-
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎంత వరకు సురక్షితం?
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎంత వరకు సురక్షితం? ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో ఇవి ఉండాలా? ఈక్విటీలో నగదు, ఫ్యూచర్స్ మార్కెట్లో ధరల పరంగా ఉండే వ్యత్యాసాలను అవకాశాలుగా తీసుకుని ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇవి. ఈ రూపంలోనే ఇవి రాబడులను ఆర్జిస్తుంటాయి. ఉదాహరణకు ‘ఎస్’ అనే స్టాక్ ఈక్విటీ మార్కెట్లో రూ.100 వద్ద ట్రేడవుతుందనుకుందాం. ఇదే స్టాక్ ఫ్యూచర్ మార్కెట్లో రూ.101 వద్ద ట్రేడవుతుందనుకుంటే.. ఈ సందర్భంలో ఆర్బిట్రేజ్ ఫండ్ ‘ఎస్’ స్టాక్ను ఈక్విటీలో రూ.100కు కొనుగోలు చేసి.. ఫ్యూచర్ మార్కెట్లో రూ.101కు విక్రయిస్తుంది. దీంతో ఒక రూపాయి లాభాన్ని సొంతం చేసుకుంటుంది. సెటిల్మెంట్ తేదీనాడు (అంటే నెల చివర్లో కాంట్రాక్టుల ముగింపు) ధర నగదు, ఫ్యూచర్ మార్కెట్లో ఒక్కటిగా మారుతుంది. దాంతో ఆర్బిట్రేజ్ ఫండ్ అదే స్టాక్కు సంబంధించి మళ్లీ లావాదేవీలను పునరావృతం చేస్తుంది. ఈ సారి నగదు మార్కెట్లో విక్రయించి ఫ్యూచర్ మార్కెట్లో కొనుగోలు చేస్తుంది. దీంతో ఆయా లావాదేవీలు సమం అవుతాయి. ఒక్క విడత ఇలా చేసినట్టయితే ముందు గడించిన రూపాయి లాభం ఖాయమైనట్టే. అంతేకానీ, సెటిల్మెంట్ తేదీనాటికి ఆయా స్టాక్ ధర పెరిగిందా, తరిగిందా అన్నదానితో సంబంధం ఉండదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇదే మాదిరి లావాదేవీలు నిర్వహిస్తూ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెడుతుంటాయి. ఆర్బిట్రేజ్ అవకాశాల్లేని సమయాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులను ట్రెజరీ బిల్లులు, స్వల్పకాల డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రిస్క్ను పరిశీలించినట్టయితే.. చాలా తక్కువ రిస్క్లోనే ఇవి ఉంటాయి. కాకపోతే స్వల్ప కాలంలో మాత్రం అస్థిరతలతో ఉంటుంటాయి. కనీసం మూడు నెలలు అంతకంటే ఎక్కువ కాలం కోసం అయితే నష్టాలకు అవకాశాలు చాలా తక్కువ. అదే సమయంలో ఆర్బిట్రేజ్ ఫండ్స్ నుంచి ఎక్కువ రాబడులను ఆశించరాదు. లిక్విడ్ ఫండ్స్ స్థాయిలో రాబడులను అంచనా వేసుకోవచ్చు. అంటే రాబడులు బ్యాంకు ఖాతాల కంటే మెరుగ్గా ఉంటాయని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో మంచి రాబడులు, సంపద కోసం ఆర్బిట్రేజ్ ఫండ్స్ అనుకూలం కావు. కొన్ని నెలల నుంచి ఏడాది వరకు తమ నిధులను ఒక్కచోట ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారికి అనుకూలం. ముఖ్యంగా అధిక పన్ను రేటులో (30 శాతం) ఉన్న వారికి ఆర్బిట్రేజ్ ఫండ్స్ లాభదాయకం. ఎందుకంటే ఇందులో రాబడులను ఈక్విటీ రాబడులుగానే ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. అధిక పన్ను రేటులో లేని వారు, చాలా స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే లిక్విడ్ ఫండ్స్ సరిపోతాయి. ఇప్పటికైతే డివిడెండ్ ఇచ్చే మంచి మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉందా?.. అలాగే కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? – రత్నాకర్ డివిడెండ్ కోసం మ్యూచువల్ ఫండ్ను ఎంపిక చేసుకోవడం అన్నది సరైన మార్గం కాదు. ఎందుకంటే దీనివల్ల పెద్దగా రాబడి ఉండదు. ఒక షేరును కొనుగోలు చేస్తే అది మీకు డివిడెండ్ ఇస్తుంది. అది స్టాక్ ధరలో సర్దుబాటు కాదు. అదే మ్యూచువల్ ఫండ్లో అయితే డివిడెండ్ చెల్లింపు ప్రభావం ఫండ్ యూనిట్ ఎన్ఏవీ (నికర యూనిట్ విలువ)లో ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక పథకంలో రూ.10 ఎన్ఏవీపై రూ.10,000ను ఇన్వెస్ట్ చేశారనుకుందాం. తర్వాత కాలంలో అది వృద్ధి చెంది ఎన్ఏవీ కాస్తా రూ.15కు చేరితే.. మీ పెట్టుబడి విలువ రూ.15,000 అవుతుంది. ఫండ్ సంస్థ రూ.2,000ను డివిడెండ్ కింద చెల్లించాలని నిర్ణయించినట్టయితే ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. డివిడెండ్ చెల్లింపు ముగిసిన తర్వాత ఆ పథకంలో మీ పెట్టుబడి విలువ వెంటనే రూ.13,000కు తగ్గిపోతుంది. అంటే మీ పెట్టుబడుల నుంచి మీకు చెల్లింపులు చేయడం. ఫండ్స్లో డివిడెండ్ చెల్లింపుల విధానం ఇదే మాదిరిగా ఉంటుంది. కానీ, చాలా మంది ఫండ్స్ నుంచి వస్తున్న డివిడెండ్ పనితీరు కు నిదర్శనంగా పొరపడుతుంటారు. కానీ, స్టాక్లో అలా కాదు. లాభాల నుంచి డివిడెండ్ చెల్లింపులు చేయడం ఉంటుంది. ఫండ్ను డివిడెండ్ కోణం నుంచి ఎంపిక చేసుకోవడం సరికాదు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పైసా పైసా.. అదే వీటి స్పెషల్!
- డిపాజిట్లు, డెట్ ఫండ్స్ కంటే మెరుగైన రాబడి - ఎగుడు దిగుడు మార్కెట్లో ఇంకాస్త అధికం - పన్ను ప్రయోజనాలు కూడా అధికమే - స్వల్పకాలిక ఇన్వెస్టర్లకి ఆర్బిట్రేజ్ ఫండ్లే ప్రత్యామ్నాయం ఒకరకంగా చెప్పాలంటే ఈ ఫండ్లు నష్టాలనందించటమనేది ఎక్కడో తప్ప జరగదు. మార్కెట్లు పడుతున్నా, పెరుగుతున్నా వీటి పనితీరు భిన్నంగా ఉంటుంది కనక ఇవి లాభాలార్జించడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కాకపోతే మరీ ఈక్విటీ ఫండ్లలా మార్కెట్లు బాగున్నపుడు ఏడాదిలో 30 శాతం లాభాలివ్వటం... బాగులేనపుడు 30 శాతం నష్టాలివ్వటమనేది వీటిలో జరగదు. వీటిలో లాభాలొచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇవి పరిమితంగానే ఉంటాయి. బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ ఉంటాయనేది మాత్రం చెప్పొచ్చు. అందుకే... ఈ ఒడిదుడుకుల మార్కెట్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్ను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. గతేడాది కేవలం రూ.13,885 కోట్లుగా ఉన్న ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విలువ ఇప్పుడు రూ.27,000 కోట్లు దాటింది. అంటే దాదాపు రెట్టింపయింది. దీన్నిబట్టే వీటికున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. ఈ ఫండ్స్పై అవగాహన కల్పించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం.. ఆర్బిట్రేజ్ ఫండ్స్ కొత్తవేమీ కావు. ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నవే. కొన్ని ఫైనాన్షియల్ సంస్థలైతే అచ్చంగా ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మాత్రమే చేస్తాయి కూడా. కాకపోతే వీటిపై రిటైల్ ఇన్వెస్టర్లకు అవగాహన మాత్రం తక్కువే ఉంది. గతేడాది డెట్ ఫండ్స్ పన్ను ప్రయోజనాలను తగ్గించడం... వడ్డీరేట్లు కూడా తగ్గటంతో ఇన్వెస్టర్లు ఆర్బిట్రేజ్ వంటి ఇతర ప్రత్యామ్నాయ పథకాల కేసి చూస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్తో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండే ఈ ఫండ్లు... చాలా సందర్భాల్లో బ్యాంకు డిపాజిట్ల కంటే రెండుమూడు శాతం అధిక రాబడినే అందిస్తున్నాయి. ఇక బ్యాంకు డిపాజిట్లు, డెట్ ఫండ్స్తో పోలిస్తే పన్ను భారం వీటిలో తక్కువ. ఈ ఆకర్షణలే వీటివైపు రిటైలర్లు మొగ్గేలా చేస్తున్నాయిపుడు. ఎవరికి అనుకూలం.. స్వల్పకాలంలో బ్యాంకు డిపాజిట్ల కంటే అధికాదాయం కావాలనుకునే వారికి ఇవి అనుకూలమైనవని చెప్పొచ్చు. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల కాలపరిమితిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే పన్ను ప్రయోజనాల కోసమైతే 12 నెలల వరకు వేచి చూడొచ్చు. అంతేకాని వీటిని దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా పరిగణించకూడదు. -
ఏంటా లాభాలు..
డిపాజిట్లు, డెట్ ఫండ్స్తో పోలిస్తే ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలున్నాయని చెప్పొచ్చు. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 65 శాతం కంటే అధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వీటిని ఈక్విటీ ఫండ్స్గానే పరిగణిస్తారు. దీంతో ఏడాది దాటిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను భారం ఉండదు. అదే ఏడాదిలోగా వైదొలిగితే 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభ పన్ను, ఆ పన్నుపై 3 శాతం సర్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే బ్యాంకు డిపాజిట్లలో వచ్చే వడ్డీ ఆదాయంపై మీ శ్లాబును బట్టి పన్ను భారం ఏర్పడుతుంది. అలాగే ఏడాదికి వడ్డీ రూ.10,000 దాటితే టీడీఎస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తింపు పరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచారు. దీంతో డెట్ ఫండ్స్ పన్ను ప్రయోజన ఆకర్షణను కోల్పోయాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వేరు కుంపట్లతో దాసరిగారి పేరు చెడగొట్టొద్దు: దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ షురూ..
కల్వర్టుల తనిఖీ
కారుకొండ సడాలమ్మ వనప్రవేశం
కూటమి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు
పింఛను కోసం వెళ్లి అనంతలోకాలకు..
‘వరి’వడిగా పటు్టబడులు
వైఎస్సార్ సీపీలో చేరికలు
అవ్వాతాతలకు తప్పని పాట్లు
అంతకు మించి...
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement