాన్ల కాల్డేటాతో.. డ్రగ్స్ వ్యవహారంలో కీలకమైన కెల్విన్, జీశాన్ల ఫోన్ కాల్డేటాను విశ్లేషించిన ఎక్సైజ్ సిట్ అధికారులు.. ఎన్నో ఆశ్చర్యకర విషయాలను గుర్తించారు. కెల్విన్కు చెందిన 4 సిమ్కార్డులు, జీశాన్కు చెందిన 2 సిమ్ కార్డుల డేటాను పరిశీలించి.. ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్లిందీ నిర్ధారించుకున్నారు. అత్యధికంగా 27 మంది సినీ ప్రముఖుల ఫోన్ నంబర్లకు కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. అందులో 12 మందికి మాత్రం నోటీసులు జారీ చేశారు. ఇందులో రవితేజ, పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, ఛార్మి, ముమైత్ఖాన్, నవదీప్, తరుణ్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మిగతావారికి నోటీసులు జారీ చేయలేదు. వారి పేర్లు బయటికి రాలేదు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మిగతా 15 మందికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదన్న వాదన వినవస్తోంది. ఇక కావాలనే కొంత మందిని డ్రగ్స్ కేసులోకి లాగుతున్నారని వర్ధమాన నటుడు నందు ఆరోపించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. ఆ ప్రచారం తప్పని రుజువు చేసుకోవడానికే వచ్చానన్నారు. అధికారులెవరూ లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు తమకు ఎలాంటి నోటీసులు రాకున్నా తమ పేర్లు ప్రచారం కావడంపై ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్యామ్కే నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పలుకుబడితో తొక్కిపెడుతున్నారు? బడా నిర్మాతలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, హీరో హీరోయిన్లకు డ్రగ్స్ను అలవాటు చేసిన వారి పేర్లు, నిర్మాతల తనయుల పేర్లు బయటికి రాకుండా తొక్కిపెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారని.. అందువల్లే ఎక్సైజ్ సిట్ నోటీసులు ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ పలుకుబడి లేనివారికి మాత్రమే ఎక్సైజ్ సిట్ నోటీసులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఆ 15 మంది వీరే..! సినీ పరిశ్రమకు చెందిన 27 మంది ప్రముఖులకు డ్రగ్స్తో లింకు ఉన్నట్లు గుర్తించగా.. అందులో నోటీసులిచ్చినట్లుగా 12 మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మిగతా 15 మంది ఎవరనే దానిపై ఎక్సైజ్ వర్గాలు పలు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. వీరే ఆ ప్రముఖులు.. ⇒ ఆయన ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి. అనుకోకుండా క్రేజీ స్టార్తో అత్యంత హిట్ సినిమాకు దారివేసిన నిర్మాత ఈయన. ⇒ మరొకరు కుటుంబ కథనాలు, చిన్న సినిమాలను వేదికగా చేసుకుంటూ భారీ హిట్లు కొట్టిన నిర్మాత. తన సొంత బ్యానర్తో కుర్రహీరోతో తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొచ్చారు. ⇒ మరో ప్రముఖ నిర్మాత ఇద్దరు తనయులూ డ్రగ్స్ ‘బంధం’లో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తమ పాత్ర కీలకమైనదని చెప్పుకొనే పలు కుటుంబాల్లో వీరూ ఒకరు. ఈ కుటుంబానికి చెందిన వారంతా సినీ పరిశ్రమలో రాణిస్తున్నవారే. గతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ కేసుల్లో ఈ ప్రొడ్యూసర్ తనయుల పేర్లు చాలా సార్లు వినిపించాయి. వీరిలో చిన్న కుమారుడికి కెల్విన్ ద్వారా.. పెద్ద కుమారుడికి మరో కుర్రహీరో ద్వారా డ్రగ్స్ అందినట్లు సిట్ ఆధారాలు సంపాదించింది. ⇒ 2011, 2012 సంవత్సరాల్లో ప్రముఖ హీరోలతో రెండు, మూడు సినిమాల్లో నటించి.. ఫ్లాప్ హీరోయిన్లుగా ముద్రపడిన ఇద్దరు హీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ⇒ 2009లో ఇండస్ట్రీలో అడుగుపెట్టి కుర్ర హీరోలతో వరుస హిట్లు కొట్టి.. ప్రస్తుతం బాలీవుడ్కు చెక్కేసిన మరో ప్రముఖ హీరోయిన్ తన మేనేజర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్టు సిట్ వర్గాలు గుర్తించాయి. కెల్విన్ ఫోన్కు పదే పదే కాల్స్ వచ్చిన ఓ ఫోన్ నంబర్పై సిట్ అధికారులు దర్యాప్తు చేయగా.. అతను హీరోయిన్ మేనేజర్ అని, మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న కార్యాలయం అడ్రస్ పేరు మీద సిమ్ తీసుకున్నాడని తేల్చారు. ⇒ ఇక వేగంగా సినిమాలు తీస్తాడని పేరుపొందిన ప్రముఖ దర్శకుడి ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు కెల్విన్తో టచ్లో ఉన్నట్టు అనాలిసిస్లో బయటపడింది. ⇒ రవితేజ తమ్ముడు భరత్తో పదే పదే పార్టీలు, పబ్లకు వెళ్లిన ఓ సహాయనటుడు, ప్రముఖ హీరోకు మేనేజర్గా పనిచేసే నటుడు నిత్యం జీశాన్తో టచ్లో ఉండేవాడని వెల్లడైంది. ⇒ మేకప్మెన్, డ్రైవర్ల పేరుతో సిమ్కార్డులు తీసుకొని డ్రగ్స్ వాడుతున్న ఒక విలక్షణ దర్శకుడికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో లింకున్నట్టు చెబుతున్నారు. ఏప్రిల్లో రాయదుర్గం పరిధిలోని ఓ ఫాంహౌజ్లో ఈ దర్శకుడికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్టు జీశాన్ విచారణలో వెల్లడించినట్టు సిట్ అధికారులు తెలిపారు. ⇒ 2013 వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా సినిమాలు చేసి ప్రముఖ హీరోతో సినిమా తీసి సంచలనం రేపిన నటుడు, నిర్మాతకు కూడా డ్రగ్స్ లింకు ఉందని సిట్ భావిస్తోంది. ఆయన తన ఫాంహౌజ్లో పనిచేసే సహాయకుడి పేరుతో సిమ్కార్డు తీసుకొని జీశాన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నారు. ⇒ఆయనొకప్పుడు ఫ్యామిలీ హీరో.. వయసు పెరిగినా కొద్దీ ఏ క్యారెక్టరైనా చేసేందుకు సిద్ధమయ్యారు. విలక్షణ నటుడిగా పేరుగాంచిన ఈ హీరోకు సైతం డ్రగ్స్ లింకు బయటపడడం సంచలనం రేపుతోంది. ఆయన మేనేజర్ ఫోన్ నంబర్ నుంచి కెల్విన్తో కాంటాక్టులో ఉన్నట్లు సిట్ గుర్తించింది. సినీ ‘బంధం’కుదిరిందెలా? బీటెక్ చదివి బ్యాంకులో ఉద్యోగం చేసిన కెల్విన్.. గ్రాడ్యుయేషన్ చేసి ప్రముఖ రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తున్న జీశాన్.. ఇద్దరూ అడ్డదారి సంపాదన కోసం డ్రగ్స్ దందాకు తెరలేపారు. విద్యార్థులు, సినీ ప్రముఖులకు డ్రగ్స్ను సరఫరా చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరికి సినీ పరిశ్రమలో లింకులు ఎలా కుదిరాయి? ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఎలా పరిచయమయ్యారు? వాళ్లు డార్క్నెట్లో ఆర్డర్ చేస్తే వీళ్లు సరఫరా చేయడం వెనుకున్న ఆంతర్యం ఏమిటన్న విషయాలు ఎక్సైజ్ అధికారులకు సవాలు విసురుతున్నాయి. అయితే క్లబ్బులు, సినీ పార్టీలు, పబ్బుల్లో లైవ్షోలు, ఈవెంట్లు నిర్వహించడంతో.. సినీ పరిశ్రమకు చెందినవారితో కెల్విన్కు పరిచయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. 2008 నుంచి 2013 వరకు గంజాయి వినియోగించిన కెల్విన్... దానిని సినీ పరిశ్రమకు చెందిన పలువురికి అలవాటు చేశాడు. ఆ తర్వాత డార్క్నెట్ ద్వారా ఎల్ఎస్డీ, ఎండీఎంఏ డ్రగ్స్ను తెప్పిస్తూ.. బడా నిర్మాతలు, దర్శకులకు, హీరోయిన్లకు సరఫరా చేసినట్టు ఎక్సైజ్ సిట్ గుర్తించింది. దీనిపై కెల్విన్ను విచారించగా.. పలు కీలక విషయాలు వెల్లడించాడు. డార్క్నెట్ నుంచి తెప్పించుకున్న ఎల్ఎస్డీ డ్రగ్స్ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్కు, పలువురు నిర్మాతలకు సరఫరా చేసినట్లుగా బయటపెట్టినట్లు ఎక్సైజ్ శాఖలో పనిచేసే కీలక అధికారి ఒకరు తెలిపారు. జీశాన్.. మేనేజర్ టు డ్రగ్ పెడ్లర్ హైదరాబాద్లోని మెహిదీపట్నంలో నివసించే జీశాన్ అలీ అలియాస్ జాక్ (23) మొఘల్ బావర్చి హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. పలు ఈవెంట్ల (వేడుకలు, ఇతర కార్యక్రమాలు)కు మేనేజర్గా కూడా పనిచేస్తున్నాడు. అలా ఈవెంట్ల సమయంలోనే హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజుతో జీశాన్కు పరిచయం ఏర్పడినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆ క్రమంలో రవితేజ సోదరుడు భరత్తో స్నేహం ఏర్పడిందని.. డార్క్నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించడం సులువన్న విషయాన్ని భరత్కు జీశానే చెప్పాడని విచారణలో బయటపడింది. భరత్, శ్రీనివాస్రాజులకు జీశాన్ కొకైన్ సరఫరా చేసి ఉంటాడా? రవితేజకు తమ్ముడు భరత్ ద్వారా డ్రగ్స్ వెళ్లాయా? లేక శ్రీనివాసరాజు ద్వారా వెళ్లాయా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని సిట్ అధికారులు తెలిపారు. వారికి నోటీసులు ఇచ్చామని, విచారణలో విషయం బయటపడుతుందని పేర్కొన్నారు. (చదవండి.. డ్రగ్స్ కేసు: సినిమా ప్రముఖుల పేర్లు వెల్లడి!) (టాలీవుడ్ను ఆడిపోసుకుంటున్నారు: జీవిత) -
బడా నిర్మాతలు...ఛోటా సినిమాలు!
గది నిండా కాసులే ! సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ‘రాజుగారి గది’ గుర్తుందా? తన తమ్ముడు అశ్విన్ని హీరోగా పెట్టి ఓంకార్ డెరైక్ట్ చేసిన సినిమా ఇది. సినిమా అయితే బాగానే తీశాడు కానీ, రిలీజ్ చేయడం ఎలా? నిర్మాత సాయి కొర్రపాటి సీన్లోకి రావడంతో సమస్య సాల్వ్ అయిపోయింది. ఈ సినిమా మీద నమ్మకంతో ఆయన రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్. ‘రాజుగారి గది’లో డబ్బులే డబ్బులు. మరి, సాయి కొర్రపాటి ఏమైనా చిన్న నిర్మాతా? కాదు.. టెక్నికల్ వండర్ ‘ఈగ’ తీశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా ‘లెజెండ్’ నిర్మాతల్లో ఆయనా ఒకరు. ఇలాంటి బడా చిత్రాల నిర్మాత అయినా ఛోటా సినిమాలంటే ఆయనకు మక్కువ. అందుకే తన వారాహి చలన చిత్రమ్ బేనర్లో స్మాల్, మీడియమ్ బడ్జెట్ సినిమాలు తీస్తుం టారు. ఇరవై, నలభై కోట్లతో సినిమాలు తీసే సాయి రెండు కోట్లలోపు స్మాల్ బడ్జెట్ సినిమాలూ తీస్తుండడం విశేషం. కొత్త ఊపిరి ఒక్క హిట్ చూశాక మనసు ఆగదు. ఆ హిట్ని కొనసాగించాలనుకుంటారు. అందుకే ‘రాజుగారి గది’కి సీక్వెల్ చేయాలనుకున్నారు ఓంకార్. మొదటి భాగానికి సాయి కొర్రపాటి అండగా నిలిస్తే... రెండో భాగానికి ఎవరి సపోర్ట్ దొరికిందో తెలుసా? పొట్లూరి వి. ప్రసాద్ (పీవీపీ). ఆయన తీసినవి మామూలు సినిమాలు కాదు. ‘బలుపు, వర్ణ, సైజ్ జీరో, ఊపిరి, బ్రహ్మోత్సవం’... ఇలా అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే. ఇప్పుడేమో తెలుగు, హిందీ భాషల్లో ‘ఘాజి’ అనే సినిమా తీస్తున్నారు. భారతీయ భాషల్లో తొలి జలాంతర్గామి నేపథ్య సినిమా ఇది. మొత్తం నీటి లోపలే ఉంటుంది. చాలా పెద్ద బడ్జెట్. ఈ సినిమా తీస్తూనే కథ నచ్చి, చిన్న బడ్జెట్ ‘క్షణం’ చిత్రానికి అండగా నిలిచారు. తీసినవాళ్ళకీ, కొన్న పీవీపీకీ దిల్ ఖుష్ చేసిన సినిమా ఇది. అదే ఊపుతో ఇప్పుడు ‘రాజుగారి గది 2’కి పీవీపీ సపోర్ట్ చేస్తున్నారు. అలా చిన్న సినిమాలకు ఈ పెద్ద నిర్మాత ఊపిరి అవుతున్నారు. బిగ్ హెల్ప్ సరే.. సాయి కొర్రపాటి, పీవీపీ అంటే ఇప్పుడొచ్చినోళ్లు. ఎప్పట్నుంచో బడా నిర్మాతల్లో ఒకరిగా ఉంటున్న డి.సురేశ్బాబు కూడా చిన్న సినిమాపై మొగ్గు చూపడం విశేషం. ‘పెళ్లి చూపులు’ అనే చిన్ని సినిమాకి సురేశ్బాబు చేసిన సపోర్ట్ చాలా ఉపయోగపడింది. ఈ సినిమా విడుదలై దాదాపు మూడు నెలలవుతున్నా ఇంకా వార్తల్లోనే ఉంది. ‘పెళ్లి చూపులు’ స్ఫూర్తితో మరిన్ని చిన్న సినిమాలు మొదలయ్యాయి. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమాకి సురేశ్ ప్రొడక్షన్స్ బేనర్ తోడవ్వడం పెద్ద హెల్ప్. ఈ బేనర్కి ఉన్న రేంజ్ అలాంటిది. ఈ బేనర్పై ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు వంటి పెద్ద పెద్ద హీరోలతో బిగ్ బడ్జెట్ మూవీస్ ప్రొడ్యూస్ చేశారు డి. రామానాయుడు. అలాగే చిన్న సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు సురేశ్బాబు కూడా ఒకవైపు పెద్ద సినిమాలు, మరోవైపు చిన్న సినిమాలు తీసి, తండ్రిని ఫాలో అవుతున్నారు. దిల్ ఉన్న రాజు ‘వెళ్లిపోమాకే’... ఈ సినిమా రెండేళ్లుగా నిర్మాణంలో ఉంది. కానీ, వెలుగులోకి రాలేదు. ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం లైమ్లైట్లోకి వచ్చేసింది. దానికి కారణం ‘మీ సినిమాని నేను రిలీజ్ చేస్తా’ అని ‘దిల్’ రాజు ముందుకు రావడమే. పంపిణీదారుడిగా పలు బిగ్, మీడియమ్, స్మాల్ మూవీస్ని విడుదల చేశారు ‘దిల్’ రాజు. నిర్మాతగా పెద్ద సినిమాలు తీశారు. ఇప్పుడు ‘వెళ్లిపోమాకే’ సినిమా మీద నమ్మకంతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రనిర్మాతలకు పెద్ద దిల్తో సహాయం చేస్తున్నారు. అలా ఇప్పుడు ఛోటా సినిమాలెన్నో బడా నిర్మాతల అండతో బాక్సాఫీస్ దగ్గర బడా సందడి చేస్తున్నాయి. చిన్న సినిమా అంటే? చిన్న సినిమా అంటే ఏంటి? ఎంతలో తీస్తారు? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఏమీ లేదండి.. కోటి రూపాయల నుంచి రెండు కోట్ల లోపు తీసేవాటిని చిన్న సినిమాలంటారు. ఈ బడ్జెట్ బడా నిర్మాతలకు చాలా ఛోటా. సునాయాసంగా తీసేస్తారు. అఫ్కోర్స్ డబ్బుంటే కొత్తవాళ్లైనా సులువుగానే తీసేస్తారు. కాకపోతే.. బడా నిర్మాత తీస్తే.. ప్రమోషన్ ఈజీ అవుతుంది. సినిమా విడుదలకు ముందే నలుగురికీ తెలుస్తుంది. అదే చిన్నవాళ్లు తీస్తే.. సినిమా రిలీజై, బాగుందనే టాక్ వస్తేనే.. అప్పుడు జనాలు థియేటర్కి వస్తారు. సో.. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు తీయడం మంచిదే. ముఖ్యంగా లాభాలొచ్చే సినిమాలు తీస్తే.. కొన్నవాళ్ల పంట పండినట్లే. ‘ఉయ్యాల జంపాల’... రాజ్ తరుణ్, అవికా గోర్కు హీరో హీరోయిన్లుగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ మంచి వసూళ్లు రాబట్టి, పెద్ద సినిమాగా నిలవడంతో.. ఆ తర్వాత చాలామంది చిన్న సినిమాలు నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా నిర్మించింది చిన్న బేనరేం కాదు. అక్కినేని కుటుంబపు అన్నపూర్ణ స్టూడియోస్. సురేశ్ ప్రొడక్షన్స్కి ఉన్నంత పేరు అన్నపూర్ణకి ఉంది. కొత్త టాలెంట్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నాగార్జున చిన్న సినిమాలు కూడా తీస్తుంటారు. అలా పి. రామ్మోహన్తో కలసి ‘ఉయ్యాల జంపాల’ తీశారు. ‘అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్’ వంటి మంచి మంచి సినిమాలు తీసిన రామ్మోహన్ ఇప్పుడు ‘పిట్టగోడ’ తీస్తున్నారు. మరి.. ఈ సినిమా రిలీజ్కు కూడా ఏదో ఒక పెద్ద బేనర్ ముందుకొచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. - సినిమా డెస్క్