- రెండు రాష్ట్రాల ప్రతిపాదిత అంశాలపై ముగిసిన వాదనలు
- విచారణాంశాలపై ఆగస్టు 16న పత్రాలు సమర్పించాలన్న ట్రిబ్యునల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాలపై జరుగుతున్న విచారణను జస్టిస్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 14, 15 తేదీలకు వాయిదా వేసింది.
ఆగస్టు 16లోపు ఈ కేసు విచారణకు సంబంధించి విచారణాంశాలపై అదనపు పత్రాలను ఇరు రాష్ట్రాలు సమర్పిం చాలని ఆదేశించింది. కృష్ణా జలాల పంపిణీలో ఏయే అంశాలను విచారించాలన్న దానిపై ఏపీ, తెలంగాణ సమర్పించిన ముసాయి దాలను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఏపీ 11, తెలంగాణ 16 అంశాలను ప్రతిపా దించాయి. ఏపీ ప్రతిపాదించిన అంశాల్లో ఒకదాన్ని తిరస్కరించిన ట్రిబ్యునల్, తెలంగా ణ సూచించిన అంశాలను పలు సవరణలతో విచారణకు అమోదించింది. వీటిపై సెప్టెంబర్ 13 నుంచి వాదనలు వింటామని పేర్కొంది.
ఏపీపై ఆగ్రహం..
విభజన చట్టంలోని షెడ్యూల్ 11లో పేర్కొన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపాలని ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ కోర డంపై గురువారం విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయిం పులను ఎలా కోరతారని ప్రశ్నించింది. శుక్రవా రం విచారణలో కూడా ఏపీ ఈ అంశాన్ని లేవ నెత్తింది. దీనిపై తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. షెడ్యూల్ 11లో పేర్కొన్న ప్రాజెక్టులకు సెక్షన్– 89తో సంబంధం లేదని వాదించారు. కాగా విభజన చట్టం రూపకల్పనలో దురదృష్టవశా త్తు తప్పులు దొర్లాయని గంగూలీ అన్నారు. సెక్షన్–89లోనే ఈ ప్రాజెక్టుల పేర్లను కూడా పొందుపరిచి ఉండాల్సిందని అభిప్రాయప డ్డారు. ఈ ప్రాజెక్టులన్నీ మిగులు జలాల ఆధా రిత ప్రాజెక్టులని వైద్యనాథన్ పేర్కొన్నారు. మిగులు జలాలు ఉంటే అంధ్రప్రదేశ్ ప్రభు త్వం ప్రకాశం బ్యారేజీ నుంచి వినియో గించుకోవాలి.. కానీ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవాలని ఏపీ యత్నిస్తోందని తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ కల్పించుకొని ఇరు రాష్ట్రాలకు నీటి కేటా యింపుల సమయంలో మిగుల జలాలు ఉంటే షెడ్యూల్ 11లోని ప్రాజెక్టులకు కేటాయింపు లపై అప్పుడు ఆలోచిద్దామని అభిప్రా యపడింది. ఇక కృష్ణా నదీ జలాల యాజ మాన్య బోర్డు 2015లో నీటి నిర్వహణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు చేసిన తాత్కాలిక కేటాయింపులను చట్టబద్ధం చేయాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ తిరస్కరించింది. అనంతరం ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన విచారణాంశాలపై ఆగస్టు 16వ తేదీలోపు అదనపు పత్రాలను సమర్పిం చాలని ఇరు రాష్ట్రాలను ట్రిబ్యునల్ ఆదేశించింది.
కృష్ణా జలాలపై విచారణ సెప్టెంబర్కు వాయిదా
Published Sat, Jul 8 2017 3:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement