ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన ఆకుల సరిత కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం సాయంత్రం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో మృతిచెందింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.