సాగు చేస్తున్న పైర్లపై చీడపీడలు పట్టినా పట్టించుకోవటం లేదంటూ భార్య తిట్టటంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు.
ధరూరు(మహబూబ్నగర్): సాగు చేస్తున్న పైర్లపై చీడపీడలు పట్టినా పట్టించుకోవటం లేదంటూ భార్య తిట్టటంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా ధరూరు మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ... మండలంలోని అల్వాలపాడు గ్రామానికి చెందిన కావలి లక్ష్మన్న (45) తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో పత్తి, వరి సాగు చేశాడు.
పత్తికి విపరీతంగా తెగుళ్లు సోకాయని...ఇంట్లో ఉన్న పురుగు మందును ఎందుకు పిచికారీ చేయడం లేదంటూ భార్య జములమ్మ ఆదివారం భర్తతో వాదనకు దిగింది. ఆమె మాటలకు మనస్తాపం చెందిన లక్ష్మన్న అదేరోజు సాయంత్రం ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. పరిచయస్తులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.