breaking news
Anupriya
-
అమ్మా లే అమ్మా.. ఎందుకిలా చేశావ్ అనుప్రియా..
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో జరిగింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్రాజ్ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్క్రీమ్ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది.అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
అనుప్రియ మహోదయ
మోదీ కేబినెట్లోకి కొత్తమ్మాయ్ వచ్చింది. కొత్తమ్మాయే కాదు, కేబినెట్లో చిన్నమ్మాయ్ కూడా! ఆ కొత్తమ్మాయ్, చిన్నమ్మాయ్ అయిన అనుప్రియ ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది నేషన్’. ఎందుకంటే మోదీ ఈ అమ్మాయిని మంత్రి వర్గంలోకి తీసుకున్న వెంటనే, బీజేపీ కూటమి ఫట్మని ఒక వికెట్ను కోల్పోయింది! అనుప్రియకు మంత్రి పదవి ఇచ్చినందుకు వచ్చిన తొలి రియాక్షన్ ఇది. ఇక రెండో రియాక్షన్... మోదీ నియోజకవర్గమైన వారణాసిలో ఆయనకు వ్యతిరేకంగా ఈ నెల 26 న మొదలవబోతున్న ‘బీజేపీ హఠావో... ఆరక్షణ్ బచావో’ ఉద్యమం. ఈ రియాక్షన్ల వల్ల మోదీకి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు కానీ... అందుకు కారణమైన అనుప్రియ పొలిటికల్ పవర్పై జాతీయ నేతల దృష్టి పడకుండా మాత్రం ఉండదు. నాన్న రమ్మంటే పాలిటిక్స్లోకి అయిష్టంగా వచ్చి, అమ్మ పొమ్మంటే పార్టీలోంచి ఛాలెంజ్ చేసి మరీ వెళ్లిపోయిన ‘అప్నాదళ్’ చీలిక వర్గం లీడర్ అనుప్రియ... మోదీ ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరిగా ఎదిగినా ఆశ్చర్యంలేదు. ‘‘ఐ ఫీల్ గ్రేట్. ఐ యామ్ రెడీ ఫర్ ఇట్.’’ ఎందుకు గ్రేట్గా ఫీలవడం? దేనికి రెడీ అవడం? అసలు ఎవరిది ఈ మాట? అనుప్రియ! ఎంపీగా రెండేళ్ల వయసు. మంత్రిగా ఆరు రోజుల వయసు. ఫస్ట్ టైమ్ ఎంపీ. ఫస్ట్ టైమ్ మినిస్టర్. ‘‘ఐ ఫీల్ గ్రేట్. ఐ యామ్ రెడీ ఫర్ ఇట్’’ - తనే ఈ మాట అన్నది. 35 ఏళ్ల వయసుకే కేంద్ర మంత్రి అవడం గ్రేట్ అనేనా ఆమె ఉద్దేశం? కాకపోవచ్చు. బహుశా.. మోదీజీ ఫస్ట్ హాఫ్లో ఇవ్వకుండా, సెకండ్ హాఫ్లో ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించడాన్ని అనుప్రియ గర్వంగా భావిస్తూ ఉండి వుండొచ్చు. సహాయ మంత్రి పదవి.. మంత్రిపదవి కన్నా చిన్నదే. కానీ మోదీ కేబినెట్కు సహాయంగా ఉండడం చిన్న విషయమేమీ కాదు. ఇక... రెడీ అవడం! యుద్ధానికి సిద్ధం అవుతున్నారా ఏమిటీ అనుప్రియ?! అవును యుద్ధమే! వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఆర్థికంగా వెనుకబడిన వర్గమైన కూర్మీల ఓట్లున్నాయి. కూర్మీలు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ చేతుల్లో ఉన్నారు. ఆయనదీ కూర్మీ కులమే. ఆయన చేతుల్లోంచి యు.పి.లోని కూర్మీల ఓట్లను లాక్కోవాలంటే ఇంకో కూర్మీ కావాలి. అందుకే బీజేపీ.. కూర్మీ అయిన అనుప్రియను పిలిచింది. పట్టం కట్టింది. కేంద్రంలో ఇప్పుడామె హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్. ‘‘నాకు ఇష్టం లేదు నాన్నా..’’ ఎవరో వె నక నుంచి నెడితే రాజకీయాల్లోకి వచ్చి పడ్డారు అనుప్రియ! సో.. అనుప్రియ పొలిటికల్ బయోగ్రఫీ ఆ ‘ఎవరో’తో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే.. అనుప్రియకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. ‘‘నాకు ఇష్టం లేదు నాన్నా’’ అంది! ఆయన నవ్వారు. అప్పటికే ఆయన యు.పి.లో పేరున్న పొలిటీషియన్. సోనే లాల్ పాటిల్! ఆయనది పేరున్న పార్టీ. అప్నా దళ్. సోనే లాల్ ‘కుర్మీ’ లీడర్. దళితనేత కాన్షీరామ్కు సన్నిహితుడు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక బృందంలో సోనే లాల్ కూడా ఉన్నారు. తర్వాత్తర్వాత కాన్షీరామ్ మాయావతికి ప్రాధాన్యం ఇవ్వడంతో నచ్చని సోనే లాల్ పార్టీ బయటికి వచ్చేశారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అదే... అప్నాదళ్. ఇంతకీ అనుప్రియను పాలిటిక్స్లోకి తెచ్చిన ఆ ‘ఎవరో’ ఎవరు? ఇంకెవరు? విధి! అనుప్రియ, అప్నాదళ్...అక్కాచెల్లెళ్లు అనుప్రియ పుట్టిన 14 ఏళ్లకు అప్నాదళ్ పుట్టింది. తర్వాత పదిహేనేళ్ల పాటు అనుప్రియ, అప్నాదళ్ కలిసి పెరిగాయి. చెల్లెలంటే అక్కకు ఇష్టం లేకపోవడం ఏమిటి? ‘‘నువ్వు పార్టీలోకి వస్తే బాగుంటుందిరా’’ అన్నారు సోనేలాల్ ఓ రోజు కూతురితో మురిపెంగా. అప్పుడు అనుప్రియ అన్నదే.. ‘‘నాకు ఇష్టం లేదు నాన్నా’’ అన్న మాట. ఆయన నవ్వి ఊరుకున్నారు. అదే చివరి నవ్వు. 2009 అక్టోబర్ 17న డాక్టర్ సోనే లాల్ పటేల్ కారు ఆక్సిడెంట్లో చనిపోయారు! అప్పటికి అనుప్రియకు పెళ్లయి వారం దాటింది అంతే! కాళ్ల పారాణైనా ఆరలేదు అంటాం కదా అలా. అప్నాదళ్ బాధ్యతను అనుప్రియ తల్లి కృష్ణ తీసుకున్నారు. అనుప్రియ, ఆమె భర్త చెరో చెయ్యీ వేశారు. అదే నచ్చలేదు పార్టీ ప్రెసిడెంట్ కృష్ణకీ, పార్టీ కేడర్కీ. చెయ్యి వెయ్యడాన్ని... చేజిక్కించుకోడానికి చేసిన ప్రయత్నం అనుకున్నారు వాళ్లు. ‘‘నీ ముఖం నాకు చూపించకు ఫో’’ ఆరేళ్లు గడిచాయి. ఈ ఆరేళ్లలో అనుప్రియ అప్నాదళ్ ఎమ్మెల్యే అయ్యారు. అప్నాదళ్ ఎంపీ అయ్యారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా ఆమె గెలుపునకు భారతీయ జనతా పార్టీ సాయం చేసింది. చేసిన సాయానికి ప్రతిఫలంగా ‘మీ పార్టీని మా పార్టీలో కలిపేద్దాం’’ అనే సంకేతం పంపారు మోదీ. అది నచ్చలేదు అనుప్రియకు. అయినా మోదీ ప్రయత్నాలు ఆగలేదు. అదంతా చూస్తున్న తల్లికి... ‘పిల్లగానీ అటువైపు వెళుతుందా’ అన్న అనుమానం వచ్చింది. ‘‘మీ అనుమానం నిజమే’’ అని ఒకరిద్దరు పార్టీ సన్నిహితులు తల్లి చెవిలో ఊదారు. అనుప్రియతో పాటు మరో ఆరుగురు పార్టీ నాయకులను అప్నాదళ్ నుంచి బయటికి పంపించారు కృష్ణ పటేల్. అందుకు ఆమె చూపిన కారణం... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు! పార్టీలోంచి బయటకి వచ్చిన ఈ ఏడాది వ్యవధిలో అనుప్రియ చీలిక వర్గం నాయకురాలిగా ఉన్నారు! ఇప్పుడు క్యాబినెట్లోకి వచ్చేశారు. మోదీజీ రెండోసారి కలిపిన 19 పవర్ ముక్కల్లో.. చిన్నారి మినిస్టర్ అనుప్రియే. యంగెస్ట్! మంత్రి అయిందని తల్లికి కోపం ‘‘ఐ యామ్ రెడీ ఫర్ ఇట్’’ అని అనుప్రియ అనడాన్ని మనం ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె తన ప్రత్యర్థులతో తలపడడానికి ముందు తల్లి విసిరే ముష్టి ఘాతాలను తప్పించుకోవలసి ఉంటుంది. ఇప్పటికే ఆమె ఒక అస్త్రాన్ని సంధించారు. కూతురికి మంత్రి పదవి ఇచ్చినందుకు నిరసనగా బీజీపీ కూటమి నుంచి బయటికి వచ్చారు. అనుప్రియ మంత్రి అవడం ఆమె తల్లి కృష్ట పటేల్కు ఇష్టం లేదు. తన కూతురికి మంత్రి పదవి ఇస్తే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటానని ఆమె ఇదివరకే ప్రకటించారు. ఇక అనుప్రియకు మంత్రి పదవి రావడం ఇష్టంలేని ఇంకో వ్యక్తి హరివంశ్ సింగ్. లోక్సభకు ఉన్న ఇద్దరే ఇద్దరు అప్నాదళ్ ఎంపీల్లో హరివంశ్ ఒకరు (ఇంకొకరు అనుప్రియ). హరివంశ్.. అనుప్రియ తల్లికి విధేయుడు. దాంతో బీజేపీ ఒక ఎంపీని కోల్పోయింది. అయితే కోల్పోయే దానికన్నా, రాబట్టుకోబోయే ఎక్కువని భావిస్తున్నందు వల్లే మోదీ.. అనుప్రియను క్యాబినెట్లోకి తీసుకున్నారు. అనుప్రియ... ఆకర్షణ అనుప్రియ యాక్టివ్. పార్లమెంటులో ఆమె స్పీచ్ ఇస్తుంటే సీనియర్లు ముచ్చటగా చూస్తుంటారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు కూడా ఆమె మాట్లాడే తీరు ఆకట్టుకుంటుంది. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతపు మాండలికంలోకి సులువుగా వెళ్లిపోతారు. ఆమె స్వభావమే అంత. అయితే పాలిటిక్స్ అర్థం చేసుకోడానికి మాత్రం ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది. అనుప్రియ ఎమ్మెల్యే అవడానికి ముందు... యు.పిలో కుల సమీకరణలను అవగాహన చేసుకోవడం అంత తేలికైన పని కాదని గ్రహించారు. రోజూ ఏదో ఒక కొత్త కోణం కనిపించేది. ఆ ప్రకారం తన ప్రసంగ పాఠానికి అప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవలసి వచ్చేది. పైగా ఆమె పోటీ చేస్తున్న రొహానియా నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన హిందీ భాష ఉండేది. ఆ భాషలో అక్కడి వారితో మాటామంతీ జరపడం కాస్త తడబాటుగా ఉండేది. ఇవన్నీ కూడా ఆమె శక్తిని హరించేవే. అయితే ఓటర్లతో మాట్లాడుతున్నప్పుడు ముఖంపై ఆ చిరునవ్వు మాత్రం అలాగే నిలిచి ఉండేది. అది ప్లస్ పాయింట్ అయింది అనుప్రియకు. మున్ముందు మోదీకి అది ప్లస్ ప్లస్ పాయింట్ అవొచ్చు. అనుప్రియ నేడో, రేపో.. తను బి.జె.పి.లో చేరుతున్నట్లు ప్రకటించే అవకాశాలున్నాయి. అనుప్రియ పటేల్ (36), కేంద్ర మంత్రి జన్మదినం : 28 ఏప్రిల్ 1981 జన్మస్థలం : కాన్పూర్ (యు.పి) తల్లిదండ్రులు : సోనే లాల్ పటేల్, కృష్ణ పటేల్ తోబుట్టువులు : చెల్లెలు పల్లవి (అప్నాదళ్ వై.ప్రె.), ఒక తమ్ముడు. చదువు : బి.ఎ. లేడీ శ్రీరామ్ కాలేజ్ (ఢిల్లీ) ఎం.ఎ. సైకాలజీ, (అమిటీ వర్శిటీ, నోయిడా) ఎం.బి.ఎ. (కాన్పూర్ వర్శిటీ) ఆసక్తి ఉన్న రంగాలు : బోధన, సంఘసేవ, రాజకీయాలు భర్త : ఆశిష్ కుమార్ సింగ్ నాన్న రమ్మన్నాడు... అమ్మ పొమ్మంది! ప్రాతినిధ్యం : ఎం.పి. మీర్జాపూర్ (యు.పి) ప్రత్యర్థి : సముద్ర బింద్ (బి.ఎస్.పి) మెజారిటీ : 2.19 లక్షల ఓట్లు! (2014 ఎ.) తొలి ప్రాతినిధ్యం : ఎమ్మెల్యేగా 31 ఏళ్ల వయసులో. నియోజకవర్గం : రొహానియా, వారణాసి తొలి పార్టీ : అప్నాదళ్ రాజకీయరంగ ప్రవేశం : 2009 (తండ్రి మరణంతో) పార్టీ బహిష్కారం : 2015 (తల్లి ఆగ్రహంతో) కృషి చేస్తున్న రంగాలు : నీటి పారుదల, గిరిజన సంక్షేమం ఉన్నత విద్య, గ్రామీణ అభివృద్ధి -
ప్రయాణం నేర్పిన పాఠాలు
చదువు పూర్తయిన తర్వాత అయిదుగురు విద్యార్థులు చేసిన ప్రయాణం వారికి ఏం నేర్పింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘పాఠశాల’. నందు, అనుప్రియ, శిరీష, సాయిరోనాక్, హమీద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహి.వి రాఘవ్ దర్శకుడు. రాకేష్ మహంకాళి, పవన్కుమార్రెడ్డి నిర్మాతలు. రాహుల్రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. అల్లరి నరేశ్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శాసనసభ్యురాలు డి.కె.అరుణకు అందించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘జీవితంలో గోల్డెన్డేస్ అంటే కాలేజీ రోజులే. నా స్వీయానుభవాలను కూడా క్రోడీకరించి ఈ కథ రాసుకున్నాను. యువతకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. నేను నిర్మించిన ‘విలేజ్లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. అందుకే కసితో ఈ సినిమా చేశాను’’ అని తెలిపారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు దామోదరప్రసాద్, నవదీప్, శశిధర్రెడ్డి, శశాంక్, ఖయ్యూమ్ తదితరులు కూడా మాట్లాడారు. -
'పాఠశాల' ఆడియో ఆవిష్కరణ
-
నిజ జీవిత అనుభవాల ఆధారంగా...
అది కళాశాల ముగింపు రోజు. గడచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, బరువెక్కిన హృదయాలతో విద్యార్థులంతా ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు. అలాంటి క్షణంలో ఆ అయిదుగురు మిత్రులు... ‘ఎవరిళ్లకు వాళ్లు వెళ్లే ముందు... ఒకరి ఇళ్లకు ఒకరం నాలుగు రోజులు అతిథులుగా వెళ్దాం’ అని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆ మిత్రుల జీవితాల్లో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పదహారేళ్ల చదువులో నేర్చుకోని పాఠాలను ఈ నాలుగు రోజుల ‘పాఠశాల’ ఆ అయిదుగురికీ నేర్పింది... ఈ ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘పాఠశాల’. సాయిరోనక్, అనుప్రియ, నందు, శిరీష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మూన్వాటర్ పిక్చర్స్ పతాకంపై రాజేశ్ మహంకాళి, పవన్కుమార్రెడ్డి నిర్మించారు. మహి వి.రాఘవ్ దర్శకుడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను శనివారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ, దేవా కట్టా, నందినీ రెడ్డి తమ కళాశాల నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అలాగే సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు. నిజ జీవితంలో ఎదురైన అనుభవాలనే ఆధారంగా చేసుకొని ఈ కథ తయారు చేశానని దర్శకుడు చెప్పారు. కథే ఈ చిత్రానికి ప్రాణమని నిర్మాతలు తెలిపారు. -
పాఠశాల మూవీ స్టిల్స్
-
జీవితం నేర్పిన పాఠం
అది కళాశాల ముగింపు రోజు. గడచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, బరువెక్కిన హృదయాలతో విద్యార్థులంతా ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు. అలాంటి క్షణంలో ఆ అయిదుగురు మిత్రులు... ‘ఎవరిళ్లకు వాళ్లు వెళ్లే ముందు... ఒకరి ఇళ్లకు ఒకరం నాలుగు రోజులు అతిథులుగా వెళ్దాం’ అని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆ మిత్రుల జీవితాల్లో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పదహారేళ్ల చదువులో నేర్చుకోని పాఠాలను ఈ నాలుగు రోజుల ‘పాఠశాల’ ఆ అయిదుగురికీ నేర్పింది... సింపుల్గా ‘పాఠశాల’ చిత్రం కథాంశమిది. ‘విలేజ్లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలను నిర్మించిన మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. రాజేశ్ మహంకాళి, పవన్కుమార్రెడ్డి నిర్మాతలు. మహి వి.రాఘవ్ దర్శకుడు. ‘‘వినోదం, వైవిథ్యం, సందేశాల మేళవింపే ఈ సినిమా. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై చివరివారంలో కానీ, ఆగస్ట్ తొలివారంలో కానీ విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. సాయి రోనక్, అనుప్రియ, నందు, శిరీష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: రాహుల్రాజ్, కెమెరా: సుధీర్ సురేంద్రన్, కూర్పు: శ్రవణ్.కె.