breaking news
Advance Tax Receipts
-
కాసుల గలగల.. భారీగా పెరిగిన పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 17 నాటికి నికరంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 11.18 శాతం పెరిగి రూ. 3.80 లక్షల కోట్లకు చేరాయి. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం ఇందుకు దోహదపడినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. జూన్ 17 నాటికి ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13.70%పెరిగి రూ. 1,16,776 కోట్లకు చేరాయి. నికరంగా వసూలైన రూ. 3,79,760 కోట్ల ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేషన్ పన్నులు రూ. 1,56,949 కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్నులు రూ. 2,22,196 కోట్లు ఉన్నాయి. జూన్ 17 నాటికి రీఫండ్లు 30% పెరిగి రూ. 39,578 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ రిటర్నులకు అదనపు ధ్రువీకరణలు! కాగా పన్ను ఎగవేతలు, నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్లకు అడ్డుకట్ట వేసేలా జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ విధానంలో మరిన్ని ధ్రువీకరణలను అమలు చేయాలన్న సీబీఐసీ ప్రతిపాదనను జూలై 11న జరిగే సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయం తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలోనూ అలాగే రిటర్ను దాఖలు చేసేటప్పుడు కూడా అదనంగా ధ్రువీకరణ నిబంధనలను ప్రవేశపెట్టాలని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నిర్ణయించినట్లు వివరించారు. -
ద్రవ్యలోటును కట్టడి చేస్తాం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు లోపు కట్టడి చేయగలమని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తాజాగా స్పష్టం చేశారు. 4.8% దాటి తే ఆందోళనకరమని, అయితే దీనిని దాటబోమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ నవంబర్ చివరికి బడ్జెట్ అంచనాల్లో 94%కు ద్రవ్యలోటు చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ చిదంబరం డిసెంబర్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, వెరసి లోటు తగ్గుముఖం పడుతుందని వివరించారు. డిసెంబర్లో ముందస్తు పన్ను చెల్లింపులు వసూలుకావడంతోపాటు, ప్రభుత్వ వ్యయాలు క్షీణిస్తాయని చెప్పారు. దీంతో ద్రవ్యలోటుకు కళ్లెం పడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బాటలో 2016-17కల్లా 3%కు తగ్గించాలని భావిస్తోంది. గడిచిన ఏడాది (2012-13)లో లోటు 4.9%గా నమోదైన సంగతి తెలిసిందే. కష్టమే... ఆదాయాలు క్షీణించడం, డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధించలేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో ద్రవ్యలోటును కట్టడి చేయడం ప్రభుత్వానికి కష్టతరమైన అంశంగా నిలవనుంది. లోటు కట్టడికి ప్రణాళికా వ్యయాలను రూ. లక్ష కోట్లమేర ప్రభుత్వం తగ్గించుకోవలసి ఉంటుంది. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 40,000 కోట్ల సమీకరణ లక్ష్యం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 3,000 కోట్లను సమకూర్చుకోగలిగింది. ఏప్రిల్-నవంబర్’13 కాలంలో ద్రవ్యలోటు రూ. 5,09,557 కోట్లకు చేరింది. ఇది వార్షిక లక్ష్యంలో దాదాపు 94%కాగా, గతేడాది ఇదే కాలానికి 80% స్థాయిలో లోటు నమోదైంది. ఈ ఏడాదికి ఆదాయాలు, వ్యయాల మధ్య లోటును రూ. 5,42,499 కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.