► భార్యాబిడ్డలకు నిద్రమాత్రలు, విషపు ఇంజెక్షన్ !
►హెడ్ కానిస్టేబుల్ కుటుంబం ఆత్మహత్య కేసులో వెల్లడైన నిజం
►హత్య కేసుగా నమోదు
యలహంక: ఐపీఎల్ బెట్టింగ్లు కుటుంబాన్ని మింగేశాయి. అతను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విచ్చలవిడిగా బెట్టింగ్ వేశాడు. ఆ కారణంతోనే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. బెట్టింగ్ ఒక సరదా. హద్దులు దాటి ఆడితే అదే సరదా ప్రాణాలు తీస్తుంది. ఇలాంటి సంఘటననే నగరంలో సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సీఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుభాష్చంద్ర ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చికిత్స అందిస్తున్న బాప్టిస్ట్ ఆసుపత్తి వైద్యురాలు ఇందిరా మీనన్ తెలిపారు.
ఈ ఘోరానికి మూలం ఐపీఎల్ బెట్టింగ్లేనని తెలుస్తోంది. అతని కుటుంబం ‘ఆత్మహత్యాయత్నం’ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మరణించడం తెలిసిందే. మంగళవారం వెలుగు చూసిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు యత్నించిన సుభాష్ మొదట భార్య వీణ, పిల్లలు, మణి, పథ్విలకు నిద్రమాత్రలు వేశారు. వారు నిద్రలోకి జారుకోగానే విషపు ఇంజెక్షన్లను ఇచ్చాడని వైద్యపరీక్షలో తేలినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత సుభాష్ కూడా నిద్రమాత్రలు మింగి తాను కూడా విషాన్ని ఇంజెక్ట్ చేసుకున్నాడు. విషం ధాటికి భార్య పిల్లు మరణించగా, ఇతడు కొనప్రాణంతో ఉండగా బంధువులు గమనించి ఆస్పత్రికి తరలించారు. విచారణలో వెలుగు చూసిన అంశాలతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.
విచ్చలవిడిగా ఐపీఎల్ పందేలు
తాజాగా ముగిసిన ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో బెట్టింగ్లే హెడ్కానిస్టేబుల్ సుభాష్ కుటుంబంలో ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మ్యాచ్లు మొదలైన రోజు నుంచి బెట్టింగ్లకు పాల్పడుతున్న సుభాష్ చాలా మ్యాచ్ల్లో ఓడిపోవడంతో బాగా నష్టపోయాడు. అతని ఒత్తిడితో భార్య వీణ అప్పుడప్పుడూ ఇంటి నుంచి డబ్బులు తెచ్చేదని వారి బంధువులు చెబుతున్నారు. ఆదివారం పుణే,ముంబయి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో సుభాష్ రూ.15 లక్షలకు పుణె గెలుస్తుందని పందెం కాశాడని తెలిసింది.
అయితే పుణె ఓడిపోవడంతో బెట్టింగ్రాయుళ్లు డబ్బుల కోసం ఇతనిపై ఒత్తిడి తెచ్చారు. సుభాష్ బళ్లారిలో ఉన్న స్నేహితులు, బంధువులను అప్పులు అడగగా అంతమొత్తంలో ఇవ్వలేమంటూ సమాధానాలు రావడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. దీంతో భార్యా, పిల్లలకు విషమివ్వాలనే భయంకరమైన ఆలోచన తట్టి ఉంటుందని చెబుతున్నారు. ఇతడు తక్కువ మోతాదులో నిద్రమాత్రలు, విషాన్ని ఇంజెక్ట్ చేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ బెట్టింగ్లే కొంపముంచాయి!
Published Thu, May 25 2017 11:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement