-
శేఖర్ కమ్ముల కుబేర.. టీజర్ వచ్చేసింది!
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం టీజర్ను విడుదల చేసింది. ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో టీజర్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఓటీటీలో ప్రేమలు హీరో కొత్త సినిమా 'జింఖానా'
గతేడాదిలో 'ప్రేమలు' సినిమాతో తెలుగు యూత్కు బాగా దగ్గరయ్యాడు యువ నటుడు నస్లేన్ కె. గఫూర్. మలయాళ పరిశ్రమకు చెందిన ఆయన రీసెంట్గా మరో చిత్రం 'జింఖానా'తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్కు బాగా కనెక్ట్ అయింది. దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.జింఖానా సినిమా సోనిలివ్ (SonyLIV)లో జూన్ 5నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈమేరకు ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్ ముఖ్య తారలుగా నటించారు. మొదట మలయాళంలో ‘అలప్పుజ జింఖానా’ పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా తర్వాత రిలీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్పై సుబ్బారెడ్డి తెలుగులో ‘జింఖానా’ పేరుతో విడుదల చేశారు.కథఊరిలో ఆకతాయి కుర్రాళ్లుగా ఉన్న జోజో జాన్సన్ (నస్లేన్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), డీజే జాన్ (బేబీ జీన్), దీపక్ పణిక్కర్ (గణపతి), షణవాస్ (శివ హరిచరణ్) వీరందరూ మంచి స్నేహితులు. అయితే, వారిలో షణవాస్ మినహా మిగతా వాళ్లంతా 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో డిగ్రీలో అడుగు పెట్టే అవకాశం కోల్పోతారు. కానీ, స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ పొందేందుకు వారు బాక్సింగ్ ఆటలో ఎంట్రీ ఇస్తారు. అందుకోసం స్థానికంగా ఉన్న 'అలప్పుజా జింఖానా' అకాడమీలో శిక్షణ తీసుకుంటారు. అలా బాక్సింగ్ రింగ్లోకి అడుగుపెడుతారు. ప్రొఫెషనల్ ఆటగాళ్లతో ఈ ఆకతాయి గ్యాంగ్ ఎలా ఎదుక్కొంటుంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి..? అనేది సినిమాలో చూడాల్సిందే. -
‘కన్నప్ప’ టీమ్కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్
‘కన్నప్ప’చిత్ర బృందానికి మంచు మనోజ్(Manchu Manoj) క్షమాపణలు చెప్పారు. భైరవం సినిమా ఈవెంట్లో ‘శివయ్యా..’ అనే డైలాగును వేరేలా వాడడం తప్పని ఒప్పుకున్నాడు. ఒకడు చేసిన తప్పుకు సినిమా మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని..ఏదో ఎమోషనల్గా అలా అన్నానని చెబుతూ కన్నప్ప టీమ్కు సారీ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిదంటే..శివయ్యా... అని పిలిస్తే రాడుమంచు మనోజ్ ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఏపీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఇబ్బందులు ఉన్న సమయంలో ఆ పరమ శివుడే డైరెక్టర్ విజయ్ రూపంలో వచ్చి భైరవం సినిమా ఆఫర్ ఇచ్చాడని చెబుతూ.. ‘ శివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు.. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలో వస్తాడు’ అంటూ పరోక్షంగా కన్నప్ప సినిమాలో మంచు మనోజ్ చెప్పిన శివయ్యా డైలాగ్పై కౌంటర్ వేశాడు. అదికాస్త నెట్టింట బాగా వైరల్ అయింది.సినిమా ఒకడిది కాదు.. తాజాగా శివయ్య కామెంట్స్పై మంచు మనోజ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శివయ్యా అనే డైలాగ్పై సెటైర్లు వేయడం తప్పని ఒప్పుకున్నాడు. ‘సినిమా అంటే ఒక్కడికాదు.. అందులో ఎంతో మంది పని చేస్తారు.. ఆ డైరెక్టర్,మ్యూజిక్ డైరెక్టర్..ఇలా ఎంతో మంది కష్టపడతారు. మోహన్ లాల్.. ప్రభాస్.. ఇలా అందరూ కష్టపడి సినిమా చేశారు.. ఒక్కరికి కోసం సినిమాను విమర్శించడం తప్పే. ఒక సినిమా వాడిగా నేను అలా అనకూడదు. ఎప్పుడైనా ఏదైనా అని ఉంటే.. కన్నప్ప టీంకి క్షమాపణలు కోరుతున్నాను. అవి ఎమోషనల్గా చేసిన కామెంట్సే తప్ప..మరో ఉద్దేశం నాకు లేదు. కన్నప్ప సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని మనోజ్ అన్నారు.భైరవం విషయానికొస్తే.. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. -
సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి’’ అని తేల్చి చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుండా తనతో పాటుగా కొంత మంది సిని నిర్మాతలు కుట్ర పన్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.‘‘నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ మాత్రం ధ్రువీకరించు కోకుండా కొన్ని మీడియా సంస్థలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాలలో ఉన్నాననే అక్కసుతో ఏదో వివాదంలోకి లాగడం ఎంత వరకు సమాంజసం?’’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. -
అందులో రొమాంటిక్ యాంగిల్ మాత్రమే చూశారు: భాగ్యశ్రీ బోర్సే
ఒకే ఒక్క తెలుగు సినిమాతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). ఆ పాపులారిటీతోనే ఇప్పుడు చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటోంది. ఆ విషయాలే మీ కోసం.. నైజీరియాలోని లాగోస్లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు వ్యాపార బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్తో ఆమె ప్రసిద్ధిచెందింది.విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమాలో నుంచి విడుదలైన ‘హృదయం లోపల’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఆమె చాలా ఇంటిమేట్గా కనిపించింది. ఈ విషయమై ఆమెను అడగ్గా, ‘క్యారెక్టర్కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికే అలా నటించా– స్టార్డమ్ అందుకోవడానికి కాదు. ఇందులోని హీరోయిన్ పాత్రలో కేవలం రొమాంటిక్ యాంగిలే కాదు, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. అందుకే, ఈ సినిమా కోసం నేను కూడా ఒక కామన్ ఆడియన్స్లాగా ఎదురు చూస్తున్నాను.’ అని భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రీసెంట్గా 26వ పుట్టినరోజు జరుపుకున్న భాగ్యశ్రీ.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో జన్మించింది. భాగ్యశ్రీకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లల్లో భాగ్యశ్రీ రెండవది. మిగిలిన ఇద్దరి పేర్లు మధువంతి, పూర్ణిమ. మొదటి సినిమాకి (మిస్టర్ బచ్చన్) రూ. 30 లక్షల పారితోషికం తీసుకున్న భాగ్యశ్రీ, ప్రస్తుతం రూ. రెండు కోట్లు డిమాండ్ చేస్తోందని సమాచారం.ఏ ఫుడ్ ఇష్టం: హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బేగం బజార్లో దొరికే పానీ పూరీ, చాట్ అంటే ప్రాణం. అవకాశం దొరికినప్పుడు తనే స్వయంగా వెళ్లి తినడానికి ప్రయత్నిస్తుంది.ఏ సినిమాలు చేస్తుంది: రామ్ పోతినేనితో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్తో ఓ సినిమా చేస్తోంది భాగ్యశ్రీ. ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్ తర్వాతే కొత్త ప్రాజెక్టులు సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేయకుండా, ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులకు మాత్రమే సైన్ చేస్తానంటోంది భాగ్యశ్రీ.బాలీవుడ్ ఆలోచనపై: కెరీర్ ఆరంభంలో హిందీలో ‘ఆరియాన్’, ‘చందు ఛాంపియన్’ అనే రెండు సినిమాలు చేసింది. కానీ, ఆ రెండూ నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతానికి బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదంది.వెజిటేరియనే కానీ,..: బేసిక్గా వెజిటేరియన్ అయినా, ప్రొటీన్ కోసం చికెన్ తినడం అలవాటు చేసుకున్నట్లు చెప్పింది. రొమాంటిక్ సినిమాలు చూడటం చాలా ఇష్టమట. ఏ పని అయినా వందశాతం చేయగలను అనే నమ్మకం ఉంటేనే, ఆ పనిని టేకప్ చేస్తాను. లేకపోతే నో చెప్పేస్తా’ అని చెప్పింది భాగ్యశ్రీ. -
ఒక్కో బిల్డింగ్కు ఒక్కో రేటు.. ముడుపుల రూటు సపరేటు
సాక్షి, అమరావతి: ‘మామూలుగా భవనాల (బిల్డింగ్) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైవ్ స్టార్ వసతులు కల్పిస్తూ నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500కు మించి ఖర్చు కాదు’ అని ఇంజినీరింగ్ నిపుణులు తేల్చి చెబుతుంటే రాజధాని అమరావతిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు వచ్చాయి. నిర్మాణ వ్యయం బిల్డింగ్ బిల్డింగ్కు మార్చేశారు. చదరపు అడుగుకు రూ.10,418.97 చొప్పున భవనాల నిర్మాణ పనులను ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్ కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేయడంపై ఇంజినీరింగ్ నిపుణులు, బిల్డర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటాలియన్ మార్బుల్స్తో ఫైవ్ స్టార్ సదుపాయాలతో కట్టినా చదరపు అడుగు రూ.4వేలు–రూ.4,500కు మించదని హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్న బిల్డర్లు నివ్వెరపోతున్నారు. ఆ భవనాలను ఏమైనా వెండితో కడుతున్నారా.. బంగారపు పూత పూస్తున్నారా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం కమీషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి వెళ్తోందంటూ అధికార వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. అప్పు తెచ్చిన సొమ్ముతో...ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కేఎఫ్డబ్ల్యూ (జర్మనీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయిలో దోపిడీకి తెర తీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం (ఐదు ఐకానిక్ టవర్లు), మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాల (క్వార్టర్స్) నిర్మాణ పనులకు 2016–18లోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పట్లో చేయగా మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఇటీవల సీఆర్డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 65 శాతం నుంచి 105 శాతం వరకు పెంచేసి టెండర్లు పిలిచి.. అధిక ధరలకు సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. కాంట్రాక్టు ఒప్పందం విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో ఎనిమిది శాతం ముఖ్య నేత, మిగతా రెండు శాతం కాంట్రాక్టర్లు నీకింత.. నాకింత.. అంటూ పంచుకున్నారు. మంత్రుల బంగ్లా వ్యయం రూ.6.99 కోట్లు రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్ కేపిటల్ ఏరియా)లో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనుల్లో మిగిలిన పనులను రూ.495.86 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాకు అప్పగించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాల్లో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్లో పేర్కొన్నారు. కానీ.. టెండర్ డాక్యుమెంట్ను పరిశీలిస్తే మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల్లో ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,418.97. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.6.99 కోట్లు. పైగా ఇసుక ఉచితం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.4 కోట్లలోపేనని బిల్డర్లు ఎత్తి చూపుతున్నారు. ఐఏఎస్ల బంగ్లా చదరపు అడుగు రూ.9,771 రాజధానిలో రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 90 బంగ్లాల నిర్మాణంలో మిగిలిన పనులను రూ.516.02 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు అప్పగించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 115 బంగ్లాల నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,771.25. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతో ఇలాంటి బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4,500కు మించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఏఎస్ అధికారుల ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.4.49 కోట్లు. హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.3 కోట్లకు మించదని రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.నాడూ నేడు ఒకే రీతిలో దోపిడీ ⇒ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లు ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపులతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ⇒ ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ⇒ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి సీఎం తరఫున కమీషన్లు వసూలు చేసి, ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నుంచి అధికారుల నివాసాల వరకు.. డిజైన్ మారిందని.. పని స్వభావం మారిందని.. ధరలు పెరిగాయనే సాకు చూపి.. 2015–19 తరహాలోనే దోపిడీకి తెర తీశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం ఆకాశమంత ⇒ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్ృజెనిసిస్ ప్లానర్స్ృడిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు (ఆకృతులు) రూపొందించాయి. ⇒ ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ⇒ నాలుగు టవర్లను బీ+జీ+39 అంతస్తులతో.. ఐదో టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనుంది. ఈ ఐదు టవర్ల మొత్తం నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి చూస్తే ఐకానిక్ టవర్లలో మిగిలిన పనుల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.8,981.56. ఈ లెక్కన చూసుకుంటే 2018 నాటితో పోల్చితే ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం రూ.2,417.68 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ అంటే.. అంచనా వ్యయం 105 శాతం పెంచేశారన్న మాట. నిజానికి 2018ృ19 ధరలతో పోల్చితే ప్రస్తుతం సిమెంటు, స్టీలు, పెట్రోల్, డీజిల్ సహా నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక ఇసుక ఉచితం. ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి వీల్లేదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని, చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించి వ్యయం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
విశాల్ ప్రియురాలి కొత్త సినిమా.. ట్రైలర్లో దుమ్మురేపిందిగా
సాయి ధన్సిక పేరు ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో బాగా వైరల్ అవుతుంది. నటుడు విశాల్తో ఆమె ప్రేమలో ఉండటమే ఇందుకు కారణం. తాజాగా వారిద్దరూ అధికారికంగా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించారు. అయితే, తాజాగా సాయి ధన్సిక నటించిన కొత్త సినిమా 'యోగి డా' నుంచి ట్రైలర్ విడుదలైంది. గౌతమ్ కృష్ణ దర్శకత్వం వహించిన యాక్షన్ తమిళ చిత్రంలో సాయాజీ షిండే, కబీర్ దుహాన్ సింగ్ నటించారు. శ్రీ మోనికా సినీ ఫిల్మ్స్ బ్యానర్పై వి సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ షేర్ చేసింది. భారీ యాక్షన్ సిన్స్లో పోలీస్ ఆఫీసర్గా సాయి ధన్సిక దుమ్మురేపింది. ఈ సినిమా కోసం డూప్ లేకుండానే రియల్గా ఆమె స్టంట్స్ చేశారట.రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ధన్సిక.. అందులో ఆయన కూతురు (యోగి) పాత్రలో మెప్పించింది. ఇప్పుడు 'యోగి డా' టైటిల్తో తనే ప్రధాన పాత్రలో నటించింది. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. -
యూనియన్ బ్యాంక్తోపాటు మరో సంస్థపై ఆర్బీఐ జరిమానా
బ్యాంకింగ్, ఫిన్టెక్ రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడంలో విఫలమైనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్ (లెండ్బాక్స్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం నడుచుకోని సంస్థలపై కఠిన చర్యలుంటాయని ఆర్బీఐ పేర్కొంది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై జరిమానాబ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 నిబంధనలు, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాలపై ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.63.6 లక్షల జరిమానా విధించింది. నిధుల బదిలీలో జాప్యం, పూచీకత్తు లేని రుణ విధానాల్లో ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. ముఖ్యంగా వ్యవసాయం వంటి ప్రత్యేక రక్షణ అవసరమయ్యే రంగాల్లో ఆర్థిక సంస్థలు నిర్దేశిత రుణ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూడాలని ఆర్బీఐ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా లేకపోతే పేదరికం తప్పదా?ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్(లెండ్ బాక్స్)పై పెనాల్టీఆర్బీఐ పీర్-టు-పీర్ (పీ2పీ) లెండింగ్ ప్లాట్ఫామ్ డైరెక్షన్స్-2017ను పాటించనందుకు లెండ్బాక్స్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్పై రూ.40 లక్షలు జరిమానా విధించింది. దేశ డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్లో గణనీయమైన వృద్ధిని చూసిన పీ2పీ లెండింగ్ కార్యకలాపాలకు సంబంధించిన లోపాలను సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. ఫిన్టెక్ కంపెనీలు పారదర్శకత పాటించాలని, వినియోగదారులు, రుణదాతలను రక్షించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని గుర్తు చేసింది. -
ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
దుద్యాల్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని నాజుఖాన్పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బండమీది నర్సమ్మ (50) కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. వాటిని భరించలేని ఆమె పొలం వద్దకు వెళ్లి చీరతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడు ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నరైన్ చరిత్ర సృష్టించాడు. సునీల్ కేకేఆర్ తరుపన ఇప్పటివరకు ఐపీఎల్లో 191, ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20)లో 18 వికెట్లు తీశాడు. మొత్తంగా 209 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో నరైన్ ఈ ఫీట్ సాధించాడు. కాగా సునీల్ నరైన్ ఐపీఎల్ ఆరంభం నుంచి కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కే ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ నాటింగ్హామ్షైర్ బౌలర్ సమిత్ పటేల్ పేరిట ఉండేది. నాటింగ్హామ్షైర్ తరపున పటేల్ 208 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో సమిత్ వరల్డ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. నరైన్ పటేల్, తర్వాతి స్ధానంలో హాంప్షైర్ బౌలర్ క్రిస్ వుడ్ 199 ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ 195 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.పురుషుల టీ20 క్రికెట్లో ఒక జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు210* – సునీల్ నరైన్ (కోల్కతా నైట్ రైడర్స్)208 – సమిత్ పటేల్ (నాటింగ్హామ్షైర్)199 – క్రిస్ వుడ్ (హాంప్షైర్)195 – లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్)193 – డేవిడ్ పేన్ (గ్లౌసెస్టర్షైర్)