నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య | woman commits suicide-at adilabad district | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య

Jan 28 2015 3:26 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం దోస్త్‌నగర్ గ్రామంలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

కడెం: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం దోస్త్‌నగర్ గ్రామంలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శనిగరపు నాగేందర్, ప్రసన్నలకు ఏడాది క్రితం వివాహమైంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ప్రసన్న మంగళవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే కడెం ఆసుపత్రికి తరిలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement