సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా మృతి | Sakshi
Sakshi News home page

సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా మృతి

Published Sun, Mar 8 2015 4:20 PM

సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా మృతి - Sakshi

న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు వినోద్ మెహతా కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఏయిమ్స్లో చేరారు. ఏయిమ్స్లో చికిత్స పొందుతూ వినోద్ మెహత ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.

సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పైనీర్, ఔట్‌లుక్ మ్యాగజైన్‌లకు వినోద్ మహతా సంపాదకుడిగా పనిచేశారు. ఐదు దశాబ్ధాల పాటు జర్నలిజంలో విశేష కృషి చేశారు. 1942 మే 31న వినోద్ మెహతా జన్మించారు. నిష్పక్షపాతంగా వార్తలు ప్రచురిస్తారని దేశవ్యాప్తంగా మెహతాకు పేరుంది. వినోద్ మెహతా మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement