breaking news
assets and debts sharing
-
ఢిల్లీ హైకోర్టుకు ‘యస్ బ్యాంక్ ఒత్తిడి రుణ’ బదలాయింపు వివాదం
న్యూఢిల్లీ: జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి యస్ బ్యాంక్కు చెందిన రూ. 48,000 కోట్ల స్ట్రెస్ అసెట్ (మొండి బకాయిలుగా మారే అవకాశం ఉన్న) పోర్ట్ఫోలియోను బదిలీ చేయడంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బదలాయింపుపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్రం, ఆర్బీఐ, సెబీల ప్రతి స్పందనను కోరింది. సమాధానానికి నాలుగు వారాల గడువును ఇస్తూ, తదుపరి కేసును జూలై 14న లిస్ట్ చేయాలని ఆదేశించింది. రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యం స్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరహా ఒప్పందాల్లో ఎటువంటి వివాదాలకూ తావివ్వకుండా సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని, ఇందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ, సెబీలను ఆదేశించాలని ఆయన ఈ పిటిషన్లో కోరారు. ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ షేర్లకు సంబంధించిన మూడేళ్ల లాకిన్ వ్యవధి ఈ నెల 13వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. నిర్వహణపరమైన అవకతవకలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకును 2020 మార్చిలో రిజర్వ్ బ్యాŠంక్ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత రూపొందించిన ప్రణాళిక ప్రకారం తొమ్మిది బ్యాంకులు రూ. 10,000 కోట్ల చొప్పున సమకూర్చడం ద్వారా వాటాలు తీసుకుని యస్ బ్యాంక్ను నిలబెట్టాయి. అలా తీసుకున్న వాటాల్లో 75 శాతం షేర్లను మూడేళ్ల వరకూ విక్రయించకుండా లాకిన్ విధించారు. యస్ బ్యాంక్ షేర్ ఎన్ఎస్ఈలో శుక్రవారం 1 శాతం పెరిగి రూ.15.05కు చేరింది. -
18న కేంద్ర హోంశాఖ నేతృత్వంలో భేటీ
పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై చర్చ సాక్షి, హైదరాబాద్: పదవ షెడ్యూల్లో గల సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఈ నెల 18వ తేదీన కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రావాల్సిందిగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ బుధవారం లేఖ రాసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సంప్రదింపుల ద్వారా దీనిపై ఒక ఒప్పందానికి రాని పక్షంలో కేంద్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇరు రాష్ట్రాలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీ సర్కారు తమ సీఎస్ రాజీవ్శర్మ, ఏజీ రామకృష్ణారెడ్డితో కమిటీని ఏర్పాటు చేయగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు గత నెల 18వ తేదీన సమావేశమైనప్పటికీ ఒక ఒప్పందానికి రాలేదు. ఇదే విషయాన్ని ఏపీ ఇటీవల కేంద్ర హోంశాఖకు లేఖ ద్వారా తెలియజేసింది. దీంతో కేంద్ర హోంశాఖ ఈ నెల 18న భేటీ ఏర్పాటుచేసింది. పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఆ వివరాలను కేంద్ర హోంశాఖకు అందజేయాలని నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాల్సిందిగా కోరనుంది. 9వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు రూ.50 వేల కోట్లు ఇలా ఉండగా 9వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా నమూనా పత్రాన్ని రూపొందించి సంస్థల వారీగా ఆస్తులు, అప్పుల వివరాలను సేకరించనుంది. ఆయా సంస్థల్లో ఉద్యోగుల వివరాలను ప్రాంతాల వారీగా సేకరించాలని కూడా నిర్ణయించింది. రూ.50 వేల కోట్ల వరకు ఆస్తులుంటాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సేకరించిన వివరాలను షీలా బిడే కమిటీకి సమర్పించనుంది.