ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య | youth suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Feb 13 2016 5:41 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లాలో శనివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి పట్టణానికి చెందిన మిర్యాల విద్యాసాగర్ కుమారుడు చాణక్య(23) బీఫార్మసీ పూర్తి చేశాడు.

భువనగిరి: నల్లగొండ జిల్లాలో శనివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి పట్టణానికి చెందిన మిర్యాల విద్యాసాగర్ కుమారుడు చాణక్య(23) బీఫార్మసీ పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు.

శుక్రవారం భువనగిరికి వచ్చిన అతడు శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి చాణక్య మరణించాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement