రెండు బైక్‌లు ఢీ: వ్యక్తి మృతి | Two bikes accident, one died | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ: వ్యక్తి మృతి

Published Thu, Aug 20 2015 6:39 PM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

వేగంగా వెళ్తున్న రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

కొత్తగూడెం(ఖమ్మం జిల్లా): వేగంగా వెళ్తున్న రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం ఫోర్‌ ఇన్‌క్లేయిన్ చెక్‌పోస్ట్ దగ్గర జరిగింది. వివరాలు.. కొత్తగూడెం నుంచి రుద్రంపూర్ వెళ్తున్న బైక్‌ను కొత్తగూడెం వస్తున్న మరో బైక్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలానికి చెందిన పవన్‌కల్యాణ్(17) అనే పాలిటెక్నిక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరంగల్‌కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన జీవన్‌కుమార్ అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement