
ఎవరికైనా సరే లైఫ్లో అదృష్టం దక్కుతుంది. కాకపోతే వచ్చేంతవరకు ఎదురుచూడాలి.

ఈ హీరోయిన్కి కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లకు లక్ కలిసొచ్చింది.

ఇప్పటివరకు చెప్పింది కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించే.

రుక్మిణిది ఈ రోజు (డిసెంబరు 10) పుట్టినరోజు. 28వ వసంతంలోకి అడుగుపెట్టింది.

ఈ బ్యూటీ బెంగళూరులో పుట్టి పెరిగింది. తండ్రి ఆర్మీలో కల్నల్. తల్లి భరతనాట్యం డ్యాన్సర్.

లండన్లో యాక్టింగ్ కోర్స్ చేసిన తర్వాత తొలి సినిమా కన్నడలో చేసింది.

2019లో రిలీజైన తొలి మూవీ 'బీర్బల్'తో సక్సెస్ అందుకుంది. అదే ఏడాది హిందీలోనూ నటించింది.

దీని తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. గతేడాది 'సప్త సాగరాలు దాటి' (సప్త సాగర ఎల్లో దాచే) రెండు సినిమాలతో హిట్ కొట్టింది.

రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

ఈ మూవీ హిట్ అవ్వడంతో దక్షిణాదిలో రుక్మిణి వసంత్ పేరు మార్మోగిపోయింది.

కానీ రీసెంట్గా ఈమె చేసిన బఘీరా (కన్నడ), అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (తెలుగు) సినిమాలు ప్లాఫ్ అయ్యాయి.

త్వరలో మొదలయ్యే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులోనూ ఈమెని హీరోయిన్ అని అంటున్నారు. చూడాలి మరి ఇది నిజమో కాదో?

ఒక్క ప్రేమకథా మూవీ ఈమెకు ఓవర్ నైట్ స్టారడమ్ తీసుకొచ్చింది కానీ ఆ తర్వాత సరైన మూవీస్ పడట్లేదు!














