-
‘పవన్ పార్ట్ టైమ్ లీడర్గా మారారు’
సాక్షి, విజయవాడ : అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 80 శాతం అమలు చేశారని బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ 2014ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విషలమైందని విమర్శించారు. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి యువతకు సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఆనాడు వైయస్సార్ది అయితే ఈనాడు రాష్ట్ర రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా రైతు భరోసా తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ది అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాషష్టట్రానికి అవసరమన్నారు. చంద్రబాబు ఒక్క హైదరాబాద్ను మాత్రమే అబివృద్ది చేయడంతోనే తెలంగాణ వాదం పుట్టిందని, రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. (ఇక మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ) చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంతా తాత్కాలికం అంటూ కాలయాపన చేశారని విమర్శించారు. కార్పోరేట్ కంపెనీలకు, తమ అనుకూల వర్గం కోసం ఇన్సైడ్ ట్రెడింగ్కు పాల్పడ్డారని మండిపడ్డారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని, రైతులకు అన్యాయం జరగనివ్వరని భరోసా ఇచ్చారు. చంద్రబాబు రాజకీయ నిరుద్యోగిగా మారీ అలజడి సృష్టిస్తున్నారని, చంద్రబాబు ఐదేళ్లలో అమరావతి అబివృద్ది చేయకపోగా రాషష్టట్రీఆన్ని అప్పుల ఉబిలో నెట్టారని దుయ్యబట్టారు. గడిచిన ఐదేళ్ల పాలనలో కార్పోరేట్లకు కొమ్ము కాసిన తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడ అనలేదన్నారు. తెలుగుదేశం బినామీ, షాడో పార్టీగా జనసేన వ్యవహరిస్తోందన్నారు. తెలుగుదేశం ముసుగులో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశారని ఆరోపించారు. సొంత వ్యక్తిత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, పార్ట్ టైమ్ లీడర్గా ఆయన వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
‘మంత్రి వర్గ కూర్పు.. చరిత్రాత్మక నిర్ణయం’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని బీసీ జాతీయ ఫెడరేషన్ అధ్యక్షులు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య కొనియాడారు. తరతరాల రాజకీయ వివక్షకు తెరదించేస్తూ బడుగు, బలహీనవర్గాలకు తన మంత్రివర్గంలో అగ్ర ప్రాధాన్యం కల్పించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. బలహీనవర్గాల పట్ల జగన్ చిత్తశుద్ధి ఆయన్ను ఓ జాతీయ నాయకుడిగా చేసిందని ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ మంత్రివర్గంలో బీసీ వర్గానికి అగ్రస్థానం దక్కిన విషయం తెలిసిందే. ‘బీసీ–ఇ’వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీతోపాటు బీసీలకు 8 మంత్రి పదవులు కేటాయించారు. తరువాత ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాపు, రెడ్డి సామాజి కవర్గాలకు చెరో నాలుగు మంత్రి పదవులు ఖరారు చేశారు. ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు ఇచ్చారు. ఇక బీసీల్లోనూ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. ధర్మాన కృష్ణదాస్( పోలినాటి వెలమ), బొత్స సత్యన్నారాయణ(తూర్పు కాపు), పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార), అనిల్ కుమార్యాదవ్ (యాదవ), గుమ్మనూరు జయరాం (బోయ), మాలగుండ్ల శంకరనారాయణ(కురబ) సామాజిక వర్గాలతోపాటు బీసీ–ఇ కేటగిరికీ చెందిన షేక్ అంజాద్ బాషా(ముస్లిం మైనార్టీ)కి తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. -
వైఎస్ జగన్కు బీసీ ఫెడరేషన్ వినతిపత్రం
-
బీసీ ఫెడరేషన్లలో అయోమయం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన కులాల (బీసీ) ఫెడరేషన్లలో అయోమయం నెలకొంది. 2018–19 వార్షిక సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ.. వాటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టత కొరవడింది. మూడేళ్ల తర్వాత ఫెడరేషన్లకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నేపథ్యంలో అధికారులు నూతనోత్సాహంతో పథకాల అమలుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ.. భారీ స్థాయిలో వార్షిక ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దరఖాస్తుల స్వీకరణ సైతం ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. 11 ఫెడరేషన్లకు 2.21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు స్వీకరణ పూర్తయి మూడున్నర నెలలు కావస్తున్నా అర్హుల ఎంపిక మాత్రం జరగలేదు. వాస్తవానికి ఫెడరేషన్లకు సంబంధించిన వార్షిక ప్రణాళిక ఖరారైతేనే జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్ణయించే వీలుంటుంది. ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ 2018–19 వార్షిక సంవత్సరం ప్రారంభమై రెండో త్రైమాసికం ముగుస్తున్నా ఫెడరేషన్ల వార్షిక ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలుపలేదు. దీంతో లబ్ధి దారుల ఎంపిక ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పరిశీలనతో సరి.. బీసీ ఫెడరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రాథమిక కసరత్తులో భాగంగా అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తులను పూరించిన మేరకు స్వయం ఉపాధి యూనిట్ బడ్జెట్ స్థాయిని బట్టి కేటగిరీల వారీగా విభజించారు. అయితే వివిధ ఫెడరేషన్లను నిర్ణయించిన బడ్జెట్లో ఏయే యూనిట్లకు అనుమతి ఇవ్వొచ్చనే అంశంపై స్పష్టత వస్తేనే కేటగిరీల వారీగా లబ్ధిదారులను గుర్తించవచ్చు. కానీ వార్షిక ప్రణాళికలకు ప్రభుత్వ ఆమోదం రాకపోవడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలనకే పరిమితమయ్యారు. -
రుణాలు కొందరికే..!
ఆదిలాబాద్ రూరల్: ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి కింద ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం బీసీ ఫెడరేషన్లకు నిధులు మంజూరు చేసింది. వేలల్లో దరఖాస్తులు రాగా.. నిధులు అంతంత మాత్రంగానే విడుదల చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో గత డిసెంబర్ మాసం వరకు 139 వివిధ సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెడరేషన్ల కోసం వివిధ రకాల రుణాలు అందించేందుకు రూ.250 కోట్లు మంజూరు చేసింది. ఫెడరేషన్లు ఇవే.. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఫెడరేషన్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రభుత్వం వ్యక్తిగత రుణాలతోపాటు సొసైటీకి రుణాలు మంజూరు చేయనుంది. ప్రస్తుతం జిల్లాలో 139 సొసైటీలు రిజిస్టర్ చేసుకున్నాయి. ఇందులో వాషర్మెన్, కోఆపరేటీవ్ సొసైటీ, నాయీబ్రాహ్మణ సొసైటీ, వడ్డర సొసైటీ, సాగర(ఉప్పర), వాల్మీకి, బోయ, క్రిష్ణబలిజపోసాల, బట్రాజ్, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి శాలివాహన, నూర్బాషా, మేదర, టాడిటాపర్స్ కోఆపరేటీవ్ సొసైటీలు ఉన్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఆయా ఫెడరేషన్లకు సబ్సిడీపై రుణాలను అందజేయనుంది. వ్యక్తిగత రుణాలు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు బ్యాంక్తో సంబంధం లేకుండా అందజేయనుంది. సొసైటీలకు బ్యాంక్ లింకేజీతో రుణాలను అందజేయనుంది. ఆయా రుణాలు కోసం 21 నుంచి 55 సంవత్సరాల వయస్సు నిండి ఉన్నవారికి వీటిని అందజేయడం జరుగుతుంది. వేలల్లో దరఖాస్తులు.. రాష్ట్ర ప్రభుత్వం ఫెడరేషన్లతోపాటు వ్యక్తిగత రుణాలను కలుపుకొని రూ.250 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్కు నిధులు విడుదల చేయకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వేలాది సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. నిధులు అంతంత మాత్రంగానే ఉండడంతో కొంతమందికే రుణం అందే అవకాశం ఉంది. ప్రభుత్వం నిధులు పెంచి ఇతరులకు సైతం అవకాశం కలిగేలా చూడాలని కోరుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement