breaking news
ajay chowthala
-
పదేళ్ల తర్వాత తీహార్ జైలు నుంచి మాజీ సీఎం విడుదల
చండీగఢ్: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలా పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2013లో చౌతాలా అరెస్టయ్యారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసిన వారికి 6నెలలు మినహాయింపును ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయంతో ఓం ప్రకాశ్ చౌతాలాకు ఆరు నెలల మినహాయింపు లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడుగా ఓం ప్రకాశ్ చౌతాలా ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా 4 సార్లు పదవి నిర్వహించిన విషయం తెలిసిందే. -
చౌతాలాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. చౌతాలా హరియాణా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అవినీతి వ్యవహారంలో ట్రయల్ కోర్టు ఓంప్రకాశ్ చౌతాలాను, ఆయన కుమారుడు అజయ్ చౌతాలాలను దోషులుగా నిర్ణయించి పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన చౌతాలాలకు గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్.. చౌతాలాలకు 10 సంవత్సరాల జైలు శిక్ష సబబేనని వ్యాఖ్యానించారు.