'ఎయిర్‌పోర్టు పేరు మారిస్తే ఉద్యమాలు చేస్తాం'

'ఎయిర్‌పోర్టు పేరు మారిస్తే ఉద్యమాలు చేస్తాం' - Sakshi


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రస్తుతం ఉన్న రాజీవ్ గాంధీ పేరును మార్చి..ఎన్టీఆర్ పేరు పెడితే ఉద్యమాలు చేస్తామని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. ఆ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.ఈ రోజు తెలంగాణ టి.కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పొన్నాల ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ నేత ఎన్నిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే అప్పగిస్తూ ఈ భేటీలో తీర్మానం చేశారు.


 


ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నాల.. ఎయిర్ పోర్టుకు పేరు మార్చి యోచన మంచి పద్దతి కాదని తెలిపారు. దీనిపై కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. పోలవరం ఆర్డినెన్స్‌ అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను కేంద్రం వెంటనే నిలిపివేయాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top