-
ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..
దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్. జారీ చేసినప్పటి నుంచి వీటిని ఇంత వరకూ అప్డేట్ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలి. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)అవకాశం కల్పించింది. ఇందుకోసం గతేడాది గడువును విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ 14 వరకు గడువు విధించారు. ఆ తర్వాత రూ .50 రుసుమును చెల్లించి ఆధార్ కేంద్రాల వద్ద అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపు రుజువు (పీఓఐ), చిరునామా రుజువు (పీఓఏ) అప్డేట్ చేసుకోవాలి. రెగ్యులర్ అప్డేట్లు ఆధార్ లోని సమాచారం, ప్రస్తుత డాక్యుమెంటేషన్కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి.ఆధార్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పొందేటప్పుడు, బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైన కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఆధార్ సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవడం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులకు వీలవుతుంది. తద్వారా దుర్వినియోగాలు, మోసాలు నివారించడంతోపాటు ప్రజా సేవల్లో జాప్యాలు, తిరస్కరణలను తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది.ఆన్లైన్లో ఏమేమి అప్డేట్ చేయవచ్చు?ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని యూఐడీఏఐ అందిస్తున్నప్పటికీ, ఆధార్లోని కొన్ని రకాల వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. యూఐడీఏఐ ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అనుమతిస్తోంది. అవి ఏమిటంటే..🔹పేరు (చిన్న మార్పులు చేసుకోవచ్చు)🔹పుట్టిన తేదీ (కొన్ని పరిమితులున్నాయి)🔹చిరునామా🔹జెండర్🔹భాష ప్రాధాన్యతలుబయోమెట్రిక్ సమాచారం మారదుఆన్లైన్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్డేట్ చేసేందుకు వీలులేదు. ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ (కనుపాప) స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే, భౌతికంగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధ్రువీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద మాత్రమే ఉన్నాయి.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఇలా..👉అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ను సందర్శించండి.👉"లాగిన్" బటన్ పై క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.👉రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి దానిని నమోదు చేయండి.👉లాగిన్ అయిన తర్వాత పేజీ పై కుడివైపున ఉన్న 'డాక్యుమెంట్ అప్డేట్'పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ప్రస్తుత గుర్తింపు రుజువు, చిరునామా రుజువును ధ్రువీకరించి అప్డేట్ చేస్తారు.👉డ్రాప్డౌన్ మెనూ నుంచి తగిన డాక్యుమెంట్ రకాలను ఎంచుకుని స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఫైళ్లు JPEG, PNG లేదా PDF ఫార్మాట్ లో, 2MB కంటే తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోండి.👉వివరాలన్నీ సరిచూసుకుని డాక్యుమెంట్ లను సబ్మిట్ చేయండి. తర్వాత మీకొక సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు (SRN) వస్తుంది. దీనితో అప్డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
రాష్ట్రంలో తగ్గిన ఉపాధి హామీ పనిదినాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అమలైన తీరుపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పథకంలో పాల్గొనే కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా వారికి అందుతున్న పనిదినాలు మాత్రం తగ్గిపోతున్నాయి. లిబ్టెక్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ట్రాకర్ 2024–25’ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పలుచోట్ల అభివృద్ధి కనిపించినా కీలకాంశాల్లో మందగమనమే కనిపిస్తోంది.సగటు పనిదినాల్లో క్షీణత.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన ప్రత్యేక కుటుంబాల సంఖ్య జాతీయ స్థాయిలో 3.5% తగ్గుదల నమోదవగా తెలంగాణలో మాత్రం 5.3% పెరుగుదల నమోదైంది. ఈ సంఖ్య 25.33 లక్షల నుంచి 26.68 లక్షలకు పెరిగింది. అదే సమయంలో ప్రతి ఇంటికి సగటు పనిదినాలు 47.7 నుంచి 45.8కి తగ్గాయి. వంద రోజుల పని పూర్తిచేసే కుటుంబాలు 31% తగ్గాయి. ఇది జాతీయ క్షీణత కంటే మూడురెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వ్యక్తిగత పనుల్లో 7% తగ్గుదల నమోదవగా తెలంగాణలో మాత్రం మొత్తం ఉద్యోగ దినాలు 1.1% పెరిగాయి. గతేడాదితో పోలిస్తే సంవత్సర ప్రారంభంలో పెరుగుదల నమోదైంది. వ్యక్తిగత పనిదినాల్లో 2024 ఏప్రిల్, మే నెలల్లో 88%, 35% వృద్ధి నమోదైన తర్వాత తగ్గుదల కనిపించింది.వేతన నష్టం..గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతన రేటు రూ. 272 నుంచి రూ. 300కు పెంచినట్లు ప్రకటించినప్పటికీ కార్మికులు రోజుకు సగటున రూ. 213 మాత్రమే పొందారు. కార్మికులకు అంచనా వేసిన వేతన నష్టం రూ.1,059 కోట్లుగా ఉంది. కాగా ఈ పథకం నుంచి గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది కార్మికులు ఎంజిఎన్ఆర్ఇజీఏ జాబితా నుంచి తొలగించబడ్డారు. ఇతర రాష్ట్రాలు తిరిగి కార్మికులను చేర్చుకొనే ప్రక్రియలు చేపడుతున్నా తెలంగాణలో మాత్రం ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. తప్పుగా తొలగించిన లబి్ధదారులను పునరుద్ధరించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది.జిల్లాలవారీగా చూస్తే..గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 32 జిల్లాల్లో 17 జిల్లాలు పెరిగిన ఉద్యోగ దినాలను నమోదు చేశాయి. ములుగు జిల్లాలో 36.5%, కామారెడ్డి జిల్లాలో 24.6%, వరంగల్ జిల్లాలో 23.7% అత్యధిక పెరుగుదల నమోదవగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో –25.3%, సంగారెడ్డి జిల్లాలో –19.2%, మహబూబాబాద్ జిల్లాలో–18.1% అత్యధిక తగ్గుదల నమోదైంది. గ్రామీణ పనులకు డిమాండ్ ఉన్నప్పటికీ పాలనాపరమైన అడ్డంకులు, వేతనంలో తగ్గుదల, మినహాయింపులు తెలంగాణలో పథకం లక్ష్యాలను బలహీనపరుస్తున్నాయని నివేదిక పేర్కొంది.నివేదికలోని ప్రధానాంశాలు⇒ ఉపాధి హామీ పథకంలో పాల్గొన్న కుటుంబాలు: 25.33 లక్షల నుంచి 26.68 లక్షలకు పెరిగాయి (5.3%) ⇒ పనిదినాల సగటు: 47.71 నుంచి 45.80కి తగ్గింది ⇒ 100 రోజుల ఉద్యోగం పూర్తి చేసిన కుటుంబాలు: 1.35 లక్షల నుంచి 0.93 లక్షలకు తగ్గింది. (–31.1%) ⇒ ప్రభుత్వం ప్రకటించిన వేతనం: రూ.300, కానీ వాస్తవంగా అందినది రూ.213 మాత్రమే ⇒ వేతన లోటు: రూ.1,059 కోట్లు (40.6%) ⇒ కార్మికుల తొలగింపులు: గత మూడేళ్లలో 21 లక్షల మంది తొలగింపు ⇒ రాష్ట్రం నూతన జాబ్కార్డుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. -
కష్టాలకు బెదిరిపోవద్దు...ఈ ఐదు సూత్రాలు తెలుసుకోండి!
కొందరు సమస్యలను చూసి పెద్దగా టెన్షన్ పడరు. వాటిని తేలికగా ఎదుర్కొని పరిష్కరిస్తారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా అనుకుంటారు. అటువంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఐదు విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఎవరైనా తెలివితేటలను ఉపయోగించి సమస్య నుంచి బయటపడితే వారిని అపర చాణక్యుడు అని అంటాం. ఎందుకంటే భారతీయులలో చాణక్యుడికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే చాణక్యుడు గొప్ప సలహాదారు, వ్యూహకర్త, తత్వవేత్త. అలాగే వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉన్నవాడు. ఆయన జీవితంలో ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని నీతి సూత్రాలు బోధించాడు. అందులో కష్టాల్లో ఉన్నపుడు ఎలా మసులుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.పక్కా ప్లానింగ్...ఎవరినైనా సరే, సమస్యలు, సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటినుంచి తప్పించుకుని తిరగాలని చూడకూడదు. వాటిని ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకుని ఉండాలి. అప్పటికప్పుడు ఆలోచించడం కాకుండా తగిన ప్లానింగ్తో ఉంటే ఆ సమస్య నుంచి తేలికగా బయటపడగలరు. సంసిద్ధత...చాణక్యుడు ఏం చెబుతాడంటే ఎవరైనా సరే, కష్టాలు వచ్చినప్పుడు బెంబేలత్తకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని కష్టాలు చుట్టిముట్టినపుడు సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ముందే ఊహించి వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. దీనినే కీడెంచి మేలెంచడం అంటారు. సమస్య నుంచి పారిపోవడం కంటే కూడా దానిని ఎదుర్కొనేలా ఎవరికి వారు సంసిద్ధంగా ఉండాలి. చదవండి : ఆటో డ్రైవర్గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారుఓర్పు, నేర్పు...చాణక్య విధానం ప్రకారం, ఎవరూ కూడా తన ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎప్పుడూ సహనం కోల్పోకూడదు. ఎప్పుడూ సానుకూల కోణంలో ఆలోచించాలి. మరీ ముఖ్యంగా, ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఓపిక పట్టాలి. నేర్పుతో దానిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. పరిస్థితి ఏమైనప్పటికీ, ఆ సమయంలో సహనం కోల్పోకండా మంచి రోజులు వచ్చే వరకు ప్రశాంతంగా వేచి ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుందికుటుంబ సభ్యుల సంరక్షణ...చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కుటుంబ పెద్ద లేదా కుటుంబ సభ్యుల మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంరక్షిస్తూనే, వారికి ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు దానినుంచి బయట పడేసేందుకు చర్యలు తీసుకోవడం అవసరం. డబ్బు ఆదాపై దృష్టి పెట్టడం...ఎల్లప్పుడూ డబ్బును ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సూత్రాన్ని చాణక్యుడు దేశ కోశాగారం కోసం చెప్పినప్పటికీ అది మన ఇంటి కోశానికి కూడా పని చేస్తుంది. పై సూత్రాలను మనసులో పెట్టుకుని వాటి ప్రకారం కుటుంబాన్ని నడిపించుకుంటే మనం కూడా అపర చాణక్యులమవుతాం. చాణక్యుడిని గొప్ప వ్యూహకర్త అంటారు. ఎందుకంటే భారత రాజకీయాలు, చరిత్ర దిశను మార్చడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారు. తన జీవితకాలంలో ఆయన విధాన సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మానవ స్వభావం, జీవితం గురించి ఆయన చెప్పిన సిద్ధాంతాలు నేటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి -
మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్చేస్తే..
ఆరుపదుల వయసులో కేన్సర్ నిర్థారణ అయ్యింది. మూడు నెలలకు మించి బతికే అవకాశం లేదన్నారు. అలాంటి వ్యక్తి ఏకంగా 102 ఏళ్లు బతకడమేగాక మారథాన్లలో రికార్డులు సృష్టించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేగాదు తన దీర్ఘాయువు రహస్యం గురించి చెప్పడమే పర్యావరణ పరిరక్షకుడి తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అతడెవరు..? ఎలా అన్నేళ్లు బతికి బట్టగట్టగలిగాడంటే..ఫ్లోరిడాకు చెందిన 102 ఏళ్ల మైక్ ఫ్రీమాంట్ మారథాన్లో ఎన్నో వరల్డ్ రికార్డులు సాధించాడు. అంతేగాదు వేగంగా మారథాన్ చేసిన 91 ఏళ్ల వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా మారథాన్, హాఫ్ మారథాన్, కనోయింగ్ క్రీడా తదితరాలకు సంబంధించి అనేక ప్రపంచ రికార్డులు కలిగి ఉన్నాడు. నిజానికి మైక్ 60 ఏళ్ల వయసులో కేన్సర్ బారినపడ్డాడు. మహా అయితే మూడు నెలలకు మించి బతకడని తేల్చి చెప్పేశారు వైద్యులు. మరోవైపు ఆర్థరైటీస్ సమస్యలు కూడా ఉన్నాయతనికి. అప్పడే మైక్ తన ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని స్ట్రాంగ్ డిసైడయ్యాడు. ఆ నేపథ్యంలో కేన్సర్ని నివారించే ఆహారాల గురించి సవివరంగా తెలుసుకున్నాడు. దీర్ఘాయువుకి కీలకం ఆహారమే..అలా మైక్ పూర్తిగా మొక్కల ఆధారిత డైట్కి మారాడు. పూర్తిగా తాజా కూరగాయాలు, ఓట్మీల్ సిరప్, బ్లూబెర్రీస్, బీన్స్, బ్రోకలీ, తాజా పండ్లు తదితరాలను తీసుకునేవాడు. దాంతో రెండున్నర సంవత్సరాల తర్వాత అతడి శరీరంలో ఎలాంటి కేన్సర్ కణాలు లేవని వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడే అతనికి తెలిసింది ఆరోగ్యానికి కీలకమైనది తీసుకునే పోషకవంతమైన ఆహరమని. ఒత్తిడి మత్యు ఒడికి చేర్చేది..ఒత్తిడి మనల్ని మరణం అంచులకు తీసుకువెళ్తుందని అంటాడు. అందుకే తాను ఒత్తిడి దరిచేరనివ్వని జీవితాన్ని ఆస్వాదిస్తానన్నాడు. అంతేగాదు ఒత్తిడి సంబంధిత రుగ్మతలు ఎలా మరణ ప్రమాదాన్ని పెంచుతాయో కూడా చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేని ప్రశాంత జీవితానికే ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు మైక్. కసరత్తులు..మైక్ మునుపటి వ్యాయామ నియమావళి ప్రకారం.. వారానికి మూడు సార్లు 10 మైళ్లు పరిగెత్తేవాడు. కానీ ఇప్పుడు..వారానికి మూడు సార్లు 5 మైళ్లు పరిగెత్తేలా కుదించాడు. బాగా వేడిగా వాతావరణం ఉంటే..కనోయింగ్ వంటివి చేస్తాడు..అంటే బోటింగ్ లాంటి ప్రక్రియ ఇది కూడా ఒకవిధమైన క్రీడ, పైగా వ్యాయామానికి ఒక కసరత్తులాంటిది. దుఃఖాన్ని అధిగమించేందుకు..తన మొదటి భార్య రక్తస్రావం కారణంగా చనిపోయిందట. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు 36 ఏళ్ల వయసులో పరుగుని ప్రారంభించాడట. దుఃఖాన్ని ఎదుర్కోవడానికి వ్యాయామం మంచి మార్గం అని అంటాడు. అకాల మరణాలతో ..అలాగే కాలేయ కేన్సర్తో 69 ఏళ్ల తండ్రి, 70 ఏళ్ల వయసులో గుండెపోటుతో తల్లి మరణించటంతో ఆహారం, వ్యాయామాల్లో మార్పులు చేసుకున్నాని..అదే ఇన్నేళ్లు ఆరోగ్యంగా బతికేందుకు దోహదపడిందని అన్నారు. దీర్ఘాయువుకి కారణం..తాను వాతావరణ కార్యకర్తగా పనిచేస్తుంటానని అన్నారు మైక్. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత భూమిని అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నానని అన్నారు. ఆ ఆకాంక్ష వందేళ్లు పైగా ఆరోగ్యంగా బతికేందుకు కారణమైందని అన్నారు. సత్సంబంధాలను కలిగి ఉండటం..మైక్ వారానికి మూడుసార్లు తన స్నేహితులతో కలిసి మారథాన్కి వెళ్తుంటాడట. అలాగే వృద్ధుల కమ్యూనిటీ గ్రూప్లో కూడా ఒక మెంబర్. అప్పుడప్పుడూ వారితో కలిసి సంభాషిస్తూ ఉంటాడట. దీంతోపాటు తన భార్య, బంధువులతో కూడ కొంత టైం స్పెండ్ చేస్తాడట. ఈ సత్సంబంధాలే మనల్ని మరింత కాలం భూమిపై జీవించేలా చేస్తాయని అంటాడు మైక్.(చదవండి: అమీర్ఖాన్ స్ట్రిక్ట్ డైట్ రూల్స్..! విస్తుపోయిన్ షారుఖ్ దంపతులు..) -
హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..
‘కొనేటప్పుడు తక్కువకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువకు పోవాలి’ అని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే రాబడి ఎక్కువగా ఉన్న చోట కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువ రాబడి వస్తుందని ఓ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి ఏటా స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తుందని పేర్కొంది. - సాక్షి, సిటీబ్యూరోస్థలాల కొరతే కారణం.. పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఓ సంస్థ సీఈఓ తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం,అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని ఓ సంస్థ రీసెర్చ్ హెడ్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసిక కాలంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ. 2018–21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్ చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్బల్లాపూర్, హోస్కేట్, కొంబల్గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 🔸2018–21 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్ప్రెస్వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్లోనే నో ఛాన్స్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లను తిరిగి పిలుపునిచ్చింది. అయితే ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో ఎంపిక చేసిన ఈ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో అయ్యర్ దేశవాళీ క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలోనూ శ్రేయస్ది కీలక పాత్ర.అదేవిధంగా 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్ కేవలం ఏడు ఇన్నింగ్స్లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. అయ్యర్ ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతున్నాడు. ఐపీఎల్-2025లో కెప్టెన్గా, ఆటగాడిగా ఈ ముంబై బ్యాటర్ అదరగొడుతున్నాడు. అయితే గతేడాది మాత్రం అయ్యర్ టెస్టుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.శ్రేయస్ గత 12 ఇన్నింగ్స్లలో 17 సగటుతో 187 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందుకే సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టి ఫామ్లో ఉన్న కరుణ్ నాయర్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఏదేమైనా ప్రస్తుత ఫామ్ను పరిగణలోకి తీసుకుని అయ్యర్ను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసి ఉంటే బాగుండేంది అని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.అయ్యర్ జట్టులో ఉంటే మిడిలార్డర్ పటిష్టంగా ఉంటుందని మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ అభిమానులైతే ఒకడుగు ముందుకు వేసి సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కెప్టెన్ కావాల్సిన ఆటగాడికి పూర్తిగా జట్టులోనే ఛాన్స్ ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 5 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ ఉంది.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్.. అధికారిక ప్రకటన -
గ్యాంగ్రేప్ నిందితులకు బెయిల్.. కార్లు, బైకులతో విజయోత్సవ ర్యాలీ
సాక్షి,బెంగళూరు: ఓ మహిళపై సామూహిక అత్యాచారం. ఆపై జైలు శిక్ష, బెయిల్పై విడుదల. ఈ తరహా దారుణాల నిందితులు చేసిన తప్పుకు పశ్చాతాపానికి గురవుతుంటారు. సమాజంలో తిరగలేక సిగ్గుతో తలదించుకుంటుంటారు. కానీ కర్ణాటక కేసు నిందితులు అందుకు భిన్నంగా వ్యవహించారు. బెయిల్ రావడంతో బైక్, కార్లలో తిరుగుతూ విజయోత్సవ ర్యాలీలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల,గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్, మదర్ సాబ్, సమీవుల్లా, మొహమ్మద్ సాదిక్, తౌసీఫ్, రియాజ్, షోయిబ్లకు కర్ణాటక హవేరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం, చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. SHOCKING 🚨 7 Gang rape accused take out road show after securing BAIL in Karnataka's Haveri. Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/pNMF21YXJy— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. 2024 జనవరి 8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగర్కు చెందిన ఓ హోటల్ గదిలో దారుణం జరిగింది. నిందితులు హోటల్ గదిలోకి చొరబడి ఓ జంటపై దాడి చేశారు. అనంతరం బాధితురాల్ని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తాజాగా, ఆ కేసులో ఏడుగురు ప్రధాన నిందితలు బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ రావడంపై నిందితులు హవేరి జిల్లా అక్కి అలూరు పట్టణంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్లు, కార్లు, డీజే మ్యూజిక్తో కూడిన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిరునవ్వుతో చేతులు ఊపుతూ, విజయోత్సవ సంకేతాలిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. బాధితురాలు ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు. ఆమె కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేసే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడితో కలిసి 2024 జనవరి 8న హనగల్కు చెందిన ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. అయితే జనవరి 11న న్యాయమూర్తి ఎదుట బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ అయ్యారు. వీరిలో 12 మందిని దాదాపు 10 నెలల క్రితమే బెయిల్పై విడుదల చేశారు. కానీ, ఏడుగురు ప్రధాన నిందితులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆ ఏడుగురికి న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో నిందితులు బైక్లు,కార్లలో ర్యాలీతో సంబరాలు చేసుకున్నారు.ఈ ఘటనపై నెటిజన్లు, స్థానికులు.. న్యాయం గెలవాలన్న ఆశతో బాధితురాలు ఎదురుచూస్తున్న సమయంలో నిందితులు చేసిన విజయోత్సవాల ర్యాలీ బాధితురాలిని మరింత మానసికంగా దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. -
విస్తరణ లేదు.. వంతెన రాదు!
అబ్దుల్లాపూర్మెట్: పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా విజయవాడ జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలని వచ్చిన ప్రతిపాదనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. విస్తరణకు పచ్చజెండా ఊపింది. ఏడాదిన్నర పాటుగా పనులు కొనసాగుతున్నాయి. తుది దశకు చేరుకున్నాయి. కానీ మధ్యలో ఉన్న అబ్బుల్లాపూర్మెట్ కూడలిని విస్మరించారు. విస్తరణ చేస్తారో? పై వంతెనలు నిర్మిస్తారో తెలియదు కానీ.. ఏళ్లు గడుస్తున్నా రహదారి విస్తరణ పనుల్లో స్పష్టత రావడం లేదు. చౌరస్తాలో ఇక్కట్లు ఎల్బీనగర్ నుంచి దండుమల్కాపూర్ వరకూ 24 కిలో మీటర్ల రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల విస్తరణ పనులకు రూ.600 కోట్లను కేంద్రంమంజూరు చేసింది. కోవిడ్, గుత్తెదారుల సమస్యలతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతూ.. నిర్విరామంగా కొనసాగింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. హయత్నగర్ చివరి నుంచి దండుమల్కాపూర్ వరకూ రోడ్డు పనులు పూర్తి అయినప్పటికీ, అబ్దుల్లాపూర్మెట్ కూడలిలో సుమారు రెండు కిలో మీటర్ల విస్తరణ పనులు చేపట్టలేదు. దీంతో చౌటుప్పల్ వైపు నుంచి హైదరాబాద్కు, నగరం నుంచి చౌటుప్పల్కు వెళ్లే వాహన దారులు.. అబ్దుల్లాపూర్మెట్ కూడలిలో ఇబ్బంది పడుతున్నారు. ఇరుకుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ జాం అవుతోంది. వాహనాల రద్దీ.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిత్యం రద్దీగా ఉండే విజయవాడ జాతీయ రహదారిపై చేపడుతున్న పనుల్లో 8 ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాల్లో పై వంతెనలు పూర్తయ్యాయి. ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ రోడ్డు విస్తరణలో వనస్థలిపురం పనామా కూడలి వద్ద, హయత్నగర్లో కుంట్లూర్ రోడ్డు వద్ద, అబ్దుల్లాపూర్మెట్ కూడలిలో ఘట్కేసర్ రోడ్డు, అనాజ్పూర్ రోడ్డు వద్ద మినహా.. పెద్దఅంబర్పేటలో పసుమాముల రోడ్డు, కొహెడ రోడ్డు వద్ద,ఇనాంగూడ, బాటసింగారం కూడళ్ల వద్ద బ్రిడ్జిలు పూర్తి కాగా.. వాహనాల రాకపోకలకు అనుమతించారు. అబ్దుల్లాపూర్మెట్లో గండిమైసమ్మ దేవాలయం నుంచి మయూరి కాంట వరకు రెండు వైపులా నిలిచిన రోడ్డు విస్తరణ చేపడితే.. 24 కిలోమీటర్ల రహదారి విస్తరణ పూర్తవుతుందని, అప్పుడు కూడలిలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోతాయని స్థానికులు పేర్కొంటున్నారు. అభివృద్ధికి నోచుకోని కూడలి ఇరుకు రోడ్డుతో వాహనదారుల ఇబ్బంది మూడు వరుసలతో హైవే నిర్మాణం పూర్తి అబ్దుల్లాపూర్మెట్లో నిలిచిన పనులు -
మహానాడుకు వస్తే ఎకరం పొలం!
తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలప్పుడు జన సమీకరణకు తలా ఒక బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్, పచ్చనోట్లు ఇవ్వడం ఇంతవరకు చూశాం. కానీ, ఇప్పుడు ఏకంగా భూములే ఇచ్చేస్తామంటున్నారు. అధికారం చేతిలో ఉందనే తెగింపుతో మహానాడుకు వస్తే ఎకరం పొలం లీజుకిస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడీ ఆఫర్ టీడీపీ నేతల మధ్య హాట్టాపిక్గా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజా రావువేంకట కుమారమహీపతి సూర్యారావు బహద్దూర్ 513 ఎకరాలు దానం చేయగా.. దేవదాయశాఖ పరిధిలో ఉన్న ఈ విలువైన భూములను ఇప్పుడు అప్పనంగా దోచిపెట్టేందుకు టీడీపీ మహానాడును సాకుగా వాడుకుంటున్నారు. వచ్చేవారం కడపలో జరిగే మహానాడు ఆహ్వాన కమిటీ సభ్యుల్లో ఒకరైన టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సొంత ఇలాకా తునిలో తెలుగుదేశం నేతలు ఈ భూ పందేరానికి తెరతీశారు. మహానాడుకు సిద్ధపడి వచ్చేవారి పేరు, ఆధార్ నంబరు వంటి వాటిని సమన్వయం చేసేందుకు ఆరుగురు నేతలతో ఓ ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ మహానాడుకు జనం తరలింపులో సమన్వయం చేసేందుకేనని పైకి చెబుతున్నా.. వాస్తవంగా కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ దేవస్థానానికి చెందిన 508 ఎకరాల సాగు భూములను వేలం వేయకుండా దొడ్డిదారిన తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టే ఎత్తుగడని తునికి చెందిన వారు స్పష్టంగా చెబుతున్నారు. –సాక్షి ప్రతినిధి, కాకినాడజనసమీకరణ కోసం ఎర..అనంతరం.. టీడీపీ నేతలు అసలు కథ మొదలెట్టారు. టీడీపీ మహానాడుకు తుని నియోజకవర్గం నుంచి కనీసం వెయ్యి మందినైనా తీసుకెళ్లాలన్నది ఆ పార్టీ నేతల లక్ష్యం. కానీ, వ్యవసాయ సీజన్ మొదలవుతుండడంతో జన సమీకరణ పెద్ద సమస్యగా మారింది. ఇంతలో ఆ పార్టీ పెద్దలకు ఓ ఐడియా తట్టింది. తమ అనుచరులైన రైతుల పేర్లతో వేలం జరిగినట్లుగా రికార్డులు తయారుచేయాలనేది ప్లాన్. ఇందులో భాగంగా.. ప్రస్తుతం ఈ భూములు సాగుచేస్తున్న రైతులను వేలానికి రాకుండా అడ్డుకుని పోలీసు కేసులతో బెదరగొట్టాలని స్కెచ్వేశారు. ఈ క్రమంలో.. మహానాడుకు వస్తే ఎకరం భూమి లీజుకు ఇస్తామని పార్టీ పెద్దాయన చెప్పారని ద్వితీయశ్రేణి నేతలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పుడు మహానాడుకు వచ్చిన వారికే తిరిగొచ్చాక ఎకరం వంతున లీజుకిచ్చే బాధ్యత తమదంటూ తెలుగు తమ్ముళ్లు తొండంగి పరిసర ప్రాంతాల్లో జనాన్ని సమీకరించడం చర్చనీయాంశంగా మారింది. సత్రం పిఠాపురంలో.. భూములు యనమల ఇలాకాలో..నిజానికి.. శ్రీ సంస్థానం సత్రం పిఠాపురంలో ఉన్నప్పటికీ ఈ భూములు మాత్రం యనమల రామకృష్ణుడు సొంత ఇలాకా తొండంగి మండలంలో ఉన్నాయి. మూడేళ్లకోసారి ఈ భూములకు వేలం వేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. 538, 545, 553, 535, 623, 565, 690 సర్వే నంబర్లలోని ఈ భూముల లీజు గడువు ముగియడంతో ఇటీవల దేవదాయ శాఖ ఈఓ శ్రీరాములు పేరుతో వేలం ప్రకటన విడుదలైంది. దీంతో.. టీడీపీ నేతలు ఈ భూములపై వాలిపోయారు. ఈనెల 23 నుంచి 29 తేదీల మధ్య జరపాల్సిన వేలం ప్రక్రియ జరగకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిలిపివేశారు.రంగంలోకి జనసేన.. ఈ భూముల వ్యవహారం జనసేన నేతల చెవిలో పడింది. శ్రీ సంస్థానం సత్రం కార్యాలయం, కార్యకలాపాలన్నీ పిఠాపురం కేంద్రంగానే జరుగుతున్నాయని.. సత్రం భూములను తుని నియోజకవర్గంలో వారి అనుచరులకు ధారాదత్తం చేయడానికి వారికి అధికారం ఎవరిచ్చారని జనసేన నేతలు రగిలిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సత్రం ఆదాయం కోల్పోతుంటే చూస్తూ ఊరుకుంటామా అని వారు మండిపడుతున్నారు.కొందరి విజ్ఞప్తితోనే వేలం వాయిదా..ఈనెల 23 నుంచి 29 వరకు మొత్తం 508 ఎకరాలకు వేలం వేస్తామని ప్రకటించాం. ఇంతలో.. టీడీపీ మహానాడుకు వెళ్తున్నందున రైతులు అందుబాటులో ఉండటంలేదని, వేలం వాయిదా వేయాలని కొందరు కోరడంతో వేలం వాయిదా వేశాం. ఎప్పుడు వేలం నిర్వహించేది వచ్చేనెల 6 తర్వాత ప్రకటిస్తాం. – నున్న శ్రీరాములు, కార్యనిర్వహణ అధికారి, శ్రీ సంస్థానం సత్రం గ్రూపు దేవాలయాలు, పిఠాపురం, కాకినాడ జిల్లా -
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
దేశ ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో తరచూ భాష వివాదాలు రేగుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న భాషా నేపథ్యాలున్న వారు అక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలవారికి బెంగళూరులో స్థానికుల నుంచి భాషాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ టెక్ ఫౌండర్ తన కంపెనీ కార్యాలయాన్ని పుణెకు తరలించాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు కౌశిక్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్ ఇటీవల చెలరేగిన భాష వివాదంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. భాష వివాదాలతో కన్నడ మాట్లాడలేని తమ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడని, అందుకే బెంగళూరులోని తమ కంపెనీ కార్యాలయాన్ని పుణె తరలించనున్నట్లు తెలిపారు. తమ ఉద్యోగులు లేవనెత్తిన ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, వారి అభిప్రాయాలతో తానూ ఏకీభవిస్తున్నానని చెప్పారు.‘బెంగళూరులోని మా కార్యాలయాన్ని ఆరు నెలల్లో మూసేసి పుణెకు తరలించాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నా. భాష వివాదాలు ఇలాగే కొనసాగుతుంటే కన్నడ మాట్లాడలేని మా ఉద్యోగులు బాధితులు కావడం నాకు ఇష్టం లేదు. ఈ ఆలోచన ఉద్యోగుల ఆందోళల నుంచే వచ్చింది. వారి అభిప్రాయాలతో నేను ఏకీభవించాను’ అంటూ కౌశిక్ ముఖర్జీ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.బెంగళూరులోని చందాపుర ప్రాంతంలోని ఎస్బీఐ బ్రాంచ్లో ఇటీవల మేనేజర్కు, కస్టమర్కు మధ్య భాషా వివాదం తలెత్తింది. మేనేజర్ కన్నడలో మాట్లాడేందుకు నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కన్నడ సంఘాలు, రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. మేనేజర్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదంటూ బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వీడియోను షేర్ చేయగా కౌశిక్ ముఖర్జీ దానికి స్పందిస్తూ పోస్ట్ చేశారు.