
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్–గౌహతి (02513/02514) స్పెషల్ ట్రైన్ జనవరి 2, 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27, మార్చి 5, 12, 19, 26 తేదీల్లో (గురువారం) ఉదయం 5.40 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 8.45 గంటలకు గౌహతి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో జనవరి 4, 11, 18, 25, ఫిబ్రవరి 1,8, 15, 22, 29, మార్చి 7,14, 21, 28 (శనివారం)తేదీల్లో రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మంగళవారం ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–రెక్సాల్ (07091/ 07092) స్పెషల్ ట్రైన్ జనవరి 7, 14, 21, 28 ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 3, 10, 17, 24, 31, (మంగళవారం) తేదీల్లో రాత్రి 9.40 గంటలకి బయల్దేరి గురువారం సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో జనవరి 10, 17, 24, 31, ఫిబ్రవరి 7, 14, 21, 28, మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3 తేదీల్లో (శుక్రవారం) మధ్యాహ్నం 12.45 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 6.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.