-
పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత లాహోర్ ఖలందర్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఎడిషన్ విజేతగా లాహోర్ ఖలందర్స్ అవతరించింది. నిన్న (మే 25) జరిగిన ఫైనల్లో ఆ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత నాలుగు సీజన్లలో ఖలందర్స్కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. ఖలందర్స్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సికందర్ రజా సుడిగాలి ఇన్నింగ్స్ (7 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి ఖలందర్స్ను గెలిపించాడు. 19వ ఓవర్ చివరి రెండు బంతులకు 8 పరుగులు అవసరం కాగా.. రజా వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టాడు.అంతకుముందు కుసాల్ పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (31 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ఖలందర్స్ను గెలుపుకు దగ్గర చేశాడు. ఖలందర్స్ ఇన్నింగ్స్లో ఫకర్ జమాన్ 11, ముహమ్మద్ నయీమ్ 46, అబ్దుల్లా షఫీక్ 41, భానుక రాజపక్స 14 పరుగులు చేశారు.గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (76) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగగా.. సౌద్ షకీల్ 4, ఫిన్ అలెన్ 12, రిలీ రొస్సో 22, అవిష్క ఫెర్నాండో 29, దినేశ్ చండీమల్ 22, ఫహీమ్ అష్రాఫ్ 28 పరుగులు చేశారు. ఖలందర్స్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, సల్మాన్ మిర్జా, హరీస్ రౌఫ్ తలో 2, సికందర్ రజా, రిషద్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.ఆఖరి నిమిషంలో బరిలోకి దిగి ఖలందర్స్ను గెలిపించిన సికందర్ రజాముందు రోజు ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించిన సికందర్ రజా.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి పది నిమిషాల ముందు ఖలందర్స్కు అందుబాటులోకి వచ్చాడు. తొలుత బౌలింగ్లో ఓ వికెట్ తీసిన రజా.. ఆతర్వాత బ్యాటింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఖలందర్స్కు టైటిల్ను అందించాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రజా 24 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్లో విఫలమైన (7) అతను.. రెండో ఇన్నింగ్స్లో అర్ద సెంచరీతో (60) రాణించాడు. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
ఊపిరి పీల్చుకున్న నాసా : ఎవరీ యువరాజ్ గుప్తా
మట్టిలో పుట్టిన మాణిక్యాలకు మన దేశంలో కొదువ లేదు. చిన్న వయసులోనే అత్యద్బుతమైన నైపుణ్యంతో అబ్బుర పరచడమే కాదు, అరుదైన ఘనతను సొంతం చేసుకుంటారు. అలాంటి రత్నం లాంటి వ్యక్తి గురించి తెలుసుకుందామా. మహా మహా నిపుణులే కనిపెట్టలేని బగ్ను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తన పొరుగువారి Wi-Fi ని హ్యాక్ చేసి దానితో ఆడుకునే ఆ పిల్లవాడు, నేడు NASA వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతరిక్ష సంస్థ వెబ్సైట్ను సైబర్ దాడుల నుండి రక్షించాడు కాన్పూర్కు చెందిన యువరాజ్ గుప్తా (Yuvraj Gupta). తన సామర్థ్యాలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు.ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తానేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెబ్సైట్లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు. ఈ బగ్ ద్వారా, ఎవరైనా NASA అధికారిక ఇమెయిల్ నుండి నకిలీ సందేశాలను పంపవచ్చు. ఎంతోమంది సైబర్ నిపుణులు ఈ లోపాన్ని పట్టుకోలేకపోయారు, కానీ యువరాజ్ దాన్ని గుర్తించడం విశేషంగా నిలిచింది.BREAKING NEWS 🚨 📢 14 year old Yuvraj Gupta, who lives in Kanpur, Uttar Pradesh, has done a great feat. Hesaved the website of American space agency NASA from hackers.NASA has included him in the 'Hall of Fame' and also given him a letter of recognition. pic.twitter.com/GzTbgFB8GN— News Arena India (@NewsArenaIndia) May 25, 2025 fy"> NASA బగ్ బౌంటీ కార్యక్రమంలో దాదాపు రెండు వారాల పాటుప్రయత్నించిన , ఇక ఆశ వదిలేసుకుంటున్న సమయంలో ఒక రాత్రి అతను NASA సబ్ డొమైన్లో లోపాన్ని కనుగొన్నాడు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి వీడియోతో పాటు నాసాకు పంపించాడు. ఇది మాత్రమే కాదు, అతను నకిలీ ఈమెయిల్స్, రహస్య సమాచారాన్ని చేరవేసే బగ్ల గురించి తెలియజేశాడు. యువరాజ్ గుప్తా సాధించిన ఈ ఘనతకు నాసా గుర్తించింది. యువరాజ్ను ప్రశంసా పత్రం , 'హాల్ ఆఫ్ ఫేమ్'లో స్థానం కల్పించి సత్కరించింది.కాన్పూర్లోని సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజీ (దామోదర్ నగర్)లో చదువుతున్నాడు . 10వ తరగతిలో 79.4 శాతం మార్కులు సాధించాడు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, అతను యూట్యూబ్, ఆన్లైన్ కోర్సులు, పుస్తకాల ద్వారా ఎథికల్ హ్యాకింగ్పై పట్టు సాధించాడు. 6వ తరగతిలో ఉన్నప్పటినుంచీ సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టువదలకుండా ఎథికల్ హ్యాకింగ్లో నైపుణ్యాన్ని సాధించాడు. తాజాగా తన నైపుణ్యంతో నాసాను ఇంప్రెస్ చేయడం విశేషం.యువరాజ్ గుప్తా తండ్రి జై నారాయణ్ గుప్తా ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. తల్లి కల్పనా గుప్తా గృహిణి. యువరాజ్ కు ల్యాప్ టాప్ ఇవ్వడానికి, అతని సోదరి స్కాలర్షిప్ , అతని తండ్రి పొదుపు మొత్తాన్ని కలిపి మొత్తం సిస్టంను సమకూర్చుకున్నాడట. దేశానికి డిజిటల్ భద్రతను అందించాలనే సంకల్పంతో ఉన్నామంటోంది యువరాజ్ కుటుంబం. -
ఇదెక్కడి విడ్డూరం.. ఇలా కూడా పరువు పొగొట్టుకుంటారా?
హుర్రే.. ఆపరేషన్ సింధూర్కి కౌంటర్గా ఆపరేషన్ భున్యన్తో భారత్పై విజయం సాధించాం అంటూ పాక్ చేస్తున్న వేడుకలు, వరుస ప్రకటనలు నవ్వులు పూయిస్తున్నాయి. ఒకదానికి తర్వాత మరొకటి తప్పుడు ప్రచారాలతో పరువు పొగొట్టుకుంటోంది ఆ దేశం. తాజాగా..ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్(Asim Munir) చేసిన పని.. విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఆపరేషన్ భున్యాన్ సక్సెస్ పేరిట ఆయనో డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, సెనేట్ చైర్మన్ యూసుఫ్ రజా గిలానీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. ఆపరేషన్ భున్యన్(Operation Bunyan) విక్టరీకి గుర్తుగా ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్కు ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఓ పెయింటింగ్ బహుకరించారు. కానీ.. అందులో ఉన్న తప్పును కొందరు టక్కున పట్టేశారు. నాలుగేళ్ల కిందట చైనా జరిపిన మిలిటరీ ఆపరేషన్ తాలుకా చిత్రమది. ఆ చిత్రాన్ని ముందూ వెనుక చూడకుండా ఆపరేషన్ భున్యాన్ చిత్రమంటూ అదీ ఆర్మీ చీఫ్ ప్రధాని బహుకరించడం విడ్డూరంగా పేర్కొంటున్నారు కొందరు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీరంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. అయితే.. ఆపరేషన్ భున్యన్ ఉన్ మర్సూస్తో తామూ భారత్పై దాడులు జరిపి ఘన విజయం సాధించామని పాక్ ప్రకటించుకుంటూ వస్తోంది. కానీ, అంతర్జాతీయ సమాజానికి తగిన ఆధారాలు మాత్రం చూపించకపోయింది. వరుసగా.. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో పాక్ పరువు మళ్లీ మళ్లీ పోగొట్టుకుంటూ వస్తోంది. భారత్పై విజయం అంటున్నారు కదా.. దానికి తగిన ఆధారం ఒక్కటైనా చూపించలేని స్థితిలో పాక్ ఉందంటూ పలువురు జోకులు పేలుస్తున్నారు.ఇదీ చదవండి: నన్ను ఆపేస్తే నీ సంబంధం బయటపెడతా! -
అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే కన్న తల్లి ప్రాణాలు పోతుంటే లోకం పోకడ తెలియని చిన్నారుల ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. తండ్రి బతుకుదెరువు రీత్యా గల్ఫ్లో ఉండడంతో చిన్నారులు అనాథలయ్యారు. రాజన్నపేటకు చెందిన చొట్టి కీర్తన, మహేందర్ దంపతులకు ఇద్దరు కుమారులు అన్వేశ్(6), శివాన్‡్ష(3) ఉన్నారు. మహేందర్ ప్రస్తుతం గల్ఫ్లో ఉండగా.. కీర్తన తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మాచారెడ్డిలో బస్సు దిగి తన తండ్రికి ఫోన్ చేసి తమను తీసుకుపోవడానికి ద్విచక్ర వాహనంపై రమ్మంది. మాచారెడ్డికి వచి్చన తండ్రి కూతురు కీర్తనతోపాటు ఇద్దరు మనుమళ్లను వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామమైన లచ్చపేటకు వెళ్తుండగా.. లచ్చపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తాతతోపాటు ఇద్దరు చిన్నారులు గాయాలకు గురయ్యారు. అమ్మా.. లేమ్మా.. గాయపడ్డ చిన్నారులు తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. లేమ్మా.. అంటూ తట్టి లేపడం అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి రోదనలు కట్టతడి పెట్టించాయి. కీర్తన మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు గల్ఫ్లో ఉన్న మహేందర్కు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి రాజన్నపేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ముక్క శంకర్ వెళ్లి క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తెరపై ఒక్కసారి కనిపించకున్నా...లేడీ సూపర్ స్టారే...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సీతార ఘట్టమనేని(Sitara Ghattamaneni) పేరు ఇప్పుడు ప్రకటనల ప్రపంచంలో మార్మోగుతోంది. అయితే ఓ అగ్రనటుడి కుమార్తెగానో లేక బాల నటిగానో కాదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన యాడ్ ఫేస్గా ఆమె సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసడర్గా, యాడ్ మోడల్గా ఆమె చూపిస్తున్న టాలెంట్కు సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఆమె వయస్సు కేవలం 11 ఏళ్లు మాత్రమే అయినా, చూపే ప్రొఫెషనలిజం, కెమెరా ముందు చూపుతున్న కాన్ఫిడెన్స్ చూసి యాడ్ రూపకర్తలు ఆమెవైపు అమితంగా ఆకర్షితులవుతున్నారు.సీతార కెమెరా ముందు మొదటిసారి కనిపించింది ఓ ఫ్యామిలీ యాడ్లో. అందులో తన తల్లి నమ్రత శిరోద్కర్, తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ జ్యూవెలరీ బ్రాండ్ ప్రచారంలో కనిపించింది. ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, బ్రాండ్కు పెద్దగా ప్రాచుర్యం వచ్చింది.అప్పటి నుంచి సీతారకు యాడ్స్ ఆఫర్లు వెల్లువెత్తడం ప్రారంభమైంది. అనుకోకుండా చేసిన యాడ్తో వచ్చిన పాప్యులారిటీతో ఇతర బ్రాండ్లు కూడా ఆమెను సంప్రదించాయి. ఆ తర్వాత ఆమె ‘బేబీ స్కిన్ కేర్‘, ‘ఎడ్యుకేషన్ ప్యాకేజింగ్‘, ‘ఫ్యాషన్‘ వంటి విభాగాల్లో చేసిన యాడ్స్ లక్షల సంఖ్యలో వ్యూస్ ఆదరణ సాధించాయి. పిఎంజె జ్యూయల్స్, ఒట్లో క్లోతింగ్, టాటా సంపన్న్ జూనియర్ ఫుడ్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మామిఎర్త్, జీ తెలుగు ఫ్యామిలీ ప్రోమో, ట్రెండ్స్... ఇలా అనేక టాప్ బ్రాండ్స్లో ఆమె కనిపిస్తోంది. వీటిలో తన డాడీ మహేష్తో కలిసి చేసిన ట్రెండ్స్ సంస్థ యాడ్ నిజంగా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.యాడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, సీతార ఒక్కో యాడ్ కు రూ. 15 – 25 లక్షల వరకు పారితోషికం( Remuneration) అందుకుంటోంది. వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్ల పైగా ఆదాయం వస్తోందని యాడ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఆదాయం ప్రత్యేకంగా ఆమె పేరిట ఓ ట్రస్ట్ ఖాతాలో వేస్తున్నామని, ఈ మొత్తం భవిష్యత్తులో ఆమె విద్య, క్రియేటివ్ అభిరుచుల విస్త్రుతికి ఉపయోగించనున్నట్లు సమాచారం.కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ కావడంతో పాటు అమాయకత్వంతో కూడిన గ్లామర్ సితారకు ప్లస్ అవుతోంది. అలాగే తండ్రి, తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన అభినయ ప్రతిభ కూడా ఆమెకు మరో బలం. ముఖ్యంగా తల్లి నమ్రత శిరోద్కర్ గతంలో మిస్ ఇండియా గా ఉన్నందున, ఫ్యాషన్, కెమెరా నైపుణ్యాల్లో తల్లి గైడెన్స్ ఆమెకు బాగా ఉపయోగపడుతోంది.ఇంతింతై..సితార స్టారై...ఇప్పటికే సితార పేరుతో ఇంటర్నెట్లో ప్రత్యేక ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. ఆమె ఏ వీడియో వదిలినా మిలియన్ల వ్యూస్ వస్తాయి. ప్రస్తుతం తను పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది, అయితే యాడ్ ఫిల్మ్స్ను పేషన్గా తీసుకుంటోందో లేక రేపటి బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రిహార్సల్గా తీసుకుంటుందో గానీ... తెరపై నైపుణ్యం పెరిగే కొద్దీ, ఆమె పెద్ద తెరపై నటిగా అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెను ‘చైల్డ్ లీడ్ రోల్‘లో తీసుకోవాలని కొందరు డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.చిన్న వయసులో పెద్ద నెపథ్యంతో తెరపైకి వచ్చినా, ఆమె చూపిస్తున్న ప్రతిభ మాత్రం పూర్తిగా ఒరిజినల్. ఇదే విధంగా తండ్రి స్టార్ పవర్, తల్లి గైడెన్స్, తన స్వంత ప్రతిభ మేళవిస్తూ సితార కొనసాగితే ఆమె చరిత్ర సృష్టించకుండా అసాధ్యం అనే చెప్పాలి. ఇప్పుడు యాడ్ ప్రపంచంలో చైల్డ్ ఐకాన్ గా ఆమె సృష్టిస్తున్న సందడి చూస్తుంటే, అప్పుడే ఏమైంది? ‘‘ఇంకా చాలా ఉంది చూడడానికి!’’ అనిపించడం మాత్రం ఖాయం. -
సంచలనం.. 2 పరుగులకే టీమ్ ఆలౌట్! అందులో ఓ వైడ్
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ జట్టు కేవలం రెండు పరుగులకు ఆలౌటైంది. ఈ వింత రికార్డుకు ఇంగ్లండ్ మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ వేదికైంది. ఈ లీగ్ మూడో టైర్ డివిజన్లో భాగంగా సోమవారం నార్త్ లండన్ సీసీ 3rd XI, రిచ్మండ్ సీసీ 4th XI జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సీసీ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 426 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. నార్త్ లండన్ బ్యాటర్ డాన్ సిమ్మన్స్(140) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అనంతరం 427 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రిచ్మండ్ సీసీకి ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. నార్త్ లండన్ సీసీ బౌలర్ల ధాటికి రిచ్మండ్ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో రిచ్మండ్ 5.4 ఓవర్లలో కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు పరుగుల స్కోర్లో ఓ వైడ్ కూడా ఉండడం గమనార్హం. రిచ్మండ్ ఇన్నింగ్స్ లో ఏకంగా 9 మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్కు సంబంధించిన స్కోర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.నార్త్ లండన్ బౌలర్లలో మాథ్యూ రాన్సన్ 5 వికెట్లతో ప్రత్యర్ది పతనాన్ని శాసించగా..థామస్ పాటన్ 3 వికెట్లు పడగొట్టారు. లాస్ట్ బ్యాటర్ విక్రమ్ మంగళూరు బ్యాటింగ్ కు రాలేదు. రిచ్మండ్ 2 పరుగులే చేయడంతో నార్త్ లండన్ 424 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్ కిందకు రానుందన ఈ చెత్త రికార్డును పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యల్ప స్కోరు సాధించిన రికార్డు ది బిఎస్ జట్టు పేరు మీద ఉంది. 1810లో లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ది బిస్ కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో ఈ చెత్త రికార్డు న్యూజిలాండ్ జట్టు పేరిట ఉంది. 1955లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కివీస్ జట్టు కేవలం 26 పరుగులకే ఆలౌటైంది. -
ఐఎండీ అలర్ట్.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటకకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో మరో ఐదు రోజులపాటు రెడ్అలర్ట్ అమల్లోనే ఉంటుందని అధికారులు ప్రకటించారు. మంగళూరు సిటీలో చాలా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. దక్షిణ కన్నడ జిల్లాలో కొండప్రాంతాల్లో స్వల్పస్థాయిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి.రెడ్ అలర్ట్ రాష్ట్రాలు: మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటకఆరెంజ్ అలర్ట్ రాష్ట్రాలు: కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలుతెలంగాణ: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలుదక్షిణమధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన మర్నాడే అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ, ఇంకొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. -
ఉపాధి హామీలో షెడ్ల నిర్మాణం
షాబాద్: పాడి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం పశువుల షెడ్లు నిర్మాణానికి ముందుకు వచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని పశు పోషకుల్లో జాబ్ కార్డు కలిగి ఉన్నవారు పశువుల షెడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 8 మంది రైతులు పశువుల షెడ్లు నిర్మించుకున్నారు. గరిష్టంగా పశువుల షెడ్లుకు రూ.85 నుంచి రూ.90 వేల వరకు మంజూరు చేస్తున్నారు. పశువులకు ఎండావానల నుంచి కాపాడుకునేందుకు పాడి రైతుల కు ఇదో చక్కని అవకాశంగా ఉపయోగపడుతుంది. షెడ్లకు బిల్లులు ఇలా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు పశువుల షెడ్ల నిర్మాణం కోసం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. వాస్తవంగా ఐదు నెలల్లో 35 నిర్మించాల్సి ఉన్నప్పటికి 18 మంది రైతులు షెడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. దీని నిర్మాణంలో బేస్మెంట్, లెంటల్, రూఫ్ లెవల్ స్థాయిలు ఉంటాయి. వీటి ఆధారంగా రైతులకు బిల్లులు వస్తాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈజీఎస్ అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శి మొత్తం బిల్లులను లబ్ధిదారులకు అందిస్తారు. కాగా, ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తే బిల్లులు సకాలంలో రావనే ఉద్దేశంతో అనేక మంది రైతులు పశువుల షెడ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. షాబాద్ మండలంలో 90 శాతం మంది అన్నదాతలున్నారు. వారి వద్ద ఎడ్లు, ఆవులు, గేదెలు ఉన్నాయి. వారికి షెడ్లు అవసరమే కానీ ఆర్థిక ఇబ్బందులు వల్ల కూడా అనేక మంది ముందుకు రావడం లేదు. జాబ్కార్డు, తెల్లరేషన్కార్డు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఉపాధి జాబ్ కార్డుతోపాటు తెల్లరేషన్ కార్డులు కలిగి ఉండాలి. ఐదెకరాల కంటే తక్కువగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హుల. ఆవులు, ఎద్దులు, గేదెలు మూడుకన్నా ఎక్కువగా ఉండాలి. కోళ్లు అయితే 50 కన్నా ఎక్కువగా ఉండాలి. పశువుల షెడ్డు అవసరమని గ్రామ పంచాయతీ నుంచి అనుమతి, పశువులు కలిగి ఉన్నట్లు పశువైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. తెల్లరేషన్ కార్డు, జాబ్కార్డు, పంచాయతీ అనుమతి పత్రం, పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రాలతో ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పాడి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్న అధికారులు రైతులు వినియోగించుకోవాలి పాడి రైతులకు పశువుల షెడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి పశువుల షెడ్లు మంజూరు చేస్తాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నిర్మాణ దశలను బట్టి బిల్లులు అందజేస్తాం. – వీరాసింగ్, ఏపీఓ, షాబాద్ -
బాలకృష్ణతో పవన్ పోరు.. వార్ తప్పదు
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ (ఓజీ), బాలకృష్ణ (అఖండ 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మొదటిసారి పవన్తో బాలయ్య పోటీ పడనున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి బాక్సాఫీస్ లెక్కలపై చర్చ జరగనుంది. దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సాహో'(Saaho) సినిమా తర్వాత ఆరేళ్లకు దర్శకుడు సుజిత్ (Sujith) తెరకెక్కిస్తున్న చిత్రం 'ఓజీ'.. పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్గా ఈ చిత్రం రానుంది. దీంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా మంచి అంచనాలే పెట్టుకున్నారు. మరోవైపు అఖండకు సీక్వెల్గా బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో అఖండ2 రానుంది. ఇప్పుడు రెండు సినిమాలు ఒకేరోజున విడుదల కానున్నట్లు ప్రకటన రావడంతో కలెక్షన్స్ పరంగా ఇద్దరికీ నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త (Samyuktha) నటిస్తోంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ చరిత్రలో భారీ అంచనాల మధ్య ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి.'ఓజీ' సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్తో నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పవన్ కల్యాణ్ కొంత కాలంగా ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో మొదట అనుకున్న బడ్జెట్ కాస్త పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా ఓజీ నిర్మాణం కోసం రూ. 250 కోట్లు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు అఖండ2 కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ చిత్రం కూడా రూ. 200 కోట్లతో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇలా అత్యంత బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాలు ఒకేరోజు విడుదలైతే తప్పకుండా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావచ్చు. -
ముందస్తు నైరుతి ఎందుకంటే..!
రుతుపవనాల రాక కోసం కర్షకుడు ఆకాశంకేసి కళ్లు కాయలు కాచేలా చూస్తాడు. హలధారితో దోబూచులాడే రుతుపవనాలు ఈసారి రైతన్నలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఆగమేఘాల మీద దూసుకొచ్చి వర్షాలను దంచికొడుతున్నాయి. అడవుల నరికివేత, యథేచ్ఛగా సాగుతున్న మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం తదితరాలతో వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ సంభవించిన కారణంగానే రుతుపవనాలు ఇలా ముందుగా వచ్చేశాయని ఎన్నో విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఇలా ముందస్తు వర్షాలు గతంలో సర్వసాధారణమని వాదించే వాళ్లూ ఉన్నారు. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ముందస్తు రాకకు కారణాలేంటి అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. గతంలోనూ ముందొచ్చాయి కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఊరకే రాష్ట్రాలను చుట్టేయకుండా భారీ వర్షాలతో పలకరించి ఈసారి అధిక వర్షాలు ఖాయమని కబురును రుతుపవనాలు మోసుకొచ్చాయి. అయితే ఇలా ముందస్తు రాక కొత్తేమీ కాదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈసారి పలు రాష్ట్రాల్లోకి రెండు వారాల ముందే రుతుపవనాలు ప్రవేశించడంతోపాటు కేరళ నుంచి మహారాష్ట్రదాకా అవి వేగంగా, విస్తారంగా మే 24న ఒక్కరోజులోనే విస్తరించడం విశేషం. ఇది అసాధారణమేమీ కాదని, కేవలం అరుదైన విషయమని గణాంకాలు చాటుతున్నాయి. 1971 ఏడాదిలోనూ రుతుపవనాలు కర్ణాటకలో అధిక భాగం, మహారాష్ట్రలో కొంత మేర ఒకేసారి విస్తరించి అప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. మళ్లీ దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఇదే తరహాలో రుతుపవనాలు ఒకేసారి విస్తరించాయి. ఆ తర్వాత కాస్తంత బ్రేక్ జూన్ రెండో తేదీదాకా రుతుపవనాలు ఇదే వేగంతో విస్తరిస్తాయని వాతావరణ శాఖ వర్గాలు అంచనావేస్తున్నాయి. మహారాష్ట్ర, తూర్పు భారతాన్ని త్వరగా చుట్టుముట్టాక వేగం తగ్గే వీలుంది. గతంలో మాది రే వేగం నెమ్మదించి మెల్లిగా రుతుపవనాలు ముందుకు సాగనున్నాయి. మధ్య స్థాయి ఎత్తులో పొడి వాతావరణం ఏర్పడటంతో జూన్ మొదటి వా రం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తరచూ వర్షాలు పడే అవకాశాలు సన్నగిల్లుతాయి. రుతుపవనాల గమన వేగం సైతం తగ్గనుంది. ముందస్తుపై వాతావరణ మార్పుల ప్రభావం సహజ వాతావరణ వ్యవస్థతోపాటు మానవ ప్రేరేపిత భూతాపోన్నతి, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు వంటి అంశాలూ రుతుపవనాలపై ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే భారత్లో రుతుపవనాల రాకపై వాతావరణ మార్పుల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉందని వారు అభిప్రాయపడ్డారు. భూతాపోన్నతి దెబ్బకు యురేసియా, హిమాలయ ప్రాంతాల్లో మంచు దుప్పటి కరిగిపోతోంది. 1990–2020 కాల సగటుతో పోలిస్తే ప్రస్తుతం యురేసియా, హిమాలయాల పరిధిలో మంచు 15 శాతం అంతరించిపోయింది. తక్కువ మంచు కారణంగా ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో రుతుపవనాలు ప్రేరేపితమై త్వరగా వస్తాయి. ఒక్కోసారి మే నెల మధ్యలోనే ఇవి రావొచ్చు. గ్లోబ ల్ వార్మింగ్లో పెరిగే ప్రతి ఒక్క డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు సముద్రాలపై వాతావరణంలో తేమ 6–8 శాతం పెరుగుతుంది. పారిశ్రామిక విప్లవానికి ముందునాటితో పోలిస్తే 2025లో ఉష్ణోగ్రత 1.2 డిగ్రీ సెల్సియస్ పెరిగిందని ఇప్పటికే గణాంకాలు చాటుతున్నాయి.ఈ నేపథ్యంలో అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం ఉపరితల వాతావరణంలో తేమ పెరిగి మే నెలలోనే మేఘాల అధిక ఆవిర్భావానికి దారితీసింది. కర్ణాటక–గోవా తీరం వెంట ద్రోణి కారణంగా తుపాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి ఈసారి రుతుపవనాలను మరింత ముందుకు లాగాయి. మారిషస్, మడగాస్కర్ల మధ్య తక్కువ ఎత్తులో వీచే పవనాల దృగ్విషియాన్ని సోమాలీ జెట్గా పిలుస్తారు. ఇది ఈనెలలోనే విజృంభించింది. ఈ గాలులు అరేబియా సముద్రం మీదుగా భారత పశి్చమ తీరం వైపు వీస్తాయి. ఇవి కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలనూ తాకుతాయి. ఈసారి సోమాలీ జెట్ గాలుల ప్రభావం తోడవడంతో నైరుతి పవనాలు త్వరగా వచ్చేశాయి. మరెన్నో కారణాలు.. భౌగోళిక, సముద్ర, వాతావరణ పరిస్థితుల మధ్య సమన్వయంలో తేడా సైతం ఈసారి రుతుపవనాల ఆగమనాన్ని ముందుకు తోసింది. భూమధ్యరేఖ జోన్లో ప్రతి 30 నుంచి 60 రోజులకు ఒకసారి సముద్రజలాల మీదుగా మేఘాలు, వర్షాలు, పవనాలు ఒక క్రమపద్దతిలో ముందుకు సాగుతాయి. దీనినే మేడిన్ జూలియన్ ఆసిలేషన్(ఎంజేఓ)గా పిలుస్తారు. ఎంజేఓ అనేది రుతుపవనాల్లో తేమ, పొడి దశలను నిర్దేశిస్తుంది. ఈనెలలో ఎంజేఓ మూడో దశలోఉంది. ఇది మేఘావృత స్థితిని అధికం చేసి దక్షిణభారతంలో వర్షాలను కురిపిస్తుంది. మే 25వ తేదీన ఇది నాలుగోదశకు మారడంతో హిందూ సముద్రం నుంచి మరింత తేమ పవనాల రూపంలో భారత్పై కురిసింది. ఈసారి ఎల్నినో సైతం తటస్థ వైఖరిని ప్రదర్శించడంతో రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అందుకే ఈసారి వర్షాలు ముందే పడ్డాయి. – సాక్షి, నేషనల్ డెస్క్