సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో అన్న సంజీవని ఫుడ్ క్యాంటీన్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఈ-మహిళను అక్షరాస్యులిగా మార్చాలని, 2019 నాటికి డ్వాక్రా మహిళల్లో నూరు శాతం అక్షరాస్యతను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖపై జరిపిన సమీక్షలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మహిళా నెలసరి ఆదాయం రూ.10 వేలకు పెరగాలన్నారు.
అక్టోబర్ 2 నుంచి మహిళా సాధికార యాత్రలు చేపట్టాలన్నారు. వారికి శిక్షణ ఇచ్చి వారు బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా మారేలా చూడాలన్నారు.
పర్యాటక కేంద్రంగా లంబసింగి..
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధం గా ముందుకెళ్లాలని క్రీడలు, సాంస్కృతి శాఖ సమీక్షలో అధికారులను చంద్రబాబు ఆదేశించారు. లంబ సింగిని ప్రత్యేక అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని, అరకులో ప్రభుత్వ ఆర్చరీ అకాడమీలను ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి, చిత్తూరు, కర్నూలు, విజయవాడ, కాకినాడ, విశాఖలను అర్బన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాలన్నారు.
సీఎంను కలిసిన బ్రిటానియా ఎండీ
చిత్తూరు జిల్లాలో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ సానుకూలత వ్యక్తం చేసింది. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ.. యూనిట్ ఏర్పాటుకు అవకాశాలపై చర్చించారు. రూ.125 కోట్లతో ఏర్పాటుచేయనున్న యూనిట్ తొలి దశ నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా ప్రారంభిస్తామని ఆయన సీఎంకు చెప్పినట్లు కార్యాలయం పేర్కొంది.
20న సింగపూర్కు పయనం
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్గా స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేయనున్న సింగపూర్కు చెందిన అసెండాస్ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్తోపాటు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తదితరులతో చర్చించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రుల, అధికారుల బృం దం ఈ నెల 20వ తేదీ రాత్రి బయలుదేరి వెళ్లనుంది. ఈ బృందం నాలుగు రోజులపాటు అక్కడ పర్యటించనుంది.
దీనిపై సీఆర్డీఏ అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం. దీనికి గాను అసెండాస్ కంపెనీ ఏం కోరుకుంటోందనే అంశంపై సీఆర్డీఏ ఇటీవలే ఒక నోట్ను తయారు చేసింది. మాస్టర్ డెవలపర్గా ఉండేందుకు అది కొన్ని షరతులను విధించింది. వీటిపై నేరుగా సీఎం బృందం చర్చించనుంది. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించిన ఖర్చుపోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం, అసెండాస్ పంచుకోవాలని కంపెనీ షరతు విధించింది.
త్వరలో అన్న సంజీవని క్యాంటీన్లు
Published Tue, Sep 8 2015 2:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement