Agadha Movie
-
‘అగధ’ సినిమా టీజర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
అగధ నా కలల ప్రాజెక్ట్ : ఎం.ఎస్. రాజు
‘‘ఫిల్మ్ మేకర్స్గా మాకెన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాలు తీశాను. ఇప్పుడు నా కలల ప్రాజెక్ట్ అయిన ‘అగధ’ని ఈ స్థాయికి తీసుకువచ్చిన విశాలాక్షి, డా. రాజు, సుబ్బరాజులకు థ్యాంక్స్. టీజర్లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. మా చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను’’ అని ఎం.ఎస్. రాజు చెప్పారు. కామాక్షీ భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ రాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘అగధ’. ఎం.ఎస్. రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ వేడుకని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ–‘‘ఎం.ఎస్. రాజుగారి వల్లే సినిమా నిర్మాణంలోకి వచ్చాను. మా మూవీని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. కామాక్షీ భాస్కర్ల మాట్లాడుతూ–‘‘అగధ’లో మహాదేవి పాత్రను నేను పోషించగలను అని నమ్మిన రాజుగారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘డర్టీ హరి’ చిత్రం ద్వారా నన్ను వెండితెరకు పరిచయం చేసిన ఎం.ఎస్.రాజుగారితోనే ‘అగధ’ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రవణ్ రెడ్డి. ‘‘అగధ’లో నా ఫస్ట్ లుక్ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజులగారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించడం సంతోషంగా ఉంది’’ అని నటి జోవికా విజయ్ కుమార్ చెప్పారు. -
'షూటింగ్లో పాము కాటు.. వనితా మాటలకు షాకయ్యాం..'
కోలీవుడ్ నటి వనితా విజయ్కుమార్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. 1999లోనే దేవి మూవీలో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె కూతురు సైతం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గతేడాది తమిళ బిగ్బాస్ కంటెస్టెంట్గా పాల్గొన్న జోవిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తోన్న అగధ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన ఎంఎస్ రాజు మాట్లాడారు. 1999లో వచ్చిన దేవి మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దేవి సినిమా షూటింగ్లో వనిత విజయ్ కుమార్ను పాము కాటేసిందని తెలిపారు. అప్పుడు మేమంతా తెగ కంగారు పడిపోయామని వెల్లడించారు. కానీ వనితా మాత్రం ఎలాంటి భయం లేకుండా అమ్మవారే తనను కాపాడుతుందని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంత ధైర్యవంతురాలో చెప్పాలంటే ఈ ఒక్క సంఘటన చాలని ఎంఎస్ రాజు ప్రశంసలు కురిపించారు. కాగా.. 1999లో వచ్చిన దేవి సినిమాకు ఎంఎస్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో మిస్టికల్ డివైన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో కామాక్షీ భాస్కర్ల మహాదేవి పాత్రలో కనిపించనుంది. -
రహస్యం ఏంటి?
ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో మహాదేవి పాత్రలో నటించిన కామాక్షీ భాస్కర్ల లుక్ని ఇటీవల రివీల్ చేశారు మేకర్స్. తాజాగా నటుడు శ్రవణ్ రెడ్డి పోషించిన సింహ పాత్ర లుక్ను విడుదల చేశారు. ‘‘డర్టీ హరి’ చిత్రంతో శ్రవణ్ రెడ్డిని తెలుగు తెరకు పరిచయం చేశారు ఎం.ఎస్. రాజు. ఇప్పుడు మరోసారి ‘అగధ’లో సింహ పాత్ర చేసే అవకాశం ఇచ్చారాయన. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే పాత్రను సింహ పోషించారు. 85 రోజుల షూటింగ్... విస్తృతమైన సెట్ వర్క్... దాదాపు 45 నిమిషాల వీఎఫ్ఎక్స్తో ‘అగధ’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Agadha: ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల.. లుక్ అదిరింది!
'దేవి', 'శత్రువు', 'ఒక్కడు', 'వర్షం', 'మనసంతా నువ్వే', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి కల్ట్ చిత్రాల నిర్మాత , ‘డర్టీ హరి’, ‘ మళ్లీ పెళ్లి ‘ చిత్రాల దర్శకుడు ఎం.ఎస్. రాజు మరో సూపర్ ఇంట్రెస్టింగ్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నారు. ఆయన తాజా చిత్రం 'అగధ'లో మహాదేవి పాత్ర పరిచయం ఈ మర్మమైన, దైవిక థ్రిల్లర్కు కొత్త ఉత్కంఠను జోడిస్తుంది.'అగధ' ఫస్ట్ లుక్తో రేగిన ఉత్సుకత ఇప్పుడు తదుపరి వెల్లడికి దారితీసింది. మునుపటి పోస్టర్లో దైవ విగ్రహం ముందు నిలబడి కనిపించిన ఆ రహస్య యువతి మరెవరో కాదు, కామాక్షి భాస్కర్ల అని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆమె ఈ చిత్రంలో కీలక కథానాయిక మహాదేవి పాత్రను పోషిస్తున్నారు.ఈ ప్రకటనతో, మొదటి పోస్టర్ ద్వారా ఎంఎస్ రాజు సృష్టించిన దృశ్యరూపానికి ఇప్పుడు ఒక ముఖం, శక్తివంతమైన తెరపై ఉనికి లభించాయి. త్రిశూలాలు, దీపాలు, ఎత్తైన విగ్రహంతో కూడిన ఆధ్యాత్మిక నేపథ్యం ముందు, సాంప్రదాయ నల్ల చీర కట్టుకుని గంభీరంగా కూర్చున్న కామాక్షి భాస్కర్ల రూపమే, కథనంలో ఆమె పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని సూచిస్తోంది. ఆమె ప్రచండమైన హావభావం, సాంప్రదాయ రూపం, ఆ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం, మహాదేవి కేవలం ఒక సాధారణ పాత్ర కాదని, కథ యొక్క ఆధ్యాత్మిక మూలంతో గాఢంగా ముడిపడి ఉన్న వ్యక్తి అని తెలియజేస్తున్నాయి.


