-
మిషెల్ బెయిల్కు కోర్టు నో
న్యూఢిల్లీ: ఈస్టర్ పండగ జరుపుకునేందుకు వారం పాటు బెయిల్ ఇవ్వాలం టూ అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ కుంభ కోణంలో నిందితుడు క్రిస్టియన్ మిషెల్ పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో అతడు తప్పించుకు పోయేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభియోగాల తీవ్రత దృష్ట్యా మిషెల్కు బెయిల్ మంజూరు చేయలేమని ప్రత్యేక జడ్జి అర్వింద్కుమార్ పేర్కొన్నారు. అగస్టా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసినందున సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం లేదని, అధికారుల విచారణకు మిషెల్ సహకరిస్తున్నాడని అతని లాయర్ తెలిపారు. ‘ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు క్రైస్తవులకు పవిత్ర వారం, 21న ఈస్టర్ పండగ. కుటుంబసభ్యులతో కలిసి పండగ జరుపుకోవడంతోపాటు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా మిషెల్కు వారం పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి’ అని కోరారు. దీనిపై ఈడీ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉండి కూడా మిషెల్ పండగ జరుపుకోవచ్చని అన్నారు. -
చార్జిషీటు లీకేజీపై విచారణ
న్యూఢిల్లీ: రూ.3,600 కోట్ల అగస్టావెస్ట్ల్యాండ్ కుంభకోణం చార్జిషీటు వివరాలు బయటకు వెల్లడి కావడంపై దర్యాప్తు చేయించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఈ కేసులో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా, చార్జిషీటులోని వివరాలను ఎలా సంపాదించారో తెలపాలంటూ సదరు వార్తా సంస్థను ఆదేశించాలని ఈడీ.. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న ఈడీపై విచారణ జరపాలంటూ క్రిస్టియన్ మిషెల్ పిటిషన్లు వేశారు. ‘కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతులను ఈ కేసులోని నిందితులకు మేం ఇంకా ఇవ్వనేలేదు. అయినా అందులో ఏముందో మిషెల్ లాయర్లకు తెలిసింది. ఆ ప్రకారమే వారు పిటిషన్ వేశారు. దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. చార్జిషీటు వివరాలు వెల్లడిపై దర్యాప్తు జరగాలి’ అని ఈడీ వాదించింది. తమ క్లయింట్కు చార్జిషీటు కాపీని ఇవ్వకమునుపే ఈడీ మీడియాకు లీక్ చేసిందని మిషెల్ లాయర్ ఆరోపించారు. కోర్టు ప్రత్యేక జడ్జి ఈ వ్యవహారంపై 11న విచారిస్తామన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతిని సీల్డు కవర్లో భద్రపరచాలని ఈడీని ఆదేశించారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం అప్పటి కేంద్రప్రభుత్వం, అగస్టావెస్ట్ల్యాండ్ల మధ్య 2010నాటి ఒప్పందం వల్ల ఖజానాకు రూ.2,666 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ గతంలో తెలిపింది. -
రూ.544 కోట్ల ముడుపులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముంగిట అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు తెచ్చేట్లుగా ఉంది. అప్పటి యూపీయే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు, రక్షణ శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులకు సుమారు రూ.544 కోట్ల(70 మిలియన్ యూరోల) ముడుపులు ముట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపించింది. ఒప్పంద విలువ రూ.3,600 కోట్లలో ఈ మొత్తం సుమారు 12 శాతమని తెలిపింది. ఈ వివరాలతో శుక్రవారం ఢిల్లీ కోర్టులో నాలుగో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. మధ్యవర్తి, బ్రిటిష్ జాతీయుడైన క్రిస్టియన్ మిషెల్పై ఈ చార్జిషీటును వేసింది. ఇందులో ‘మిసెస్ గాంధీ’ అని పరోక్షంగా యూపీయే చైర్పర్సన్ సోనియా గాంధీని ప్రస్తావించినా ఆమెను నిందితురాలిగా చేర్చలేదని విశ్వసనీయ సమాచారం. ఈడీ ఆరోపణల్ని కోర్టు శనివారం పరిశీలించి, నిందితులు తమ ముందు హాజరుకావాలో? వద్దో? నిర్ణయించనుంది. మరోవైపు, అగస్టా వెస్ట్ల్యాండ్ కేసు విచారణ సందర్భంగా తాను ఎవరి పేరునూ ప్రస్తావించలేదని మిషెల్ కోర్టుకు చెప్పారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని, ఆ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈడీ చార్జిషీటు పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. చార్జిషీట్ ఎన్నికల స్టంట్: కాంగ్రెస్ ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీటు ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఓటమి భయం పట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన చేతిలో కీలుబొమ్మ అయిన ఈడీ ద్వారా కొత్త అబద్ధాలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఇలాంటి పరోక్ష ఆరోపణలు, అబద్ధాల్ని గతంలో కూడా ప్రచారం చేశారని, కానీ అవి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలవలేకపోయాయని అన్నారు. మోదీ, ఈడీలు ఎన్డీయే ప్రభుత్వ తలరాతను మార్చలేరని, ప్రజలు వారిని ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే చార్జిషీటులో ఎంపికచేసిన అంశాల్ని బయటకు పొక్కేలా చేశారని ఆరోపించారు. ఎన్నికల సీజన్లో నిరాధార హాస్యాస్పద ఆరోపణలు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యమే గెలుస్తుందని తనపై వచ్చిన ఆరోపణల్ని ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఒక దొంగకు అందరూ దొంగలుగానే కనిపిస్తారని పరోక్షంగా మోదీని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేశారు.. అగస్టా వెస్ట్ల్యాండ్ కొనుగోలు ఒప్పందాన్ని విజయవంతంగా కుదిర్చినందుకు మధ్యవర్తులు మిషెల్, గైడో హష్కే ద్వారా రూ.544 కోట్లు చేతులు మారినట్లు ఈడీ తన చార్జ్షీట్లో ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేసినందుకు వేర్వేరు దశల్లో నిందితులకు ఈ మొత్తం ముట్టినట్లు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఏపీ(అహ్మద్ పటేల్), ఫ్యామ్(కుటుంబం) పేర్లను చార్జిషీటులో ప్రస్తావించింది. 2008 ఫిబ్రవరి, 2009 అక్టోబర్ మిషెల్ పలుమార్లు లేఖలు రాశారని చార్జిషీటులో ఈడీ ప్రస్తావించించింది. మిసెస్ గాంధీ, ఆమెకు అత్యంత సన్నిహితులైన సలహాదారులను ఒప్పించే బాధ్యతను భారత హైకమిషన్కు అప్పగించినట్లు ఈడీ తెలిపింది. మిసెస్ గాంధీ సన్నిహితులుగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఎంకే నారాయణన్, వినయ్ సింగ్లను పేర్కొన్నా వారిని నిందితులుగా చేర్చలేదు. అయితే, మిసెస్ గాంధీ ఎవరు? ఏ సందర్భంలో ఆమె పేరును లేవనెత్తారో పూర్తి వివరాలు తెలియరాలేదు. నింది తుల జాబితాలో ముగ్గురు భారత పాత్రికేయులు ఉన్నా వారి పేర్లు బహిర్గతం కాలేదు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా మీడియా ప్రముఖులతో పరిచయం పెంచుకున్నట్లు మిషెల్ అంగీకరించినట్లు ఈడీ పేర్కొంది. -
‘భారత్ వస్తే జీవితం నరకం అవుతుందన్నారు’
న్యూఢిల్లీ : సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తనను బెదిరింపులకు గురిచేశారంటూ క్రిస్టియన్ మైకేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి మైకేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్ ఆస్థానా గత మేలో దుబాయ్లో తనతో మాట్లాడారంటూ మైకేల్ మంగళవారం కోర్టుకు తెలిపాడు. భారత్కు తిరిగి వస్తే తన జీవితం నరకం అవుతుందని రాకేష్ తనను హెచ్చరించాడని అతడు పేర్కొన్నాడు. ఇక వైట్ కాలర్ నేరగాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తనను హంతకులు, ఉగ్రవాదుల బ్లాకులో ఉంచడం సరైంది కాదని మైకేల్ కోర్టుకు విన్నవించినట్లు సమాచారం. ఈ క్రమంలో మైకేల్ ఉన్న బ్లాక్లో అటువంటి వ్యక్తులెవరూ లేరని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా భారత్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్ను సీబీఐ అధికారులు యూఏఈ నుంచి భారత్కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. రాకేష్ ఆస్థానాను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేయగా.. తనను ఫైర్ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్తాపం చెందిన ఆలోక్ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇంతకీ మైకేల్ ఎవరు? బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్గా పని చేస్తున్నాడు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్గా చేశాడు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్లో పర్యటించే మైకేల్కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగాడు. ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చాడు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగాడు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997-2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు. -
అప్రూవర్గా మారనున్న సక్సేనా!
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనా అప్రూవర్గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఈడీ, సక్సేనాల తరఫు న్యాయవాదులు ఓ అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించాయి. సక్సేనా దాఖలుచేసిన బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ అనంతరం ఇరువర్గాలు సక్సేనా అప్రూవర్గా మారే విషయమై ఉమ్మడి పిటిషన్ దాఖలు చేస్తాయన్నాయి. సక్సేనా న్యాయవాది గీతా లూథ్రా స్పందిస్తూ.. ఈడీ అధికారుల విచారణకు సక్సేనా అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉందనీ, 4 స్టెంట్లు వేశారని వెల్లడించారు. అంతేకాకుండా సక్సేనాకు లుకేమియా(రక్త కేన్సర్) ప్రాథమిక దశలో ఉందన్నారు. భారత్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో అగస్టా హెలికాపర్ల కొనుగోలుకు ఒప్పందం కుదరింది. అయితే ఈ సందర్భంగా భారీగా ముడుపులు చేతులు మారినట్లు వార ్తలు రావడంతో కేంద్రం ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. సక్సేనా బెయిల్ పిటిషన్ను గురువా రం విచారిస్తామని ఢిల్లీలోని ఓ కోర్టు తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement