డుమ్మా కొట్టారు... సస్పెండయ్యారు | 2 teachers suspended after found missing on election duty | Sakshi
Sakshi News home page

డుమ్మా కొట్టారు... సస్పెండయ్యారు

Jun 19 2015 11:54 AM | Updated on Aug 14 2018 4:32 PM

డుమ్మా కొట్టారు... సస్పెండయ్యారు - Sakshi

డుమ్మా కొట్టారు... సస్పెండయ్యారు

ఎన్నికల విధులు నిర్వహణకు డుమ్మా కొట్టిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

ముజఫర్నగర్:  ఎన్నికల విధులు నిర్వహణకు డుమ్మా కొట్టిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో శుక్రవారం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు గురువారం జరిగాయి.  మహభారత్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎస్ కె బల్యన్, మరో పాఠశాలకు చెందిన రోహత్ కౌశిక్లు ఈ ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు.

దీంతో వారిద్దరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దాంతో విచారణకు ఆదేశించారు. ఆ వెంటనే వారిని సెస్పెన్షన్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆదేశాలు జారీ చేశారు. అలాగే బల్యన్ను జిల్లా టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement