అంధత్వంతో పుట్టిన ముగ్గురు కొడుకులను పెంచి పెద్ద చేయడానికి హైదర్, ఫాతిమాలు పడుతున్న కష్టాలపై 'సాక్షి'ఫ్యామిలీ పేజీలో 'అల్లాహ్ కే ప్యారే బందే' శీర్షికతో ప్రచురితమైన కథనం ఎందరి మనసులనో కదిలించింది.
ఫ్యామిలీలో వచ్చిన కథనానికి స్పందన
కామారెడ్డి: అంధత్వంతో పుట్టిన ముగ్గురు కొడుకులను పెంచి పెద్ద చేయడానికి హైదర్, ఫాతిమాలు పడుతున్న కష్టాలపై 'సాక్షి'ఫ్యామిలీ పేజీలో 'అల్లాహ్ కే ప్యారే బందే' శీర్షికతో ప్రచురితమైన కథనం ఎందరి మనసులనో కదిలించింది. హైదరాబాద్కు చెందిన బీఎల్ కామేశ్వరి అనే మహిళ కథనాన్ని చదివి చలించిపోయూరు. తనవంతుగా ఆ కుటుంబానికి అండగా నిలవడానికి ముందుకు వచ్చి తమ బంధువు ద్వారా హైదర్, ఫాతిమాల కుటుంబానికిరూ రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందించారు. అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన సాయిబాబా స్కూల్ ఫర్ బ్లైండ్ అంధుల పాఠశాల నిర్వాహకుడు టీఎన్ ప్రభాకర్ ఆ ముగ్గురు పిల్లలను తన బడిలో చేర్పించుకుని చదివిస్తానని, వారికి కావలసిన భోజన, వసతి, బట్టలు వంటివి ఉచితంగా అందిస్తామని ముందుకు వచ్చారు.
ఈ విషయాన్ని ఆయన 'సాక్షి' కి తెలిపారు. హైదర్, ఫాతిమా లను కలిసి వారి పిల్లలను చదివించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. దయార్ధ హృదయులు వారికి కంటి చూపు కల్పించడానికి అవసరమైన సహకారం అందిస్తారని ఆశిద్దాం.