breaking news
annadhana programme
-
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన పలని సేవాదళ్ నిర్వాహకులు
వరంగల్: భద్రకాళి దేవాలయం వద్ద పలని సేవాదళ్ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానానికి మించిన దానం మరేదీ లేదని, గత మూడు సంవత్సరాలుగా పలని సేవాదళ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని ప్రజలు అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల నిర్వాహకులను ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, పలణి సేవాదళ్ నిర్వాహకులు గుండా అమర్నాథ్, పబ్బతి సత్యనారాయణ, మోదె నాగెందర్ ,నూతన్ కుమార్, దేవా అరవింద్,గరినే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చదవండి: Mahabubabad: టీఆర్ఎస్ అధిష్టానం రహస్య సర్వే! -
4న చంద్రగ్రహణం.. తిరుమల ఆలయం మూసివేత
తిరుమల: ఈ నెల 4న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. చంద్రగ్రహణం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు దివ్యదర్శనం రద్దు చేయనున్నట్టు తెలిపింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిలిపివేయనున్నట్టు టీటీడీ తెలిపింది.