-
‘సరైన సమయంలో హమాస్తో కలుస్తాం’
ఇజ్రాయెల్తో జరుగుతున్న పోరులో హమాస్తో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని.. అందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని లెబనాన్కు చెందిన హిజ్బుల్లా సంస్థ ప్రకటించింది. ‘‘జరుగుతున్న పోరులో భాగం అయ్యేందుకు హిజ్బుల్లా సిద్ధంగా ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు మేం రంగంలోకి దిగుతాం. ఇజ్రాయెల్ వ్యతిరేక పోరులో హమాస్తో చేతులు కలుపుతాం. మా ప్రణాళిక ప్రకారమే మేం ముందుకు వెళ్తాం’’ అని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసీమ్, బీరూట్లో జరిగిన ఓ ర్యాలీలో ప్రకటించారు. ‘‘చాలా దేశాలు, అరబ్ దేశాలు, ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్తలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా హిజ్బుల్లాను యుద్ధానికి దూరంగా ఉండమని కోరుతున్నాయి. కానీ, ఆ పిలుపును మేం పట్టించుకోం. ఏం చేయాలో హిజ్బుల్లాకు బాగా తెలుసు. సరైన సమయంలో రంగంలోకి దిగుతాం’’ అని ఖాసీమ్ తెలిపారు. లెబనాన్లోని పాలస్తీనా గ్రూప్లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ గత కొంతకాలంగా టార్గెట్ చేసి దాడులు చేస్తోంది. పైగా హిజ్బుల్లా ఉద్యమానికి ఇరాన్ మద్దతు కూడా ఉంది. సోమవారం.. ఇజ్రాయెల్ దాడుల్లో తమ సభ్యులు ముగ్గురు మరణించారని హిజ్బుల్లా ప్రకటించుకుంది. మంగళవారం.. హిజ్బుల్లా పోస్టుల మీద దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. అదే సమయంలో హమాస్ విభాగం తమపై రాకెట్ దాడి జరిగిందని ప్రకటించింది. బుధవారం.. లెబనాన్ గ్రామం ధైరా వద్ద మోహరించిన ఇజ్రాయెల్ బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు హిజ్బుల్లా ప్రకటించుకుంది. అయితే.. ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో హిజ్బుల్లాకు చెందిన ముగ్గురు గాయపడ్డారట. ఈ దాడుల పర్వంలో.. శుక్రవారం దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో రాయిటర్కు చెందిన జర్నలిస్ట్ దుర్మరణం పాలవ్వగా.. మరికొందరు జర్నలిస్టులు గాయపడ్డారు. అయితే ఈ పరిణామంపై ఇజ్రాయెల్ బలగాలు స్పందించాయి. ఇజ్రాయెల్ వైపు జరిగిన దాడులకు ప్రతిగానే.. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో ఇది చోటు చేసుకుందని తెలిపింది. మరోవైపు శుక్రవారం దక్షిణ బీరూట్లో వెయ్యి మంది హిజ్బూల్లా మద్దతుదారులు.. పాలస్తీనా జెండాలతో, బ్యానర్లతో ఊరేగింపు నిర్వహించారు. భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడంటూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. -
బ్యాంకుకు బొమ్మ తుపాకీతో వెళ్లి.. 10 లక్షలు తీసుకెళ్లిన మహిళ
ఓ మహిళ గుంపుతో కలిసి బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ చేసింది. మేనేజర్కు ఆ తుపాకీ ఎక్కుపెట్టి 13,000 డాలర్లు(రూ.10లక్షలు) విత్డ్రా చేసింది. ఆ డబ్బునంతా పాస్టిక్ బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి క్షణాల్లో వెళ్లిపోయింది. లెబనాన్ రాజధని బెయరూత్లో ఈ ఘటన బుధవారం జరిగింది. సదరు మహిళ చేసిన పనిని ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటనకు పాల్పడిన మహిళ పేరు సలీ హఫేజ్. ఆమె తీసుకెళ్లిన డబ్బంతా తన సొంత సేవింగ్స్ ఖాతాలోదే కావడం గమనార్హం. తన ఖాతా నుంచి ఎక్కువ డబ్బు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో పక్కా ప్లాన్తో ఆమె ఈ పని చేసింది. కొంతమంది ఆందోళనకారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆర్థిక ఆంక్షలు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్లో 2019 నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రజలు నెలకు 200 డాలర్లకు మించి విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు. దీంతో సేవింగ్స్ ఖాతాల్లో డబ్బు ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేక లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద కారణం.. అయితే సలీ హఫేజ్ బొమ్మ తుపాకీతో బెదిరించి మరీ డబ్బు తీసుకెళ్లడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆమె 23ఏళ్ల సోదరి చాలా కాలంగా క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్సకు ప్రతినెలా చాలా డబ్బు అవసరం అవుతోంది. సేవింగ్స్ ఖాతాలో 20వేల డాలర్లు ఉన్నా వాటిని విత్ డ్రా చేసుకోలేక హఫేజ్ అవస్థలు పడింది. తన చెల్లికి క్యాన్సర్ అని చెప్పినా బ్యాంకు అధికారులు అసలు పట్టించుకోలేదు. ఎక్కువ డబ్బు విత్డ్రా చేసుకోవడానికి అనుమతించలేదు. దీంతో కొంతమంది నిరసనకారులతో కలిసి హఫేజ్ బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి వెళ్లి నగదు విత్డ్రా చేసుకుంది. ఇంటర్వ్యూలో వివరణ తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో స్థానిక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీ హఫేజ్ వివరించింది. తన చెల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బు కావాలని, విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని బ్యాంకు అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యమైతే తన చెల్లి ప్రాణాలకే ప్రమాదమని చెప్పినా వినలేదని వాపోయింది. ఇక తాను కోల్పోవడానికి ఏమీ లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఇలా చేసినట్లు వివరించింది. ప్రత్యక్ష సాక్షి భయం.. అయితే ఈ ఘటనను చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి మాత్రం భయాందోళన వ్యక్తం చేసింది. మొదట ఓ గుంపు బ్యాంకు లోపలికి వచ్చి నేలపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరించిందని, ఓ మహిళ బ్యాంకు మేనేజర్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి నగదు ఇవ్వకపోతే కాల్చిపడేస్తానని బెదిరించిందని చెప్పింది. అయితే తాను ఎవరికీ హాని చేయాలనుకోలేదని హఫేజ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. తన హక్కుల కోసమే గత్యంతరం లేక ఇలా చేసినట్లు స్పష్టం చేసింది. హఫేజ్కు లెబనాన్ ప్రజలంతా మద్దతుగా నిలిచారు. ఆమెను హీరోగా అభివర్ణించారు. ఆమె చేసినదాంట్లో తప్పేంలేదన్నారు. మరోవైపు డబ్బు అవసరమైనవాళ్లు తనలాగే చేయాలని హఫేజ్ పిలుపునిచ్చింది. చదవండి: నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్ -
ఇంధన సంక్షోభం, 90 శాతం మేర పడిపోయిన కరెన్సీ.. తీవ్ర కష్టాలు
బీరూట్: మధ్యప్రాచ్య దేశం లెబనాన్లో ఇంధన సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ సరఫరాదారులు అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో సైన్యం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జౌక్ మెస్బేలోని వేర్హౌజ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 65 వేల లీటర్ల డీజిల్, 48 వేల లీటర్ల పెట్రోల్ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని స్థానిక ఆస్పత్రులు, బేకరీ నిర్వాహకులకు పంపిణీ చేశారు. కాగా పెట్రోల్, డీజిల్ దిగుమతిదారులకు ఇచ్చే సబ్సిడీని త్వరలో ఎత్తివేస్తామని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రియాద్ సలామే వారాంతంలో ప్రకటించిన నేపథ్యంలో దేశంలో ఇంధన సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అక్రమ నిల్వలు పెరిగాయి. ఫొటో కర్టెసీ: బీరూట్ టుడే దీంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో గంటల తరబడి వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో నిరసనలకు దిగుతున్నారు. ఇక అక్కర్లో రహస్యంగా దాచి ఉంచిన ఇంధన ట్యాంకర్ను కనుగొన్న ఆందోళనకారులు... 60 వేల లీటర్ల గ్యాసోలిన్, 40 వేల లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆర్మీ రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. మరోవైపు.. ఇంధనాన్ని పంపిణీ చేసేందుకు ఆర్మీ తీసుకువచ్చిన గ్యాసోలిన్ ట్యాంకర్ చుట్టూ పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడగా.. ఉద్రిక్త పరిస్థితి నెలకొని, ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో సుమారు 28 మంది మృత్యువాత పడ్డారు. ఓవైపు కరోనా.. మరోవైపు ఇంధన సంక్షోభం కరెంటు కోతలు పెరగడంతో ఆస్పత్రుల్లో పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బీరూట్ మెడికల్ సెంటర్లో ఇంధన కొరత, కరెంటు కోతల కారణంగా రెస్సిరేటర్లు, ఇతర పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో సుమారు 55 మంది రోగులు మరణించినట్లు సమాచారం. ఇందులో 15 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే గత రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లెబనాన్.. ప్రస్తుతం కోవిడ్, ఇంధన సంక్షోభంతో పూర్తిగా డీలా పడిపోయింది. ఫొటో కర్టెసీ: బీరూట్ టుడే ఇప్పటికే దేశంలోని సగం మంది జనాభా పేదరికంలో మగ్గిపోతున్నారు. లెబనాన్ కరెన్సీ విలువ 90 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశ అధ్యక్షుడు మిచెల్ ఔన్ ఆదివారం మాట్లాడుతూ... రానున్న రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని సంకేతాలు జారీ చేశారు. కాగా గతేడాది ఆగష్టులో బీరూట్లో అతిపెద్ద పేలుడు సంభవించి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగినందున ప్రధాని హసన్ దియాబ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నజీబ్ మికాటి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ.. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో నూతన పాలకులకు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. చదవండి: Afghanistan: మహిళా యాంకర్కు తాలిబన్ ప్రతినిధి ఇంటర్వ్యూ! Afghanisthan: ఏమీ వద్దు.. ప్రాణాలు మిగిలితే చాలు.. -
బీరూట్లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం
బీరూట్: లెబనాన్ రాజధాని పోర్టులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల పోర్టులో సంభవించిన భారీ పేలుళ్ల ఘటన మరవకముందే తాజాగా గురువారం మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆయిల్, టైర్లు నిల్వ ఉంచిన గోడాన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందగానే అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టి లెబనాన్ ఆర్మీ హెలికాప్టర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోర్టు సమీపంలోని కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందిగా లెబనాన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రమాద ఘటనలో కార్మికులంతా భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆగష్టు 4న బీరూట్లో భారీ పేలుడు సంభవించిన విషయం విధితమే. పోర్టు ప్రాంతంలో అక్రమంగా అమ్మోనియం నైట్రేట్లు నిల్వ ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిపుణలు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో 191 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. అంతేగాక వేలల్లో ఇళ్లు ధ్వంసంకావడంతో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. -
వెంటాడుతున్న విషాదం: ‘ఒక్కరూ ప్రాణాలతో లేరు’
బీరూట్: లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుళ్లు సంభవించి నెల రోజులు దాటిపోయింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర భవనాలన్నీ ధ్వంసమైన ఆ భీతావహ ఘటన ప్రజలను ఇంకా వెంటాడుతోంది. సుమారుగా 191 మంది ప్రాణాలను బలి తీసుకున్న తీవ్ర విషాదం నుంచి వారు నేటికీ కోలుకోలేపోతున్నారు. ప్రమాదం సమయంలో మిస్సయిన ఏడుగురి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ‘లెబనాన్’గుండెను నిలువునా చీల్చిన ఆ చేదు ఘటన నిజం కాకపోయి ఉంటే బాగుండునని, శిథిలాల కింద పడి ఉన్న వాళ్లు కొన ఊపిరితోనైనా బతికి ఉంటారనే ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. అయితే చిలీ రక్షణ బృందాలు చెప్పిన విషయాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. సెన్సార్ రీడింగ్లో వెల్లడైనట్లుగా.. పేలుళ్లలో ధ్వంసమైన భవన శిథిలాల కింద ఓ ఒక్కరు ప్రాణాలతో మిగిలిలేరనే చేదు నిజాన్ని చెప్పాయి. (చదవండి: ‘అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది’) కాగా గత నెల 4న బీరూట్ పోర్టులో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ వలన భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 6 వేల భవనాలు నేలమట్టమయ్యాయి. గత ఏడాది కాలంగా లెబనాన్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి కారణంగా... పేదరికం తారస్థాయికి చేరింది. నిత్యావసరాల కోసం ప్రజలు చెత్తకుప్పలను ఆశ్రయించే దుస్థితి వచ్చింది. అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి. ఇలాంటి తరుణంలో రాజధానిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం లెబనియన్ల జీవితాలను మరింత గందరగోళంలోకి నెట్టాయి. కనీసం శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసే టెక్నాలజీ కూడా అందుబాటులో లేకపోవడంతో.. స్థానిక ప్రభుత్వం చిలీ, అమెరికా, ఫ్రాన్స్ నుంచి రక్షణ బృందాలను రప్పించగా నేటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హార్ట్బీట్ వినిపించింది.. ఈ క్రమంలో శిథిలమైన ఓ భవనం వద్ద మానవ హృదయ స్పందనను(హార్ట్బీట్) పోలిన శబ్దాలను హైటెక్ సెన్సార్లు గుర్తించడంతో రక్షణ బృందాలు అక్కడ గాలింపు ముమ్మరం చేయగా వారికి నిరాశే మిగిలింది. అక్కడ మనిషి ఆనవాలు కనిపించలేదని చిలీ రెస్క్యూ స్పెషలిస్టు ఫ్రాన్సిస్కో లెర్మాండా శనివారం మీడియాకు వెల్లడించారు. ‘‘ఆ భవనం కింద మనిషి బతికి ఉన్నాడనడానికి ఎలాంటి ఆనవాలు లభించలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. అక్కడ ఎవరూ సజీవంగా లేరు’’అని విచారం వ్యక్తం చేశారు. ఇక పోర్టు సమీపంలో ఓ జాగిలం సెంట్ వాసన పసిగట్టి పరుగులు తీయడంతో.. ఇద్దరు మహిళా వర్కర్లు అక్కడ గల టన్నెల్ చివరి వరకు వెళ్లి మృతుల జాడ కోసం వెదకగా.. ఎవరూ కనిపించలేదు. అయినప్పటికీ.. ‘‘పాక్షికంగా ధ్వంసమైన భవనాలు కూలిపోతాయనే భయం వెంటాడినా సరే అణువణువూ గాలిస్తాం. బాధితులను వెలికితీసేందుకు మా వంతు ప్రయత్నం కొనసాగిస్తాం’’అని సివిల్ డిఫెన్స్ అధికారి ఖాసీం ఖటార్ వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు అన్నిచోట్లా శిథిలాలను తొలగించే ప్రక్రియ పూర్తై పోవచ్చిందని తెలిపారు. అద్భుతం జరిగితే తప్ప.. అయితే లెబనీస్ అధికారులు మాత్రం.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ ఘోర ప్రమాదం నుంచి తేరుకుని బతికే ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్థానిక ఫిల్మ్ మేకర్ సలీం మురాద్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతం జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ ప్లీజ్ దేవుడా.. బీరూట్ మిరాకిల్కు వేదిక కాగల ఆశీర్వాదాలు అందించూ’’అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక మృతులను వెలికితీసేందుకు ప్రాణాలు పణంగా పెట్టి శ్రమిస్తున్న చిలీ రక్షణ బృందాలపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిని నిజమైన హీరోలుగా వర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెబుతున్నారు. బీరూట్ పేలుళ్ల ఘటనకు నెల రోజులు పూర్తైన సందర్భంగా మృతులకు నివాళిగా శుక్రవారం దేశ ప్రజలంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. కాగా ఈ ఘోర విషాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని హసన్ దియాబ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement